Home » Sircilla
జిల్లా కేంద్రంలో మంగళవారం పాలిసెట్ ప్రశాంతంగా జరిగాయి. జిల్లాలో ఆరు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయగా 2488మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కావాల్సి ఉండగా 2366మంది విద్యార్థులు హాజరు కాగా 122మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు.
రామగుండం నగర పాలక సంస్థలో పని చేస్తున్న అవుట్ సోర్సింగ్ కార్మి కులు, సిబ్బందిపై అధికారుల వేధింపులు ఆపాలని, లేకపోతే నిరవధిక సమ్మె తప్పదని కార్మిక సంఘాలు జాయింట్ యాక్షన్ కమిటీ పేర్కొన్నది. మంగళవారం కార్యాలయ ప్రాంగణంలో యూనియన్ ప్రతినిధులు కార్మికులతో సమావేశం నిర్వహించారు.
మండలంలోని శివపల్లి, ర్యాకల్ దేవ్పల్లి, లోకపేట్ గ్రామాల్ల్లో నిర్వ హిస్తున్న భూ భారతి రెవెన్యూ సదస్సులను జిల్లా రెవెన్యూ డివిజ నల్ అధికారి గంగ య్య సందర్శించారు. ఆయన శివపల్లిలో మాట్లాడారు.
రామగుండంలో నిరుద్యో గులకు ఉపాధి అవకాశాల కోసం తలపెట్టిన జాబ్ మేళాను విజయ వంతం చేయాలని ఆర్జీ-1 జీఎం లలిత్కుమార్ పిలుపునిచ్చారు. మంగళవారం ఆర్జీ-1 జీఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేక రుల సమవేశంలో ఆయన మాట్లాడుతూ, ఆర్జీ-1 కమ్యూనిటీ హాల్ లో ఈ నెల 18న వంద కంపెనీలు యువతకు ఉద్యోగావకాశాలు కల్పించడానికి రానున్నాయని, ఆర్జీ-1, 2, 3 ఏరియాలతో పాటు పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల నుంచి 10వేల మంది నిరుద్యోగులు ఈ ఇంటర్వ్యూల్లో పాల్గొంటారని చెప్పారు.
ధాన్యాన్ని వేగవంతంగా కొనుగోలు చేయాలని అదనపు కలెక్టర్ డి.వేణు అన్నారు. సోమవారం పెద్దకల్వల, మూలసాల గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ధాన్యం కొనుగోలు వివరాలు, అందుబాటులో ఉన్న టార్ఫాలిన్ కవర్లు, గన్ని బ్యాగులు, కొనుగోలు చేసిన ధాన్యం మిల్లులకు తరలింపు తదితర వివరాలను తెలుసుకున్నారు.
అర్హులకు యువ వికాసం కింద స్వయం ఉపాధి యూనిట్ మంజూరు చేయాలని, నిబంధనలు పాటించా లని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. సోమవారం కలెక్టరేట్లో రాజీవ్ యువ వికాసంపై సంబం ధిత అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహిం చారు. కలెక్టర్ మాట్లాడుతూ, రాజీవ్ యువ వికా సం కింద వచ్చిన దరఖాస్తుదారులు గతంలో ఏదైనా ఎన్పిఏ, వారి క్రెడిట్ హిస్టరీ పరిశీలించి అర్హులైన జాబితా బ్యాంకర్ల ద్వారా సేకరించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు.
పాలీసెట్ 2025కు ఏర్పాటు పూర్తయినట్లు జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ కె.లక్ష్మీనర్సయ్య పేర్కొన్నారు. జిల్లాలో ఆరు పరీక్ష కేంద్రాల్లో మంగళవారం పరీక్ష నిర్వహిస్తున్నామని, జిల్లాలోని 2488 మంది విద్యార్థులు హాజరు కానున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా సోమవారం పరీక్ష కేంద్రాలను పరిశీలించారు.
గౌతమ బుద్ధుడి బోధనలు విశ్వమానవాళికి ఆచరణనీయమని ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు. వడుకాపూర్ గ్రామ పరిధిలో గల అతి ప్రాచీన బౌద్ధ స్తూపం వద్ద సోమవారం బుద్దపూర్ణిమను పురస్కరించుకుని జూలపల్లి, ఎలిగేడు మండలాల దళిత సంఘాల నాయకులు, బౌద్ధిస్టులు గౌతమ బుద్ధుడి జయంతి ఘనంగా నిర్వహించారు.
స్థానిక పోరు ఇప్పట్లో రానంటున్నాయ్.. ఒకవైపు ప్రభుత్వం గ్రామపంచాయతీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లతో సర్వం సన్నద్ధమైన సామాజికవర్గాల రిజర్వేషన్లు బ్రేక్ వేస్తున్నాయి. ప్రధానంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల పంచాయతీ తేలే వరకు స్థానిక ఎన్నికలు జరిగే సంకేతాలు కనిపించడం లేదు. ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఎన్నికలను ఊరిస్తూ వాయిదాలు వేస్తోంది.
నకిలీ బిల్లులు, పనులు, కుంభకోణాలకు పెట్టింది పేరు రామగుండం నగరపాలక సంస్థ... గతంలో రోడ్డు వేయకుండానే వేసినట్టు బిల్లులు దండుకున్న చరిత్ర కార్పొరేషన్ది. కొనుగోలు చేయకుండానే కొనుగోలు చేసినట్టు బిల్లులు రికార్డు చేసుకున్నారు. కాలువల పూడికతీత మొదలు, అంతిమ సంస్కారాల వరకు దేనిని వదలకుండా అందినంత దండుకున్నారు.