ఉద్యాన పంటల సాగుపై రైతులకు అవగాహన
ABN, Publish Date - Jun 11 , 2025 | 12:16 AM
విక సిత్ కృషి సంకల్ప అభియాన్లో భాగంగా మంగళ వారం అల్లూరులో పంటల సాగుపై అవగాహన కల్పిం చారు. కృషి విజ్ఞాన కేంద్రం ఉద్యానవన శాస్త్రవేత్త డాక్టర్ భాస్కర్రావు మాట్లాడారు. రైతులు సమగ్ర పంట ప్రణాళికను తయారు చేసుకుని సాగు చేసుకోవాలని సూచించారు.
యైుటింక్లయిన్కాలనీ, జూన్ 10(ఆంధ్రజ్యోతి): విక సిత్ కృషి సంకల్ప అభియాన్లో భాగంగా మంగళ వారం అల్లూరులో పంటల సాగుపై అవగాహన కల్పిం చారు. కృషి విజ్ఞాన కేంద్రం ఉద్యానవన శాస్త్రవేత్త డాక్టర్ భాస్కర్రావు మాట్లాడారు. రైతులు సమగ్ర పంట ప్రణాళికను తయారు చేసుకుని సాగు చేసుకోవాలని సూచించారు. కూరగాయలు, పూలు సాగు చేయాలని వివరించారు. కృషి విజ్ఞాన కేంద్రం వ్యవసాయ విస్తరణ శాస్త్రవేత్త డా. వినోద్కుమార్, వ్యవసాయ శాస్త్రవేత్త డా. నవ్య, డైరెక్టర్ ఆఫ్ పౌలీ్ట్ర రీసెర్చ్ ఇనిస్టిట్యూట్, నేషనల్ మీట్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ శాస్త్రవేత్తలు డా. కన్నకి, డా. లక్ష్మణ్, మండల వ్యవసాయ అధికారి ప్రకాష్, ఉద్యాన వన అధికారి జ్యోతితో పాటు రైతులు పాల్గొన్నారు.
కోల్సిటీ, (ఆంధ్రజ్యోతి): రైతులు సమగ్ర ప్రణాళిక పంటలను తయారు చేసుకోవాలని కృషి విజ్ఞాన కేంద్రం వ్యవసాయ విస్తరణ శాస్త్రవేత్త వినోద్కుమార్, భాస్కర్ రావు అన్నారు. వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్ కార్యక్ర మంలో భాగంగా జనగామ, మేడిపల్లి, అల్లూరు గ్రామా లలో వ్యవసాయం ఉద్యాన పంటల సాగుల్లో రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రైతులకు అవగాహన కల్పిం చారు. వారు మాట్లాడుతూ యేటా వరి, పత్తి సాగు చేయడం వలన వాతావరణంలోని మార్పులు చీడ పురుగులు ఎక్కువగా సోకడం వల్లన పండించిన పం టకు గిట్టుబాటు ధర రాక రైతులు నష్టపోతున్నార న్నారు. కూరగాయలు, పూలతోటలు వేస్తే మార్కెట్లో ఎక్కువగా ఆదాయం వస్తుందని తెలిపారు. ఆయిల్ పామ్ సాగుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సహిస్తు న్నాయని, మొక్కల మధ్య అంతర్పంటలు సాగు చేయడం వల్ల ఎక్కువ ఆదాయం వస్తుందన్నారు. రసా యన ఎరువులను తగ్గించాలని సూచించారు. వ్యవసా యంతోపాటు కోళ్లు, మేకలు, గొర్రెను పెంచుకొని అధిక ఆదాయం పొందవచ్చని సూచించారు. ఈకార్యక్రమంలో నవ్య, కన్నకి, లక్ష్మణ్, జ్యోతి రైతులు పాల్గొన్నారు.
Updated Date - Jun 11 , 2025 | 12:16 AM