Home » Karimnagar
బొగ్గు గని కార్మికుల 12వ వేజ్ బోర్డు ఏర్పాటుకు కాలం సమీపి స్తోంది. జూలై 1 నుంచి 12వ వేజ్బోర్డు మొద లవుతుం ది. కానీ ఇప్పటికీ వేజ్బోర్డు కమిటీ ఏర్పాటు కోసం కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ ఎలాంటి కార్యాచరణకు పూనుకోలేదు. గతంలో ఒక వెజ్బోర్డు కాలం ముగిసే కంటే ఆరు నెలల ముందు నుంచే జాతీయ కార్మిక సం ఘాలను వెజ్బోర్డు నిర్మాణం కోసం నాయకుల పేర్లను ప్రతిపాదించమని కోరేది.
తెలంగాణ రైతుల కష్టాలు కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, వాటిని వివరించడంలో కేంద్ర మంత్రి కిషన్రెడ్డి విఫలమయ్యారని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మన్కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం మలా ్లపూర్లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి మాట్లాడారు.
ప్రజలు జీవనశైలి మార్చుకోవాలని ఎన్సీడీ జిల్లా ప్రోగ్రాం అధికారి రాజమౌళి అన్నారు. ప్రపంచ హైపర్ టెన్షన్ సందర్భంగా గోదావరిఖని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో సోమవా రం రోగులకు అవగాహన కల్పించారు.
సుల్తానాబాద్ మండలం కనుకులలో అన్యాక్రాంతానికి గురైన 11.23 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడాలం టూ కలెక్టరేట్ ప్రాంగణంలో గ్రామస్తులు ఆందోళన నిర్వహించారు. గ్రామం నుంచి 300కు పైగా మహిళలు, పురుషులు కలెక్టరేట్కు తరలి వచ్చారు.
నేతన్నలకు ప్రభుత్వం అండగా ఉంటుందని, కులవృత్తినే నమ్ముకున్న ఏ కుటుంబం కూడా ఎన్నడూ దివాలా తీయలేదని ప్రభుత్వ విప్,పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయ రమణారావు కొనియాడారు. ఆర్ఆర్ గార్డెన్లో ఆదివారం పద్మశాలి ప్రజాప్రతినిధుల ఆత్మీయ సమ్మేళ లో వెల్లడించారు
ప్రభుత్వ పాఠశాలల్లో వచ్చిన మంచి ఫలి తాలు ప్రతీ ఒక్కరికి తెలిసేలా విస్తృత ప్రచా రం చేయాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే చింత కుంట విజయరమణరావు అన్నారు. ఆదివారం విద్యా వారోత్సవాల్లో భాగంగా కలెక్టరేట్లో నిర్వహించిన జిల్లా, మండల, గ్రామీణ టాపర్ పదో తరగతి విద్యార్థుల సన్మాన కార్యక్ర మంలో కలెక్టర్ కోయశ్రీహర్ష, ప్రభుత్వ విప్ పాల్గొన్నారు.
పాడి పంటలు చల్లగా ఉంటున్నాయని, ఇందుకు వేములవాడ రాజన్న కరుణ కటాక్షములే కారణమని భావించిన రైతులు వరి కోతల వల్ల వచ్చిన పశుగ్రాసాన్ని రాజన్న ఆలయం కోడెలకు తరలిస్తూ తమ భక్తిభావాన్ని చాటుకుంటున్నారు.
ధాన్యం కొనుగోలు సవాల్గా మారింది. అన్లోడింగ్ ఇబ్బందులు, మిల్లుల్లో స్థల సమస్య, కేంద్రాలలో నిర్లక్ష్యంగా కొనుగోళ్లు, లారీల కొరత, కటింగ్ వంటి అనేక అంశాలు రైతులు, అధికారులకు, మిల్లర్లకు ఇబ్బందులు కలిగిస్తున్నాయి. ఈ సీజన్లో వరి పంటలకు ఎలాంటి తెగుళ్ళు సోకకుండా ఇబ్బడిముబ్బడిగా దిగుబడులు వచ్చాయి.
ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)పై కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక దృష్టిసారించింది. ఈ కార్యక్రమంతోపాటు సంస్థాగత నిర్మాణంపై కూడా క్షేత్రస్థాయిలో ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగాలని నిర్ణయించింది. మంత్రి పొన్నం ప్రభాకర్ తన కార్యాలయంలో శనివారం కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి నేతలతో సమావేశాన్ని నిర్వహించారు. అన్ని అంశాలపై సుధీర్ఘంగా చర్చించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
గ్రామీణ ప్రజలకు వైద్య సేవలు అందించే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్సీలు) నిధుల కొరతతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ప్రతీ యేటా ఆసుపత్రుల నిర్వహణ, చిన్న మరమ్మతులు, తాగునీరు, పారిశుధ్యం, విద్యుత్ బిల్లులు, ఫర్నీచర్, వైద్య పరికరాలు, అత్యవసర ఔషధాల కొనుగోలు వంటి అవసరాలకు ఇవ్వాల్సిన హాస్పిటల్ డెవలప్మెంట్ ఫండ్ (హెచ్డీఎఫ్) సమయానికి విడుదల కాకపోవడంతో పీహెచ్సీల పరిస్థితి దయనీయంగా మారుతోంది.