Home » Karimnagar
ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, అక్రమ అరెస్ట్ చేస్తే భయపడేది లేదని టీఆర్ఎస్ జిల్లా ఇంఛార్జి సలేంద్ర కొమురయ్య అన్నారు. హైదరాబాదులోని ఉప్పల్ బగాయత్ ప్రాంతంలో కల్వకుంట్ల కవిత అధ్యక్షతన గురువారం తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల భూమి పంపిణీ చేయాలని ఇచ్చిన పిలుపుమేరకు హైదరా బాదుకు తరలి వెళ్లే క్రమంలో రూరల్ పోలీసులు అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు.
మేడిపల్లి ఓపెన్ కాస్ట్లో చేపల చెరువుల పునరుద్ధరణకు చర్యలు తీసుకోనున్నట్టు కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. గురువారం మేడిపల్లి ఓపెన్ కాస్టు ప్రాజెక్టును సందర్శించి, ఓబీ డంప్ ప్రాంతాల్లో ఉన్న నీటి వనరులు, చేపల చెరువులను పరిశీలించారు.
రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ గురువారం ఎన్టీపీసీ పరిధిలో నిర్మాణంలో ఉన్న డబుల్ బెడ్రూం ఇళ్లను పరిశీలించారు. నిర్మాణ పనుల పురోగతిని అధికారులు, కాంట్రా క్టర్లను అడిగి తెలుసుకుని పలు సూచనలు చేశారు.
సింగరేణి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అధికారులు తమ హక్కుల కోసం రోడ్డెక్కి పోరాటం చేయటం కాంగ్రెస్ పాలనకు నిదర్శనమని, ప్రజాపాలనకు సిగ్గుచేటని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ తీవ్రంగా విమర్శించారు. టీబీజీకేఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మాదాసి రామమూర్తితో కలిసి గురువారం సాయంత్రం గోదావరిఖని జీఎం కార్యాలయం ఎదుట సీఎంఓఏఐ దీక్ష శిబిరాన్ని సందర్శించి, సంఘీభావం ప్రకటించారు.
రామగుండం ఎన్టీపీసీలోని బ్యాలెన్స్ రిజర్వా యర్లో 176మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్రాజెక్టు పూర్తిస్థాయి వాణిజ్య ఉత్పత్తి దశలో కి చేరుకుంది.
ఈ యేడాది జూన్ మాసంలో వర్షాలు ఆశించిన స్థాయిలో కురవలేదు. రుతుపవనాలు జిల్లాకు ఆలస్యంగా ప్రవేశించడం, జూన్ చివరి వారం వరకు వానలు పడకపోవడంతో లోటు వర్షపాత నమోదైంది.
కరీంనగర్లోని ఆర్టీసీ 2 డిపోలో ఎలక్ట్రిక్ బస్సు అగ్నికి ఆహుతైంది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. డిపోలో నిలిపిన ఎలక్ట్రిక్ బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో సిబ్బంది అప్రమత్తమై వెంటనే అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు.
ఈ వర్షాకాలంలో సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు ఆరోగ్య సూచనలు సలహాలు అందిస్తూ వారి ఆరోగ్య పరిరక్షణ చర్యలు చేపట్టాలని ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు. మంగళవారం సుల్తానాబాద్ మున్సిపల్ పాలక మండల సమావేశం జరిగింది.
దర్యాపూర్ గ్రామ శివారులోని సర్వే నెంబర్ 140, 141, 144, 145, 149 లో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు రైతులు, గ్రామస్తులు సహకరించాలని మంథని ఆర్డీఓ సురేష్, గోదావరిఖని ఏసీపీ మడత రమేష్ కోరారు. ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుతో భూములు కొల్పోతున్న రైతులతో సర్పంచ్ రాపల్లి రాజయ్య ఆధ్వర్యంలో మంగళవారం గ్రామ సభ నిర్వహించారు.
ప్రభుత్వం కోడిగుడ్లు సరఫరా చేసే వరకు విద్యార్థులకు కోడి గుడ్లను అందించలేమని మధ్యాహ్న భోజన రాష్ట్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పూసాల రమేష్, సీపీఐ జిల్లా కార్యదర్శి తాండ్ర సదానందం, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి సునీల్లు స్పష్టం చేశారు.