Home » Sircilla
ఎన్టీపీసీ జడ్పీ ఉన్నత పాఠశాలలో జిల్లా స్థాయి సైన్స్ ఫెయిర్ గురువారంతో ముగిసింది. దీనికి ముఖ్యఅతిథిగా పా ల్గొన్న జిల్లా విద్యాధికారి శారద మాట్లాడుతూ విద్యా ర్థులు శాస్ర్తీయ ఆలోచన బేష్గా ఉందని, సృజనాత్మక ఆవిష్కరణలు అద్భుతంగా ఉన్నాయని అభినందించారు.
పంచాయతీ ఎన్ని కలను నిబంధన ప్రకారం నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ ఐ.రాణికుముదిని అన్నారు. పంచాయతీ ఎన్నికల నిర్వహణపై కలెక్టర్లతో గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించగా కలెక్టర్ కోయ శ్రీహర్ష, పాల్గొ న్నారు.
రామగుండాన్ని సింగరేణి సిటీగా అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే మక్కాన్సింగ్ రాజ్ఠాకూర్ పేర్కొ న్నారు. రెండేళ్ల పాలన, రామగుండంకు 800మెగావాట్ల విద్యుత్ కేంద్రం మంజూరు సందర్భంగా గురువారం రాత్రి మెయిన్ చౌరస్తాలో బహిరంగ సభ నిర్వహించారు.
పత్తి సాగు చేసిన రైతులు సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి ప్రభుత్వ మద్దతు ధర పొందాలని ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు అన్నారు. గురువారం నిమ్మనపల్లి మహాలక్ష్మి జిన్నింగ్ మిల్లులో సిసిఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు.
రామ గుండంలో వందల కోట్ల రూపాయలతో జరుగుతున్న అభివృద్ధి పనులను చూడలేకనే మాజీ ఎమ్మెల్యే కోరు కంటి చందర్, నాయకుడు కౌశిక హరి ఎమ్మెల్యేపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని కాంగ్రెస్ నగర అధ్యక్షుడు బొంతల రాజేష్, మహంకాళి స్వామి అన్నారు
అంగవైక్యలం శరీరానికే కానీ, మనసుకు కాదని అదనపు కలెక్టర్ దాసరి వేణు అన్నారు. బుధవా రం జిల్లా సంక్షేమ అధికారి ఆధ్వర్యంలో కలెక్టరేట్ పరేడ్ గ్రౌండ్లో నిర్వ హించిన అంతర్జాతీయ దివ్యాంగ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు.
అభ్యంతరాల పరి ష్కారం తర్వాతే బైపాస్ రోడ్డు భూ సేకరణ జరుగుతుందని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. బుధవారం అప్పన్నపేట గ్రామంలో పెద్దపల్లి బైపాస్ రోడ్డు నిర్మాణానికి అవసరమైన భూసేకరణ నిమిత్తం చేపట్టిన ఎంజాయింట్ సర్వే ప్రక్రియను కలెక్టర్ కోయ శ్రీ హర్ష పరిశీలించారు.
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ప్రణాళికాబద్ధంగా చెరువుల అభివృద్ధి చర్యలు తీసుకొంటున్నామని అదనపు కలెక్టర్ దాసరి వేణు తెలిపారు. మండలంలోని పారుపల్లి చెరు వును అదనపు కలెక్టర్ డి.వేణు, ఇరిగేషన్ ఈఈ బలరాం, ఫారెస్ట్ జిల్లా అధికారి శివయ్యలు సందర్శించారు.
ప్రభుత్వ పాఠశాలల్లో నెల రోజుల్లో బోధన పద్ధతుల్లో మార్పులు కనిపించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. మంగళవారం కలెక్టరేట్లో అకాడమిక్ ప్యానెల్ బృం దాల పాఠశాలల పరిశీలనపై అధికారులతో సమీక్షించారు.
జిల్లాలోని వైద్య ఆరోగ్య శాఖ సబ్బంది సమయపాలన కచ్చితంగా పాటించాలని, ఆసుపత్రులు, ఆరోగ్య కేంద్రాలలో సత్వరం వైద్య సేవలు అందించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వాణిశ్రీ అన్నారు.