Home » Peddapalli
రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో గౌడ కులస్థులకు ఉపాధి కల్పించేలా సింగరేణి భూములను కేటాయించా లని కాలనీ గౌడ సంక్షేమ సంఘం నాయకులు డిమాం డ్ చేశారు.
గోదావరిఖనికి చెందిన సీనియర్ న్యాయవాది గోషిక ప్రకాష్ మంగళవారం గుండెపోటుతో మరణించాడు. ప్రకాష్ మృతదేహాన్ని వైద్య విద్యార్థుల పరిశోధన కోసం దోహదపడే విధంగా అనాటమీ విభాగానికి అప్పగించి కుటుంబ సభ్యులు ఆదర్శంగా నిలిచారు.
మాజీ స్పీకర్ స్వర్గీయ దుద్దిళ్ళ శ్రీపాదరావు, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్బాబు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి శ్రీనుబాబు కుటుంబ సభ్యులపై మరోసారి మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహిం చేది లేదని పలువురు కాంగ్రెస్ నేతలు వెల్లడిం చారు.
వైద్యులు సమయపాలన పాటించాలని, విధులను సక్రమంగా నిర్వహిచాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష వైద్యులకు సూచించారు. బుధవారం గోదావరిఖని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ క్రిటికల్ కేర్, సర్జరీ బ్లాక్లు, ఆర్థోపెడిక్, జనరల్ వార్డులను పరిశీలించారు.
ఇటీవల బస్సు ప్రమాదంలో గాయపడిన ఇంటర్మీడియట్ విద్యార్థిని పడాల మేఘనకు గోదావరిఖని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల చేయూతనిచ్చింది. తోటి విద్యార్థినులు, అధ్యాపకులు విరాళంగా సేకరించిన రూ. 50వేలను నగదును మంగళవారం కళాశాల ఆవరణలో జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారిణి, ప్రిన్సిపల్ డి.కల్పన చేతులమీదుగా విద్యార్థినీ తల్లిదండ్రులకు అందజేశారు.
రామగుండం నగరపాలక సంస్థలో 2 నుంచి 11వరకు శానిటేషన్పై స్పెషల్ డ్రైవ్ నిర్వహించనున్నట్టు నగరపాలక సంస్థ కమిషనర్ అరుణశ్రీ చెప్పారు. మంగళవారం అధికారులు, సిబ్బందితో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.
అసెంబ్లీ ఎన్నికల్లో మంత్రి శ్రీధర్బాబు నియోజకవర్గ ప్రజలకు, మ్యానిఫెస్టో కమిటీ చైర్మన్గా రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై మాజీ ఎమ్మెల్యేగా ప్రశ్నిస్తుంటే కాంగ్రెస్ పార్టీ నేతలు తనను వ్యక్తిగతంగా దూషించేలా మంత్రితోపాటు ఆయన సోదరుడు వారిని ప్రోత్సహిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు ధ్వజమెత్తారు.
కూనా రం ఆర్వోబీ నిర్మాణాన్ని జూలైలోగా పూర్తి చేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆర్అండ్బి అధికారులను ఆదేశిం చారు. మంగళవారం కూనారం రైల్వే ఫ్లై ఓవర్ బ్రిడ్జి, ఆర్అండ్బి అతిథిగృహం ప్రహరి పనులను పరిశీలిం చారు.
మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు అధికార యత్రాంగం సన్నద్ధమవు తోంది. రాష్ట్రంలోని 117 మున్సిపాలిటీలు, ఆరు కార్పొరే షన్లలో ఎన్నికల నిర్వహణకు తాము సిద్ధమేనని ఈ నెల 27న మున్సిపల్ డైరెక్టర్ శ్రీదేవి రాష్ట్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. ఈ మేరకు ఎన్నికల సంఘం మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు చర్యలు చేపట్టింది.
ప్రజావాణి అర్జీలను సత్వ రమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ డి.వేణు అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో ప్రజల నుంచి దరఖాస్తులను స్వీక రించారు.