Home » Kishan Reddy G
దేశవ్యాప్తంగా బొగ్గుకు ఒకే ధర ఉండేలా త్వరలో కోల్ ఎక్స్ఛేంజ్ ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర మంత్రి కిషన్రెడ్డి తెలిపారు. తక్కువ ధరకు విద్యుత్ అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా కేంద్రం చర్యలు చేపడుతోందన్నారు.
ప్రధానమంత్రి నరేంద్రమోదీపై అభ్యంతరకర పోస్టులు పెట్టిన వారిపై ఫిర్యాదు చేయడం రాజ్యాంగ హక్కు అని కేంద్రమంత్రి కిషన్రెడ్డి వ్యాఖ్యానించారు.
PKOC-2 డిప్సైడ్ కోల్ బ్లాక్ సింగరేణికి దక్కడం సంతోషకరమని కేంద్రమంత్రి కిషన్రెడ్డి పేర్కొన్నారు.
తెలంగాణ ఉద్యమంలో 369 మంది విద్యార్థులను కాల్చిన చంపిన చరిత్ర గల కాంగ్రెస్ పార్టీకి విద్యార్థుల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్రెడ్డి అన్నారు. తెలంగాణ ఉద్యమంలో విద్యార్థుల పట్ల కర్కశ వైఖరి అవలంభించిన చరిత్రను మరిచి.. ఇప్పుడు ఢిల్లీలోని జంతర్మంతర్లో విద్యార్థులపై జరిగిన లాఠీచార్జిపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ నీతిసూత్రాలు వల్లె వేస్తున్నారని మండిపడ్డారు.
దేశంలో ఏడు బుల్లెట్ ట్రైన్లలో మూడు తెలంగాణాకు రాబోతున్నాయని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి వెల్లడించారు. ఈ బుల్లెట్ ట్రైన్ల ద్వారా రూ.5 లక్షల కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని తెలిపారు. తెలంగాణ అభివృద్ధిలో ఈ మూడు బుల్లెట్ ట్రైన్లు గేమ్ చెంజర్ కాబోతున్నాయని వివరించారు.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పదో తరగతి పేపర్ లీక్ అయిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గుర్తు చేశారు. మరి ముఖ్యమంత్రి పదవికి రేవంత్ రెడ్డి రాజీనామా ఎందుకు చేయలేదని ఆ పార్టీ నేతలను ఆయన నిలదీశారు.
సింగరేణికి నైనీ కోల్ బ్లాక్ కేటాయించిన ప్రధాని నరేంద్ర మోదీకి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. సింగరేణిని అప్పుడు బీఆర్ఎస్, ఇప్పుడు కాంగ్రెస్ దోచుకుంటున్నాయని ఆరోపించారు.
కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో సింగరేణి భరోసా యాత్రను భారతీయ జనతా పార్టీ చేపట్టనుంది. ఈ నెల 13, 14 తేదీల్లో ఈ యాత్రను నిర్వహించనుంది.
హైదరాబాద్లోని కాచిగూడ డివిజన్లో పాదయాత్ర అనంతరం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు రెండు రోజుల పాటు సింగరేణి భరోసా యాత్ర చేపడుతున్నట్లు ప్రకటించారు.
తెలంగాణ సింగరేణి కోల్ కాలరీస్ లిమిటెడ్ అభివృద్ధి విషయంలో కేంద్ర ప్రభుత్వం గత 12 ఏళ్లుగా అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.