Home » Karimnagar
క్యాతనపల్లిలో తమపై రాళ్ల దాడి చేశారని.. తనను జైలుకు పంపారని బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ వ్యాఖ్యలు చేశారు. క్యాతనపల్లిలో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక సజావుగా జరిగేలా చూడాలని ఆయన కోరారు.
ఓసీపీ-1 ప్రాజెక్టుకు 2025-26 ఆర్థిక సంవత్సర నిర్దేశిత ఓవర్బర్డెన్ లక్ష్యాన్ని అధిగమించేలా శ్రమించిన ఉద్యోగులను ఆర్జీ-3 జీఎం మధుసూదన్ అభినందించారు. శుక్రవారం ప్రాజెక్టు సైటాఫీస్లో జరిగిన కార్యక్రమంలో జీఎం ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు, జ్ఞాపికలను బహూకరించారు.
మహనీయుల జీవితాల నుంచి వ్యక్తిత్వ వికాస పాఠాలు నేర్చుకోవాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. మాజీ స్పీకర్ దివంగత దుద్దిళ్ళ శ్రీపాదరావు వర్ధంతి సందర్భంగా శుక్రవారం మండలంలో పుష్పగిరి ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం, శస్త్ర చికిత్స కార్యక్రమాన్ని నిర్వహిం చారు.
నాలాలను కబ్జా చేసి అక్రమ నిర్మా ణాలు చేస్తే కూల్చివేస్తామని మేయర్ మహంకాళి స్వామి హెచ్చరించారు. శుక్రవారం 35వ డివిజన్లో వార్డు బాటలో పాల్గొన్నారు. అక్రమంగా ప్రధా న కాలువ పక్కన నిర్మించిన కట్టడాలను సిబ్బంది తొలగించారు. ఆయన మాట్లాడుతూ రామగుండం నగరపాలక సంస్థలో నాలాల పూడికతీత నిరంతరం కొనసాగుతుందని, బఫర్ జోన్ను ఆక్రమించి ఎవరైనా అక్రమ నిర్మాణాలు చేస్తే కూల్చివేతలు తప్పవన్నారు.
మంథనిలో చేపట్టిన అభివృద్ధి పనులు సకాలంలో నాణ్యతతో పూర్తి చేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం మంథని పట్టణంలోని అయ్యగారి చెరువు రీమోడలింగ్ పనులను కలెక్టర్ పరిశీలించారు.
కరీంనగర్ జూబ్లీ నగర్లో దారుణ ఘటన చోటుచేసుకుంది. కన్న తండ్రే కాలయముడు అయ్యాడు. కడుపున పుట్టిన పిల్లలనే కనికరం లేకుండా హతమార్చాడు. జూబ్లీ నగర్ ప్రాంతానికి చెందిన శ్రీశైలం దంపతులకు గీతానిశి, గీతాన్విక అనే ఇద్దరు కవల పిల్లలు ఉన్నారు.
జిల్లాస్థాయి రీడింగ్ చాంపియన్ షిప్ పోటీలు ఘనంగా జరిగినట్లు కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలి పారు. గురువారం కలెక్టరేట్లో విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన రీడింగ్ కాంపిటీషన్లో ఉత్తమ ప్రదర్శన కనబరిచిన విద్యార్థులకు బహు మతులు పంపిణీ చేశారు.
రామగుండం కార్పొరేషన్లో కాలువలపై వెలసిన ఆక్రమణలను తొలగించాలని ఎమ్మెల్యే మక్కాన్సింగ్ రాజ్ఠాకూర్ అన్నారు. గురువారం మేయర్ మహంకాళి స్వామితో కలిసి 39వ డివిజన్ శివాజీనగర్, కూరగాయల మార్కెట్ పరిసర ప్రాంతాల్లో పర్యటించారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజాపాలన సభలు గ్రామాల ప్రగతికి దిక్సూచి లాంటివని ప్రభుత్వ విప్ చింతకుంట విజయరమణారావు అన్నారు. మండలంలోని రూపునారాయణపేటలో బుధవారం నిర్వహించిన ప్రజాపాలన గ్రామసభలో ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
వీ-హబ్ కేంద్రాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దే దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. గురువారం వీ-హబ్ నైపుణ్యాల శిక్షణా కేంద్రంలో సెర్ఫ్ సంస్థకు చెందిన ఏపీఎంలు, స్త్రీనిధి అసిస్టెంట్ మేనేజర్లు, మండల సమాఖ్య అధ్యక్షులకు వీ-హబ్ కార్యక్రమాలపై నిర్వహించిన టీఓటీ ఓరియంటేషన్ శిక్షణలో కలెక్టర్ మాట్లాడారు.