• Home » Peddapalli

Peddapalli

సీజనల్‌ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి

సీజనల్‌ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి

ఈ వర్షాకాలంలో సీజనల్‌ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు ఆరోగ్య సూచనలు సలహాలు అందిస్తూ వారి ఆరోగ్య పరిరక్షణ చర్యలు చేపట్టాలని ప్రభుత్వ విప్‌, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు. మంగళవారం సుల్తానాబాద్‌ మున్సిపల్‌ పాలక మండల సమావేశం జరిగింది.

 ఇండస్ట్రియల్‌  పార్క్‌ ఏర్పాటుకు సహకరించాలి

ఇండస్ట్రియల్‌ పార్క్‌ ఏర్పాటుకు సహకరించాలి

దర్యాపూర్‌ గ్రామ శివారులోని సర్వే నెంబర్‌ 140, 141, 144, 145, 149 లో ఇండస్ట్రియల్‌ పార్క్‌ ఏర్పాటుకు రైతులు, గ్రామస్తులు సహకరించాలని మంథని ఆర్డీఓ సురేష్‌, గోదావరిఖని ఏసీపీ మడత రమేష్‌ కోరారు. ఇండస్ట్రియల్‌ పార్క్‌ ఏర్పాటుతో భూములు కొల్పోతున్న రైతులతో సర్పంచ్‌ రాపల్లి రాజయ్య ఆధ్వర్యంలో మంగళవారం గ్రామ సభ నిర్వహించారు.

ప్రభుత్వం కోడిగుడ్లను సరఫరా చేయాలి

ప్రభుత్వం కోడిగుడ్లను సరఫరా చేయాలి

ప్రభుత్వం కోడిగుడ్లు సరఫరా చేసే వరకు విద్యార్థులకు కోడి గుడ్లను అందించలేమని మధ్యాహ్న భోజన రాష్ట్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పూసాల రమేష్‌, సీపీఐ జిల్లా కార్యదర్శి తాండ్ర సదానందం, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి సునీల్‌లు స్పష్టం చేశారు.

విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలి

విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలి

గోదావరిఖని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నెలకొన్న సమస్యలను సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు ఎస్‌ వీరయ్య మంగళవారం సందర్శించారు. పాఠశాలలోని తరగతి గదులు, మరుగుదొడ్లు, మధ్యాహ్న భోజన వంటశాల, తాగునీటి సౌకర్యం మౌలిక వసతులను పరిశీలించి విద్యార్థులతో మాట్లాడారు.

పున్నమి పోయినా.. ఏరువాక సాగలే

పున్నమి పోయినా.. ఏరువాక సాగలే

ఏరువాక పౌర్ణమి పోయినా వ్యవసాయ పనులు ప్రారంభం కాలేదు. మృగశిర కార్తెతో దుక్కులు దున్ని నార్లు పోసి ఆరుద్ర కార్తెతో రైతన్నలు ఏరువాక సాగేందుకు పున్నమి కోసం ఎదురుచూస్తుంటారు. మృగశిర, ఆరుద్ర పోయి ఏరువాక పౌర్ణమి గడిచినా వ్యవసాయ పనులు ప్రారంభం కాలేదు.

భారంగా రైతు వేదికలు

భారంగా రైతు వేదికలు

ఆధునిక పద్ధతుల్లో వ్యవసాయం ముందుకు సాగే విధంగా రైతులను సంఘటిత పరుస్తూ వారి ఆర్థిక ఎదుగుదలకు వేదికగా గత ప్రభుత్వం రైతు వేదికలను ఏర్పాటు చేసింది. చాలాకాలంగా ఇవి రైతులకు చేరువకాకుండా కునారిల్లుతూ వచ్చాయి.

‘సర్‌’ కష్టాలు..

‘సర్‌’ కష్టాలు..

కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియలో ఎన్యూమరేషన్‌ ఫారాల భర్తీ ఓటర్లకు సవాల్‌గా మారింది. ముఖ్యంగా 2002 నాటి ఓటరు జాబితా వివరాలను తప్పని సరిగా నమోదు చేయాల్సి రావడంతో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఓటర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

అర్హులకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలి

అర్హులకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలి

అర్హులైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయాలని సీపీఐ జాతీయ నాయకులు మాజీ ఎమ్మెల్యే చాడ వెంకట్‌ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. సోమవారం పెద్దపల్లి మండల సమితి ఆధ్వర్యంలో జిల్లా కార్యాలయంలో జిల్లా కార్యదర్శి తాండ్ర సదానందం అధ్యక్షతన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

బీసీలు పాలకులుగా ఎదగాలి

బీసీలు పాలకులుగా ఎదగాలి

దశాబ్దాల రాజకీయ బానిసత్వానికి చరమగీతం పాడి పాలించే నేతలుగా బీసీలు ఎదగాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్‌ పిలుపునిచ్చారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఆర్యవైశ్యభవన్‌లో సోమవా రం బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నల్లవెల్లి శంకర్‌ అధ్యక్షతన నిర్వహించిన ఆత్మీయ సమావేశానికి ఆయన హాజరై మాట్లా డారు.

అభివృద్ధి విషయంలో రాజీపడేది లేదు

అభివృద్ధి విషయంలో రాజీపడేది లేదు

అభివృద్ధి విషయంలో రాజీ పడేది లేదని, రాష్ట్రంలోనే పెద్దపల్లి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తుందని ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు అన్నా రు. సోమవారం పెద్దబొంకూరులో రూ.2.40 కోట్లతో నిర్మించిన హై లెవెల్‌ వంతెన, రూ.12 కోట్లతో నిట్టూరు నుండి కాచాపూర్‌ వరకు బీటీ రోడ్డును ప్రభుత్వ విప్‌, పెద్దపల్లి ఎమ్మెల్యే చిం తకుంట విజయరమణరావు ప్రారంభించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి