రామగుండం రైల్వే స్టేషన్ సందర్శించిన జీఎం
ABN, Publish Date - Jul 08 , 2025 | 12:36 AM
రామగుండం రైల్వే స్టేషన్ను సోమ వారం దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సందీప్ మాతూర్ సందర్శిం చారు. సికింద్రాబాద్ నుంచి ప్రత్యేక రైలులో రామగుండం చేరుకున్న జీఎం రైల్వే స్టేషన్లోని ఫ్లాట్ ఫాంలు, పార్క్, వాగన్ రిపేర్ వర్క్ షాప్ను సందర్శించి అక్కడ జరుగుతున్న పనులను పరిశీలించారు.
అంతర్గాం, జూలై 7(ఆంధ్రజ్యోతి): రామగుండం రైల్వే స్టేషన్ను సోమ వారం దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సందీప్ మాతూర్ సందర్శిం చారు. సికింద్రాబాద్ నుంచి ప్రత్యేక రైలులో రామగుండం చేరుకున్న జీఎం రైల్వే స్టేషన్లోని ఫ్లాట్ ఫాంలు, పార్క్, వాగన్ రిపేర్ వర్క్ షాప్ను సందర్శించి అక్కడ జరుగుతున్న పనులను పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రైల్వే సంస్థ ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాల కల్పననకు పెద్ద ఎత్తున నిధులు కేటాయించి రైల్వేస్టేషన్ల ఆధునీకరణకు కృషి చేస్తుందని పేర్కొన్నారు. రైల్వే ఉద్యోగులు, కార్మికుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. రామగుండం రైల్వే స్టేషన్లో పలు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైళ్లు నిలుపుదల చేయాలని, కుందనపల్లి వద్ద ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మాణం చేయాలని కోరుతూ రైల్వే బోర్డ్ మెంబర్ అనుమాస శ్రీనివాస్ జీన్స్ జీఎంకు వినతిపత్రం అందజేశారు. డీఆర్ఎం భరతేష్ కుమార్, రైల్వే ఉన్నత అధికారులు సురేష్, మీనా, గుప్తా, ముని రామ్ మీనా, ఆర్పీఎఫ్ సీఐ లింగమయ్య, రాజేంద్ర ప్రసాద్, జీఆర్పీ ఇన్చార్జి తిరుపతి పాల్గొన్నారు.
Updated Date - Jul 08 , 2025 | 12:36 AM