Home » Karimnagar
రామగుండం నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని ఎమ్మెల్యే మక్కాన్సింగ్ రాజ్ఠాకూర్ చెప్పారు. మంగళవారం ఉదయం ఎమ్మెల్యే స్కూటీపై సిక్కువాడ, లక్ష్మీనగర్, కళ్యాణ్నగర్, మల్లికార్జున్నగర్లలో తిరుగుతూ ప్రజల సమస్యలను తెలుసుకున్నారు.
రామ గుండం నియోజకవర్గంలో రెండు సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ పార్టీ చేసింది శూన్యమని, ప్రజ లకిచ్చిన హామీలను ఎమ్మెల్యే నెరవేర్చడంలో విఫల మయ్యారని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆరోపించారు. మంగళవారం గోదావరిఖని ప్రెస్క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో బీఆర్ ఎస్ చార్జిషీట్ను విడుదల చేశారు.
పూర్వ ప్రాథమిక విద్యతో పిల్లల భవిష్యత్కు బలమైన పునాది పడుతుందని కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. మంగళవారం పెద్దపల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన పూర్వప్రాథమిక పాఠశాలలో కలెక్టర్ పిల్లలకు స్కూల్ యూనిఫాం, లెర్నింగ్ మెటీరియల్, ఆట వస్తువులు అందించారు.
జిల్లాలో మూడో విడత పంచాయతీ ఎన్నికలను పక డ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికా రులకు సిబ్బందికి సూచించారు. సుల్తానాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని కలెక్టర్ మంగళవారం తనిఖీ చేశారు.
సింగరేణి మేడిపల్లి ఓపెన్కాస్టు ప్రాంతంలో పెద్దపులి సంచరిస్తుందని, సమీప ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కాళేశ్వరం జోన్ ఫారెస్ట్ చీఫ్ కన్జర్వేటర్ ప్రభాకర్ సూచించారు. పులి సంచరిస్తున్న మేడిపల్లి ఓసీపీ గని ప్రాంతంలో మంగళవారం ఆయన పరిశీలించారు. ఫారెస్ట్ అధికారులకు పలు సూచనలు చేశారు.
సీనియర్ సిటిజన్లు లీగల్ ఎయిడ్ క్లీనిక్ను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయ మూర్తి సునీత కుంచాల అన్నారు. సోమవారం కలెక్టరేట్లోని జిల్లా సం క్షేమ అధికారి కార్యాలయంలో సీనియర్ సిటిజన్ లీగల్ ఎయిడ్ క్లీనిక్ను ప్రారంభించారు.
వీ-హబ్ భవన పెండింగ్ పనులు వెంటనే పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. సోమవారం ఆయన పెద్దపల్లి మండలంలోని రంగంపల్లిలో నూతనంగా నిర్మిస్తున్న వి-హబ్ భవనాన్ని పరిశీలించారు.
జిల్లాలో రైతులకు గత సీజన్లో లాగా ఎరువుల కొరతకు సంబంధించిన ఇబ్బందులు తలెత్తకుండా కలెక్టర్ అన్ని ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా జిల్లాలో యాసంగి సీజన్లో ఎరువులు, ముఖ్యంగా యూరియా కొరత రాకుండా, లేకుండా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ప్రణాళికలు రూపొందించి పటిష్టంగా అమలు అయ్యేలా అధికారులను ఆదేశించారు.
కార్మికుల సంక్షేమమే ధ్యేయంగా ఐఎన్టీయూసీ నిరంతరం పోరాటం చేస్తుందని వైస్ప్రెసిడెంట్ నరసింహారెడ్డి అన్నారు. ఆదివారం స్థానిక ఐఎన్టీయూసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
మంథని కూరగాయాల మార్కెట్ను తాత్కాలికంగా తరలించడానికి మున్సిపల్ అధికారులు చర్యలు చేపట్టారు. శనివారం మార్కెట్లో కూల్చివేతలు ప్రారంభించి ఒకపక్కన్న ఉన్న షెడ్లను ఎక్స్వేటర్తో కూల్చివేశారు. సోమవారం నుంచి పూర్తిస్థాయిలో షెడ్లకూల్చివేతలు కొనసాగుతాయని చిరువ్యాపారు లను హెచ్చరించారు.