Home » Karimnagar
వాతావరణంలో మార్పులు సంభించడం, మూడు రోజులుగా వర్షాలు కురుస్తుండడంతో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. సోమవారం గోదావరిఖని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి రోగుల తాకిడి పెరిగింది.
విద్యార్థులకు నాణ్యతతో కూడిన విద్య అందిస్తూ నైపుణ్యాల అంశాలపై దృష్టి సారించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. సుల్తానాబాద్ పట్టణంలోని మహాత్మా జ్యోతిరావుఫూలే బాలికల డిగ్రీ కళాశాలను కలెక్టర్ సోమవారం పరిశీలిం చారు. కళాశాలలో ఏర్పాటు చేసిన చాం బర్ ఆఫ్ డ్రీమ్స్ను ప్రారంభించారు.
కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను నిర్వీర్యం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర పన్నుతున్నదని పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి మండిపడ్డారు. సోమవారం కలెక్టర్ కార్యాలయం ఎదుట రాస్తారోకో నిర్వహించారు.
జిల్లాలోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో 6,31,018 మంది ఓటర్లతో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) ముసాయిదా ఓటర్ల జాబితాను సంబంధిత అధికారులు సోమవారం విడుదల చేశారు. మున్సిపల్ కార్పొరేషన్ రామగుండం సహ పెద్దపల్లి, సుల్తానాబాద్, మంథని మున్సిపాలిటీల్లో, 263 గ్రామ పంచాయతీల్లో ముసాయిదా జాబితాలను నోటీసు బోర్డులపై ఏర్పాటు చేశారు.
సుల్తానాబాద్ పట్టణంలో మంత్రుల పర్యటన కార్యక్రమం వాయిదా పడింది. సోమవారం మం త్రుల పర్యటనకు ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు ఆధ్వర్యంలో జూనియర్ కళాశాల మైదానంలో అన్ని ఏర్పాట్ల పూర్త య్యాయి. అనివార్య కారణాల వల్ల ఈనెల 19కి వాయిదా పడిందని నాయకులు తెలిపారు.
మారుపేర్లు, విజిలెన్స్ బాధితుల సమస్యల పరిష్కారానికి ఏఐటీయూసీ అం డగా ఉంటుందని ఆర్జీ-2 బ్రాంచి సెక్రెటరీ గంధం సాంబశివరావు పేర్కొన్నారు. ఆదివా రం స్థానిక ఏఐటీయూసీ ఆఫీస్లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సింగ రేణిలో మారుపేర్లు, విజిలెన్స్ కేసుల కార ణంగా బాధితులైన కార్మికులు న్యాయమైన డిమాండ్ల కోసం ఏళ్ళ తరబడి పోరాటాలు చేస్తున్నట్టు తెలిపారు.
దశాబ్దాల కాలంగా సరైన ప్రయాణ వసతి లేక ఇబ్బందులు పడుతున్న రాయపేట గ్రామానికి, ఓదెల మల్లికార్జున స్వామి దేవస్థానం నుంచి అబ్బిడిపల్లి, రాయపేట మీదుగా పందిళ్ల వరకు బీటి రహదారి నిర్మాణం పూర్తయ్యింది. ఈ సందర్భంగా సీఎం రేవంత్రెడ్డి, ప్రభుత్వ విప్ చింతకుంట విజయరమణరావు చిత్రపటాలకు ఆదివారం క్షీరాభిషేకం చేశారు.
శ్రావణ మాసం, పెళ్లిళ్ల సీజన్ ప్రారంభం కావడంతో ఆది వారం గోదావరి ఖని బస్టాండ్ ప్రయాణికులతో కిట కిటలాడింది. సమయానికి బస్సులు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఉదయం నుంచే బస్టాండ్ ప్రయాణికులతో కిక్కిరిసింది.
ఆర్జీ-1 జీఎం కార్యాలయ ఆవరణలో శనివారం స్వాతంత్య్ర దినోత్సవం వేడుకలు నిర్వహించారు. జీఎం లలిత్ కుమార్ జెండాను ఎగురవేశారు. అనంతరం పరేడ్ చే గౌరవ వందనం స్వీకరించారు.
దేశాభివృద్ధిలో ఎన్టీపీపీ కీలక భాగ స్వామ్యమని రామగుండం ఎన్టీపీసీ, టీఎస్టీపీపీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చం దన్కుమార్ సామంత అన్నారు. శనివారం ఎన్టీపీసీ టీఎస్లోని మహాత్మా గాంధీ స్టేడియంలో నిర్వహించిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ఈడీ ప్రసంగించారు.