చట్టాలపై ప్రతీ ఒక్కరు అవగాహన కలిగిఉండాలి
ABN, Publish Date - Jun 27 , 2025 | 12:07 AM
చట్టాలపై ప్రతీ ఒక్క విద్యార్థి అవగాహన కలిగి ఉండాలని జిల్లా లీగల్ సర్వీసెస్ సెక్రెటరి సీనియర్ సివిల్ జడ్జి స్వప్నరాణి అన్నారు. పెద్దాపూర్ ఆదర్శ పాఠశాలలో గురువా రం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కాలేజి విద్యార్థులకు చట్టాలపై అవగా హన కల్పించారు.
జూలపల్లి, జూన్ 26 (ఆంధ్రజ్యోతి): చట్టాలపై ప్రతీ ఒక్క విద్యార్థి అవగాహన కలిగి ఉండాలని జిల్లా లీగల్ సర్వీసెస్ సెక్రెటరి సీనియర్ సివిల్ జడ్జి స్వప్నరాణి అన్నారు. పెద్దాపూర్ ఆదర్శ పాఠశాలలో గురువా రం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కాలేజి విద్యార్థులకు చట్టాలపై అవగా హన కల్పించారు. ఆమె మాట్లాడుతూ అమ్మాయిలకు రక్షణ కల్పించే పోక్సో చట్టం, గృహ హింస, బాల్యవివాహాల నిరోధక చట్టం, పలు చట్టా లపై అవగాహన కల్పించారు. మైనర్లు వాహనాలను నడుపవద్దని, డ్రైవింగ్ లైసెన్సు ఉండాలని పేర్కొన్నారు. డ్రగ్స్కు బానిసలు కావద్దని, విలువైన జీవితాలను కాపాడుకోవాలని సూచించారు. ప్రిన్సిపాల్ ఎండి షాదుల్, న్యాయవాదులు నవీన్, రమేష్, జాన్సీ,సంకీర్తన పాల్గొన్నారు.
Updated Date - Jun 27 , 2025 | 12:07 AM