• Home » Peddapalli

Peddapalli

‘సర్‌’పై కాంగ్రెస్‌ దృష్టి

‘సర్‌’పై కాంగ్రెస్‌ దృష్టి

ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌)పై కాంగ్రెస్‌ పార్టీ ప్రత్యేక దృష్టిసారించింది. ఈ కార్యక్రమంతోపాటు సంస్థాగత నిర్మాణంపై కూడా క్షేత్రస్థాయిలో ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగాలని నిర్ణయించింది. మంత్రి పొన్నం ప్రభాకర్‌ తన కార్యాలయంలో శనివారం కరీంనగర్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ స్థాయి నేతలతో సమావేశాన్ని నిర్వహించారు. అన్ని అంశాలపై సుధీర్ఘంగా చర్చించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

వైద్యానికి నిధుల గ్రహణం

వైద్యానికి నిధుల గ్రహణం

గ్రామీణ ప్రజలకు వైద్య సేవలు అందించే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్‌సీలు) నిధుల కొరతతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ప్రతీ యేటా ఆసుపత్రుల నిర్వహణ, చిన్న మరమ్మతులు, తాగునీరు, పారిశుధ్యం, విద్యుత్‌ బిల్లులు, ఫర్నీచర్‌, వైద్య పరికరాలు, అత్యవసర ఔషధాల కొనుగోలు వంటి అవసరాలకు ఇవ్వాల్సిన హాస్పిటల్‌ డెవలప్‌మెంట్‌ ఫండ్‌ (హెచ్‌డీఎఫ్‌) సమయానికి విడుదల కాకపోవడంతో పీహెచ్‌సీల పరిస్థితి దయనీయంగా మారుతోంది.

సామాన్యుడిపై ధరాఘాతం..

సామాన్యుడిపై ధరాఘాతం..

పశ్చిమాసియా దేశాల మధ్య యుద్ధం ప్రభావం పేద, మధ్యతరగతి కుటుంబాలను వెంటాడుతూనే ఉన్నాయి. నిత్యావసర సరుకుల ధరలు పెరిగి సతమతమవుతున్న కుటుంబాలకు పెట్రోల్‌, డీజిల్‌ మంట అంటుకుంది. యుద్ధ ప్రభావంతో గ్యాస్‌ భారం మోస్తున్న సామాన్యుల బతుకు బండిపై కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు మరింత భారాన్ని పెంచింది.

ఆదాయం ఫుల్‌..  చెల్లింపులు నిల్‌...

ఆదాయం ఫుల్‌.. చెల్లింపులు నిల్‌...

జిల్లాలో గల వ్యవసాయ మార్కెట్‌ యార్డుల ద్వారా ప్రభుత్వానికి కోట్ల రూపాయల ఆదాయం సమకూరు తున్నా వాటి నిర్వహణకు ఆరు మాసాల నుంచి నిధులు విడుదల చేయకపోవడంతో మార్కెట్ల కార్య దర్శులు, సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మార్కెట్లకు వచ్చే రైతులకు తాగునీటి సౌకర్యం కల్పించే పరిస్థితి లేదు.

ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలి

ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలి

వరి, మక్కల కొనుగోళ్లను వేగవంతం చేయాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. మండల కేంద్రంలోని మక్కల కొనుగోలు కేంద్రాన్ని, వడుకాపూర్‌లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను శనివారం కలెక్టర్‌ పరిశీలించారు.

 నెల రోజులుగా నిరీక్షణ

నెల రోజులుగా నిరీక్షణ

కొనుగోలు కేంద్రంలో నెలరోజుల క్రితం ధాన్యం పోసినప్పటికీ ఇప్పటికీ తూకం వేయడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తూకంలో జాప్యం, తరలింపులో నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ మండలంలోని కనగర్తిలో శనివారం రైతులు రాస్తారోకో నిర్వహించారు.

48 ఎకరాల ప్రభుత్వ భూమి స్వాధీనం

48 ఎకరాల ప్రభుత్వ భూమి స్వాధీనం

మండలంలోని నర్సింగాపూర్‌ సర్వే నంబర్‌ 273లో 130 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఇందులో నుంచి 107 ఎకరాల భూమిని వివిధ గ్రామాలకు చెందిన రైతులు ఆక్రమించి సాగు చేస్తున్నారు. కలెక్టర్‌ ఆదేశాలతో శనివారం తహసీల్దార్‌ దురిశెట్టి శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో రెవెన్యూ అధికారులు భూములను పరిశీలించారు.

పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలి

పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలి

ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన సౌకర్యాలతోపాటు నాణ్యమైన విద్య అందుతుందని జిల్లా విద్యాధికారి శారద అన్నారు. పట్టణంలోని బాలుర ఉన్నత పాఠశాలలో వారం రోజుల పాటు నిర్వహించిన సమ్మర్‌ క్యాంపు ముగింపు కార్యక్రమంలో పాల్గొ న్నారు.

పరిహారం ఇస్తేనే పనులు

పరిహారం ఇస్తేనే పనులు

బై పాస్‌ రోడ్డు పనులను శుక్రవారం రైతులను అడ్డగించారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ అప్పన్నపేటలో 15 ఏళ్ల క్రితం పైప్‌లైన్‌ కింద భూములు కోల్పోయిన ఇప్పటివరకు బకాయిలు రాలేదన్నారు. ఇప్పుడు బైపాస్‌ రహదారి కోసం భూములు తీసుకుంటే ఎక్కడి నుంచి నష్టపరిహారం ఇస్తారంటూ అప్పన్నపేట రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇందిరమ్మ ఇళ్లను వేగంగా పూర్తి చేయాలి

ఇందిరమ్మ ఇళ్లను వేగంగా పూర్తి చేయాలి

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఐడీఓసీ కార్యాలయంలో సంబంధిత అధికారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. జిల్లాలో ఉపాధిహామీ పనుల అమలు మరింత మెరుగు పడాలన్నారు. రాబోయే 25 రోజుల్లో కూలీల హాజరు గణనీయంగా పెంచాలన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి