ఉపాధిహామీ కూలీల ధర్నా
ABN, Publish Date - May 30 , 2025 | 11:43 PM
మండల పరిషత్ కార్యాలయం ఎదుట శుక్రవారం భీమరపల్లికి చెందిన 30 మంది ఉపాధిహామీ కూలీలు ధర్నా నిర్వహించారు. పలువురు కూలీలు మాట్లాడుతూ సాధ్యం కాని పనులను అప్పగిస్తూ తక్కువ కూలీలతో పనులు చేయాలని సంబంధిత టీఏ కూలీ లను ఇబ్బందులకు గురిచేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు.
ఓదెల, మే 30 (ఆంధ్రజ్యోతి) : మండల పరిషత్ కార్యాలయం ఎదుట శుక్రవారం భీమరపల్లికి చెందిన 30 మంది ఉపాధిహామీ కూలీలు ధర్నా నిర్వహించారు. పలువురు కూలీలు మాట్లాడుతూ సాధ్యం కాని పనులను అప్పగిస్తూ తక్కువ కూలీలతో పనులు చేయాలని సంబంధిత టీఏ కూలీ లను ఇబ్బందులకు గురిచేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు.
పనులు చేయ మని చెపితే జీలకుంటకు చెందిన కూలీలతో పనులను చేయిస్తున్నారని, ఈ విషయమై అడిగితే పెద్ద మనుషులను మాట్లాడుకొని పంచాయతీ ద్వారా పరిష్కారం చేసుకోవాలని రెండు గ్రామాల కూలీల మధ్య గొడవలు సృష్టిస్తు న్నారని తెలిపారు. ఇబ్బందులకు గురి చేస్తున్న టిఏ జనార్దన్పై కఠిన చర్యలు తీసుకోవాలని కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ఎంపీడీవో తిరుపతికి వినతిపత్రం అందజేశారు. చర్యలు తీసుకుంటామని ఎంపీడీవో తెలపడంతో నిరసనను విరమించారు.
Updated Date - May 30 , 2025 | 11:43 PM