Home » Sircilla
జిల్లాలో ఉపాధిహామీ పథకం పనులు నింపాదిగానే జరుగుతున్నాయి. ఆశించిన విధంగా ఊళ్లల్లో చేతినిండా కూలీలకు పనులు దొరకడం లేదు. ఈ ఆర్థిక సంవత్సరం మొదలై అప్పుడే నాలుగు నెలలు దాటినా క్షేత్రస్థాయిలో పురోగతి కనిపించడం లేదు. దీంతో ఈ ఏడాదిలో నిర్దేశించిన లక్ష్య సాధన విషయంలో వెనుకబడుతున్నామనే ఆందోళనలో అధికారులున్నారు.
వందేళ్లకు పైగా సాగిన బ్రిటిష్ పాలనకు చరమగీతం పాడిన 1947 ఆగస్టు 15న దేశవ్యాప్తంగా ప్రజలు సంబరాలు జరుపుకున్నారు. కానీ నిజాం పాలనలో ఉన్న హైదరాబాద్ సంస్థానంలో మాత్రం జాతీయ జెండా రెపరెపలాడని నిర్బంధ పరిస్థితుల్లో తెలంగాణలో స్వేచ్ఛా గీతం వినిపించేందుకు సాగిన పోరులో రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎందరో త్యాగధనులు ప్రజల్లో చైతన్యాన్ని రగిలించారు.
నడకతో ఆరోగ్యం లభిస్తుందని వన్టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి అన్నారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఫిట్ ఇండియా, హెల్త్ ఇండియా కార్యక్రమంలో భాగంగా శుక్రవారం లయన్స్క్లబ్ మగువ అధ్యక్షురాలు అం బటి అర్చన సంతోష్రావు ఆధ్వర్యంలో నిర్వహించిన 2కే రన్ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు.
ఆయిల్పామ్ సాగుతో రైతులు అధిక ఆదా యాన్ని పొందవచ్చని జిల్లా ఉద్యానవన, పట్టు పరిశ్రమల శాఖ అధికారి శ్యాం ప్రసాద్ అన్నారు. శుక్రవారం ఆయిల్పామ్ తోటలను పరిశీలించారు.
కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే దళిత నాయకుడనే అవమానించారని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మక్కాన్సింగ్ ఆరోపించారు. ఈ సందర్భంగా స్థానిక బస్టాండ్ అంబెద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపారు.
సుల్తానాబాద్ లో ఈనెల 17న రూ.250 కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు మంత్రుల చేతులమీదుగా శ్రీకారం చుట్టనున్నట్లు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు. మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తుమ్మల నాగేశ్వర్ రావు, దుద్దిళ్ళ శ్రీధర్బాబు పాల్గొని శంకుస్థాపనలు చేయ నున్నట్లు వివరించారు.
విద్యా సంవత్సరం ప్రారంభమై మూడు నెలలు గడుస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించడంలో విఫలమైందని, వెంటనే సమస్యలను పరిష్కరించాలని యూఎస్పీసీ ఆధ్వర్యంలో తహసీల్దార్ యాకన్నకు వినతిపత్రం అందించారు.
నేత్రదానం, అవయవాల దానం కోసం ప్రజలు చైతన్యవంతులు కావాలని తహసీల్దార్ వనజ కోరారు. ప్రపంచ అవయవదాన దినోత్సవంలో భాగంగా గురువారం కస్తూర్బా కళాశాలలో సదాశివ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అవగాహన సమావేశాన్ని నిర్వహించారు.
నియోజకవర్గ అభివృద్ధి, రైతుల సంక్షేమమే లక్ష్యంగా నిరంతరం పని చేస్తున్నానని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణరావు అన్నారు. గురువా రం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో జరిగిన మండల సర్వసభ్య సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
ప్రధా ని మోదీ నాయకత్వంలో దేశం అభివృద్ధి పథంలో దూసుకెళ్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచం దర్ రావు పేర్కొన్నారు. పెద్దపల్లి ప్రభుత్వ జూని యర్ కళాశాల ఆవరణలో గురువారం నిర్వహిం చిన హర్ ఘర్ తిరంగా ర్యాలీని ఆయన ప్రారం భించారు.