తెలంగాణ ఉద్యమకారుల హామీలు నెరవేర్చాలి
ABN, Publish Date - Jun 30 , 2025 | 11:51 PM
అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రాష్ట్ర ప్రభు త్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని తెలం గాణ ఉద్యమకారులు చేపట్టిన శాంతియుత దీక్షకు మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్యేలు దాసరి మనోహర్ రెడ్డి, గుజ్జుల రామకృష్ణారెడ్డి, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రఘువీర్ సింగ్లు సంఘీభావం ప్రక టించారు.
పెద్దపల్లి, జూన్ 30 (ఆంధ్రజ్యోతి): అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రాష్ట్ర ప్రభు త్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని తెలం గాణ ఉద్యమకారులు చేపట్టిన శాంతియుత దీక్షకు మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్యేలు దాసరి మనోహర్ రెడ్డి, గుజ్జుల రామకృష్ణారెడ్డి, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రఘువీర్ సింగ్లు సంఘీభావం ప్రక టించారు. సోమవారం తెలంగాణ ఉద్యమకా రుల ఫోరం ఆ!ధ్వర్యంలో పెద్దపల్లిలో గల తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద ఉద్య మకారులు శాంతి యుత దీక్ష చేప ట్టారు. ఎన్నికల సం దర్భంగా రాష్ట్ర ప్రభు త్వం ఇచ్చిన హామీ లను నెరవేర్చాల న్నారు.
మాజీ మం త్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ కాం గ్రెస్ పార్టీ అధికారం లోకి రావడానికి అనే క హామీలను ఇచ్చి గద్దెనెక్కిన తర్వాత ఒక్క హామీ నెరవేర్చడం లేదని విమర్శిం చారు. తెలంగాణ ఉద్యమకారులకు 250 గజా ల ప్రభుత్వ స్థలంతోపాటు ఇల్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చిందన్నారు. ఏడాదిన్నర కావస్తున్నా ఇప్పటి వరకు ఉద్యమకారుల గురించి పట్టించుకోవడం లేదన్నారు. ఇప్ప టికైనా ప్రభుత్వం ఉద్యమకారులకు ఇచ్చిన హామీని నెరవేర్చాలని, లేదంటే ఉద్యమకారుల ఆగ్రహానికి గురి కాక తప్పదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
Updated Date - Jun 30 , 2025 | 11:51 PM