ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

GHMC: ఏసీబీకి చిక్కిన జీహెచ్‌ఎంసీ ఏఈ

ABN, Publish Date - Jun 24 , 2025 | 04:07 AM

లంచం తీసుకుంటూ జీహెచ్‌ఎంసీ అసిస్టెంట్‌ ఇంజనీర్‌ (ఏఈ) అవినీతి నిరోధకశాఖ అధికారులకు చిక్కారు.

గోల్నాక, జూన్‌ 23 (ఆంధ్రజ్యోతి): లంచం తీసుకుంటూ జీహెచ్‌ఎంసీ అసిస్టెంట్‌ ఇంజనీర్‌ (ఏఈ) అవినీతి నిరోధకశాఖ అధికారులకు చిక్కారు. అంబర్‌పేట సర్కిల్‌-16 వార్డు-2 గోల్నాక డివిజన్‌ నెహ్రూనగర్‌లోని కార్యాలయంలో ఏఈగా పనిచేస్తున్న టి.మనీషా బిల్లు మంజూరు చేయడానికి రూ.15వేలు ఇవ్వాలని కాంట్రాక్టర్‌ను డిమాండ్‌ చేయగా.. బాధితుడు ఏసీబీ హైదరాబాద్‌ రేంజ్‌-1 యూనిట్‌ అధికారులను ఆశ్రయించాడు. సోమవారం మనీషా వార్డు కార్యాలయంలోనే కాంట్రాక్టర్‌ నుంచి రూ.15వేలు తీసుకుంటుండగా ఏసీబీ అఽధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

ఆమె కాంట్రాక్టర్‌ నుంచి ఇంతకు ముందు రూ.5వేలు తీసుకున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. మనీషాపై కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు ఆమెను కోర్టులో హజరుపర్చి రిమాండ్‌ చేశారు. జీహెచ్‌ఎంసీ అంబర్‌పేట సర్కిల్‌-16 పరిధిలో పనిచేస్తున్న ఇంజనీరింగ్‌ విభాగం అధికారులపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే ఏఈ మనీషా ఏసీబీ అధికారులకు పట్టుపడడం చర్చనీయాంశమైంది.

Updated Date - Jun 24 , 2025 | 04:07 AM