• Home » Sircilla

Sircilla

కరీంనగర్‌ ఎవరిదో..?

కరీంనగర్‌ ఎవరిదో..?

రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. కరీంనగర్‌ కార్పొరేషన మేయర్‌, డిప్యూటీ మేయర్‌ ఎన్నిక అత్యంత ఉత్కంఠ రేకెత్తిస్తున్నది. ఏ నోట విన్నా, ఎక్కడ నలుగురు కూర్చున్నా... కార్పొరేషనలో బీజేపీ అధికారం చేపడుతుందా.. కాంగ్రెస్‌ కైవసం చేసుకుంటుందా సోమవారం ఏమి జరుగబోతుంది.. అన్న చర్చే వినవస్తుంది.

పీఠం దక్కేదెవరికో..?

పీఠం దక్కేదెవరికో..?

జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో చైర్మన్లు, వైస్‌ చైర్మన్ల ఎన్నిక సోమవారం జరగనుంది. జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి, రాయికల్‌, ధర్మపురి మున్సిపాలిటీల్లో సోమవారం మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రత్యేక సమావేశం ప్రారంభం కానుంది.

భక్తజనసంద్రంగా వేములవాడ

భక్తజనసంద్రంగా వేములవాడ

మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా హరిహరక్షేత్రంగా పిలువబడుతున్న వేములవాడ రాజరాజేశ్వరస్వామి అనుబంధ భీమేశ్వరాలయం ఓం నమః శివాయ నామస్మరణతో మర్మోగింది. భీమేశ్వఆరలయం ఆదివారం భక్తజనసంద్రంగా మారింది. దాదాపు ఒక లక్షకు పైగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.

కొలువుదీరనున్న పాలకవర్గాలు

కొలువుదీరనున్న పాలకవర్గాలు

మున్సిపల్‌ పాలకవర్గాలు సోమవారం కొలువుతీరనున్నాయి. ఈనెల 11వ తేదీన ఎన్నికలు జరగగా, 13న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను వెల్లడించారు. ఆ వెంటనే గెలిచిన అభ్యర్థులను ఆయా పార్టీల నాయకులు క్యాంపులకు తరలించారు. జిల్లాలోని రామగుండం, పెద్దపల్లి, సుల్తానా బాద్‌, మంథని మున్సిపాలిటీలో కాంగ్రెస్‌ మెజార్టీ స్థానాల్లో గెలుపొంది ఇతర పార్టీలు, స్వతంత్రుల మద్దతు లేకుండానే మేయర్‌, డిప్యూటీ మేయర్‌, చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ పదవులను దక్కించుకునేందుకు స్పష్టమైన మెజార్టీ సాధించింది. కౌంటింగ్‌ పూర్తికాగానే గెలుపొందిన వారిని ఆ పార్టీ నాయకులు క్యాంపులకు తరలించారు.

ఒకే ఇంట్లో 22 ఓట్లు

ఒకే ఇంట్లో 22 ఓట్లు

సుల్తానాబాద్‌ మున్సిపాలిటీ పరిధిలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని కాంగ్రెస్‌ నాయకులు అక్రమాలకు పాల్పడ్డారని 9వ వార్డు నుంచి నాలుగు ఓట్ల తేడాతో ఓటమిపాలైన బీఆర్‌ఎస్‌ అభ్యర్థి సూర శ్యామ్‌ అన్నారు. ఆదివారం విలేకరుల సమావే శంలో మాట్లాడుతు 9వ వార్డులో కాంగ్రెస్‌ అభ్యర్థి ఇంటి నంబరుపైన 22 ఓట్లు నమోదు చేయించారన్నారు.

ముఖ్యమంత్రిని కలిసిన రామగుండం కార్పొరేటర్లు

ముఖ్యమంత్రిని కలిసిన రామగుండం కార్పొరేటర్లు

రామగుండం నగర పాలక సం స్థకు కొత్తగా ఎన్నికైన కాంగ్రెస్‌ కార్పొరేటర్లు ఆదివారం ఎమ్మెల్యే రాజ్‌ఠా కూర్‌ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలిశారు. కాంగ్రెస్‌ కార్పొరేటర్లతో పాటు కాంగ్రెస్‌లో చేరిన ఆరుగురు ఫార్వర్డ్‌ బ్లాక్‌ కార్పొరేటర్లు, ఇద్దరు బీఆర్‌ఎస్‌ కార్పొరేటర్లు ముఖ్యమంత్రిని కలిసిన వారిలో ఉన్నారు.

పుణ్యక్షేత్రాలు సందర్శిస్తున్న కౌన్సిలర్లు

పుణ్యక్షేత్రాలు సందర్శిస్తున్న కౌన్సిలర్లు

సుల్తానాబాద్‌ మున్సి పాలిటీ పరిధిలో గెలుపొందిన కౌన్సిలర్లు పుణ్యక్షేత్రాలకు వెళ్ళారు. ఈ నెల 13న ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే కౌంటింగ్‌ కేంద్రం నుంచే కాంగ్రెస్‌ కౌన్సిలర్లతోపాటు మరో ఏఐఎఫ్‌బీ అభ్యర్థి శ్రావణితో కలుపుకొని క్యాంపునకు తరలివెళ్ళారు. ఎమ్మెల్యేను కలిసి అదే రోజు రాత్రి షిర్డీ వెళ్ళారు.

హరహర మహదేవ శంభోశంకర..

హరహర మహదేవ శంభోశంకర..

ఓం నమః శివాయ... హర హర మహదేవ నామస్మరణతో శైవక్షేత్రాలు కిటకిటలాడాయి. ఆదివారం మహాశివరాత్రి పురస్కరించుకుని ఉదయం నుంచే స్వామిని దర్శించుకునేందుకు భక్తులు బారులుదీరారు. గోదావరి నదీ స్నానాలు ఆచరించారు. పలు ఆలయాల్లో శివ కల్యాణాలను నిర్వ హించారు. భక్తులు కల్యాణాల్లో అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

ప్రజాపాలనకు మున్సిపల్‌ ఫలితాలే నిదర్శనం

ప్రజాపాలనకు మున్సిపల్‌ ఫలితాలే నిదర్శనం

కోల్‌బెల్ట్‌ ప్రాంతంలో జరిగిన మున్సిపల్‌, కార్పొరేషన్‌ ఎన్నికల ఫలితాలే కాంగ్రెస్‌ పార్టీ ప్రజాపాలనకు అద్దం పడుతాయని ఐఎన్‌టియుసి జనరల్‌ సెక్రటరీ జనక్‌ప్రసాద్‌ అన్నారు. శనివారం సెంటినరీకాలనీ ఐఎన్‌టియుసి భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

గ్రామీణ ప్రాంత క్రీడాకారులకు ప్రోత్సాహం

గ్రామీణ ప్రాంత క్రీడాకారులకు ప్రోత్సాహం

గ్రామీణ ప్రాంత క్రీడా కారులను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సీఎం కప్‌ క్రీడలను నిర్వ హిస్తుందని జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి అక్కపాక సురేష్‌ అన్నారు. సుల్తానాబాద్‌ జూనియర్‌ కళాశాల మైదానంలో శనివారం సీఎం కప్‌ జిల్లాస్థాయి క్రీడలను ప్రారంభించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి