Home » Karimnagar
రామగుండం నగర సమితి ఆధ్వర్యంలో భాస్క రరావు భవన్, ఖని చౌరస్తాలో శుక్రవారం సీపీఐ శత జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వ హించారు. సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు గౌతమ్ గోవర్ధన్, గోసిక మోహన్లు పతకాల ను ఆవిష్కరించారు.
సింగరేణి కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో గుర్తింపు, ప్రాతినిధ్య సం ఘాలు పూర్తిగా విఫలమైనట్టు టీబీజీకేఎస్ అధ్య క్షుడు మిర్యాల రాజిరెడ్డి అన్నారు. శుక్రవారం వీకేపీ గనిలో జరిగిన గేట్మీటింగ్లో మాట్లా డారు. గుర్తింపు ఎన్నికల సందర్భంగా ఏఐటీ యూసీ 47, ఐఎన్టీయూసీ 39 హామీలను మెనిఫెస్టోలో పెట్టి అమలు చేస్తామని వాగ్దానాలు చేసినట్టు తెలిపారు.
రామగుండం మున్సిపల్ కార్పొ రేషన్ పరిధిలో కూల్చివేతలు ఆపాలని, బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ రాజకీయపక్షాల జేఏసీ ఆధ్వర్యంలో శుక్రవారం నగర పాలక సంస్థ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.
గ్రామ స్థాయి నుంచి కాం గ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని వక్ఫ్బోర్డు చైర్మన్ అజ్మతుల్లా హు స్సేన్, సుడా చైర్మన్ నరేందర్రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మక్కాన్సింగ్ రాజ్ఠాకూర్ అధ్యక్షతన పార్టీ సం స్థాగత నిర్మాణ సమావేశానికి వారు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడా రు.
పెళ్లయిన యువకుడిని ప్రేమించిన ఓ బాలిక తన తల్లిదండ్రుల చేతిలో దారుణ హత్యకు గురైంది. కూతురి ప్రేమ ఇష్టం లేని తల్లిదండ్రులు..
ప్రభుత్వ ఆసుపత్రిలో అందిస్తున్న దంత వైద్య సేవలను అవసరమైన ప్రజలు విని యోగించుకోవాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష కోరారు. దంత సమస్యలతో కొన్ని రోజులుగా ఇబ్బంది పడుతున్న కలెక్టర్ గురువారం జిల్లా ఆసుపత్రిలో రూట్కెనాల్ చేయించుకున్నారు.
సింగరేణి సంస్థను అమ్మ డానికి కాంగ్రెస్, ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ నాయకులు కుట్రలు పన్ను తున్నారని కార్మిక సంఘాల ఐక్య వేదిక నాయకులు రియాజ్ అహ్మద్, ఐ కృష్ణ ఆరోపించారు.
రామగుండం కార్పొరేషన్లో నిరుపేదలకు ఇండ్లు కట్టించే బాధ్యత తనదేనని ఎమ్మెల్యే మక్కాన్సింగ్ రాజ్ఠాకూర్ అన్నారు. గురువారం తెల్లవారుజామున బైక్పై పలు డివిజన్లలో పర్యటిస్తూ ప్రజా సమస్యలను తెలుసుకుని అధికారులతో మాట్లాడి అక్కడికక్కడే పరిష్కరించారు.
రెండేళ్లకో సారి వచ్చే సమ్మక్క-సారలమ్మ జాతర సందడి కోల్ బెల్ట్లో నెల రోజుల ముందు నుంచే మొదలైంది. జనవరి 27, 28, 29తేదీల్లో సమ్మక్క జాతర జరగనుంది. కోల్బెల్ట్ ప్రాంతంలో ప్రతీ ఇంటిలో వన దేవతలను కొల వడం ఆనవాయితీ.రెండు రోజుల నుంచి రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో సమ్మక్క-సాలరమ్మ మొక్కులు మొదలయ్యాయి.
రాజన్న ఆలయం వద్ద ఓ పిచ్చి కుక్క స్వైర విహారం చేసింది. ఆలయానికి వచ్చిన భక్తులపై పిచ్చికుక్క దాడి చేసింది. దీంతో పలువురు భక్తులు గాయపడ్డారు.