Home » Karimnagar
గ్రామాల్లో విద్యుత్ సమస్యల పరిష్కా రానికే ప్రజాబాట నిర్వహిస్తున్నామని విద్యుత్ శాఖ రూరల్ ఏఈ రవిచందర్ అన్నారు. మం గళవారం బ్రాహ్మణపల్లిలో విద్యుత్ శాఖ ఆధ్వ ర్యంలో ప్రజాబాట నిర్వహించారు.
గ్రామ పంచాయ తీల పాలకవర్గం ఎలాంటి విబేధాలు లేకుండా ఏకాభిప్రాయంతో ముందుకు సాగితేనే గ్రామాలు అభివృద్ధి దిశలో ఉంటాయని జిల్లా పరిషత్ సీఈవో నరేందర్ అన్నారు. మండలంలోని 10 గ్రామాల పంచాయతీలకు చెందిన 98 మంది వార్డు సభ్యులకు శిక్షణ కార్యక్ర మం నిర్వహించారు.
నిబంధనల ప్రకారం పంచా యతీ పాలన కొనసాగాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. మంగళ వారం కలెక్టరేట్లో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ పంచా యతీలలో 3వ విద్యుత్ వైర్ లేకుండా ఇబ్బంది పడుతున్న ప్రాంతాల జాబితాను అందజేయాలని అధికారులను ఆదేశించారు.
సుల్తానాబాద్ మున్సిపల్ పాలకవర్గ ప్రమాణ స్వీకారం ఎట్టకేలకు ప్రశాంతంగా ముగిసింది. ఎమ్మెల్యే సమక్షంలో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక పూర్తయింది. ఈ నెల 16న జరగాల్సిన ప్రమాణ స్వీకార కార్యక్రమం, చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నికలో ఏకాభిప్రాయం సాధించడంలో జరిగిన అలస్యంతో మంగళవారం నిర్వహించారు.
జిల్లా క్రీడలు యువజన శాఖ, జిల్లా జూడో, రెజ్లింగ్ క్రీడా సంఘాల ఆధ్వర్యంలో సుల్తానాబాద్లో జిల్లా స్థాయి జూడో పోటీలను జిల్లా డీవైఎస్ఓ సురేష్ ప్రారంభించారు.
ఎన్టీపీసీ ప్రాజెక్టు పరిధిలోని అద్దె వాహనాల డ్రైవర్లకు పెరిగిన వేతన ఒప్పందం ప్రకారం జీతాలు చెల్లించాలని ఐఎన్టీయూసీ ఆధ్వర్యంలోని డ్రైవర్ల సంఘం డిమాండ్ చేసింది. మూడు నెలలుగా పెరిగిన వేతనాలు చెల్లించకపోవడంతో డ్రైవర్లు సోమవారం ఆందోళనకు దిగారు.
సుల్తానాబాద్ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ పదవుల పేచీ వీడడం లేదు. చైర్మన్, వైస్ చైర్మన్ విషయంలో కొద్ది రోజులుగా చర్చలు, సమీక్షలు జరుగుతున్నాయి. అభ్యర్థులు ఎటూ తేలకపోవడంతో జిల్లాలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఒక్క అభ్యర్థి తనను చైర్మన్ చేస్తే మిగతా సభ్యులకు బంపర్ ఆఫర్ ఇస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
రామగుండంలో కొలువుదీరిన పాలకవర్గం ప్రజా సంక్షేమమే పరమావధిగా పని చేయాలని, అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని ఎమ్మె ల్యే రాజ్ఠాకూర్ పేర్కొన్నారు. సోమవారం పాలక వర్గం పదవీ ప్రమాణ స్వీకారం అనంతరం మాట్లాడారు.
కరీంనగర్ మేయర్ పీఠాన్ని బీజేపీ కైవసం చేసుకుంది. 34 ఓట్లతో బీజేపీ అభ్యర్థి విజయం సాధించారు.
రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. కరీంనగర్ కార్పొరేషన మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక అత్యంత ఉత్కంఠ రేకెత్తిస్తున్నది. ఏ నోట విన్నా, ఎక్కడ నలుగురు కూర్చున్నా... కార్పొరేషనలో బీజేపీ అధికారం చేపడుతుందా.. కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందా సోమవారం ఏమి జరుగబోతుంది.. అన్న చర్చే వినవస్తుంది.