Home » GHMC
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) పరిధిలోకి మొత్తం 20 మునిసిపాల్టీలు, ఏడు కార్పొరేషన్లను విలీనం చేశారు. ఈ మేరకు దానికి సంబంధించిన పనులన్నీ బుధవారం రాత్రి పూర్తయ్యాయి. దీంతో ఆ ఏరియాలన్నీ జీహెచ్ఎంసీ పరిధిలోకి వస్తాయి. వివరాలిలా ఉన్నాయి.
జీహెచ్ఎంసీ పరిధి విస్తరణపై తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర కోర్ అర్బన్ రీజియన్ విస్తరింపును కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేసింది. కోర్ అర్బన్ రీజియన్లో భాగంగా 20 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లు జీహెచ్ఎంసీలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సర్కార్ విలీనం చేయనుంది.
భాగ్యనగరంలో తొలిసారిగా ఆటోమేటెడ్ స్మార్ట్ రోటరీ పార్కింగ్ అందుబాటులోకి రానుంది. ఆదివారం నుంచి జూబ్లీహిల్స్లోని కేబీఆర్ పార్క్ వద్ద ప్రారంభించనుంది జీహెచ్ఎంసీ.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో ఆయా మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల విలీన ప్రక్రియ చురుగ్గా సాగుతోంది. చుట్టూ ఉన్న గ్రామాల విలీనం తర్వాత జీహెచ్ఎంసీ పరిధి మరింత పెరగనుంది విలీనం పూర్తయితే ప్రస్తుత బల్దియా విస్తీర్ణంతో పోలిస్తే మూడు రెట్లు అధికంగా మెగా జీహెచ్ఎంసీ ఉండనుంది.
మొత్తం 2,735 చ.కి.మీటర్లతో హైదరాబాద్ నగరం విస్తరించింది. హైదరాబాద్... ఇప్పుడు అతిపెద్ద నగరం. ఈ మేరకు రాష్ట్ర కేబినెట్ ఆమోదముద్ర కూడా వేసింది. ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలోని, అవతల గల 27 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను జీహెచ్ఎంసీ పరిధిలో విలీనం చేయాలని ప్రభుత్వం నిర్ణయించారు.
తాగునీటితో కారు కడిగిన వ్యక్తికి అధాకారులు రూ.10వేల జరిమానా విధించారు. ఈ విషయం బంజారాహిల్స్లో జరిగింది. తాగే నీటితో వాహనాలు కడగడం కొందరికి పరిపాటిగా మారింది. దీనిపై అధికారులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ.. జరిమానాలు విధిస్తున్నారు.
జీహెచ్ఎంసీ విస్తరణకు తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఓఆర్ఆర్ను ఆనుకొని ఉన్న 27 మున్సిపాలిటీలను జీహెచ్ఎంసీలో విలీనం చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
అన్నపూర్ణ, రామానాయుడు స్టూడియోలకు జీహెచ్ఎంసీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ట్రేడ్ లైసెన్స్ ఫీజును పూర్తి స్థాయిలో చెల్లించాలని నోటీసుల్లో పేర్కొన్నారు.
త్వరలో జరగబోయే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయాలని నిర్ణయించినట్లు ఆపార్టీ నేతలు తెలిపారు. ఈమేరకు ఆపార్టీ హైదరాబాద్ అధ్యక్షుడు రాజలింగం ఈ విషయాన్ని ప్రకటించారు. పార్టీని హైదరాబాద్ లో బలోపేతం చేయడమేగాక త్వరలో జరిగే ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు.
ఫుట్ ఓవర్ బ్రిడ్జిపై జీహెచ్ఏంసీ పారిశుద్ధ్య కార్మికురాలిపై అత్యాచారానికి పాల్పడ్డాడో కామాంధుడు. నిన్న (శుక్రవారం) తెల్లవారుజామున జరిగిన ఈ ఘటన ఒకరోజు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.