Home » GHMC
లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ గురువారం అంటే ఏప్రిల్ 18వ తేదీన విడులకానుందని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) కమిషనర్, జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రాస్ వెల్లడించారు. ఆ రోజే నుంచే ఎంపీ అభ్యర్థల నుంచి నామినేషన్లు స్వీకరిస్తామని తెలిపారు.
బీఆర్ఎస్(BRS)కు సీనియర్ నాయకుడు టి. సోమన్(T. Soman) రాజీనామా చేశారు. పార్టీలో గుర్తింపు, ఆదరణ లేకపోవడంతో రాజీనామా చేస్తున్నట్లు ఆయన తెలిపారు. మంగళవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
Telangana: స్కూళ్లకు సెలవులు ఇచ్చేయడంతో పిల్లలు ఎంతో హుషారుగా ఆటల్లో మునిగితేలుతున్నారు. ఆ బాలుడు కూడా తన స్నేహితులతో కలిసి క్రికెట్ ఆడేందుకు బయటకు వెళ్లాడు. కానీ ఆ బంతే అతని పాలిట యమ పాశంగా మారుతుందని ఊహించలేదు. ఇదే బాలుడికి చివరి రోజని ముందే తెలిస్తే తల్లిదండ్రులు కూడా వెళ్లనిచ్చేవారు కారేమో. కానీ జరిగాల్సిన దారుణం జరిగిపోయింది.
నిర్మాణ రంగ వ్యర్థాల తరలింపునకు నిర్ణీత మొత్తం చెల్లిస్తే బల్దియా ఆమోదం పొందిన ఏజెన్సీలు వాటిని తీసుకెళ్తాయని జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్రోస్(GHMC Commissioner Ronaldros) తెలిపారు.
ఉద్దేశపూర్వకంగా నీటి సరఫరాలో ఆటంకాలు కల్పించే సిబ్బందిని విధుల నుంచి తప్పిస్తామని మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి ఎం.దానకిశోర్(Municipal Department Chief Secretary M. Danakishore) హెచ్చరించారు. నగరంలో తాగునీటి సరఫరాలో ఎలాంటి అవాంతరాలు ఉండకూడదని వాటర్బోర్డు అధికారుల్ని ఆదేశించారు.
మహాలక్ష్మి(Mahalakshmi) ఉచిత ప్రయాణంతో గ్రేటర్లో బస్ టికెట్ల ఆదాయం భారీగా తగ్గింది. గతంలో రోజుకు రూ.4 కోట్ల నుంచి 4.5 కోట్ల ఆదాయం వస్తే ఉచిత ప్రయాణం ప్రారంభం తర్వాత రూ. 2.5 కోట్ల నుంచి 3 కోట్లు మాత్రమే వస్తున్నది. అంటే రోజుకు సుమారు రెండు కోట్ల వరకు ఆదాయం తగ్గింది.
శ్రీరామనవమి శోభాయాత్ర నేపథ్యంలో హైదరాబాద్ సీపీ.. నిర్వాహకులకు కీలక సూచనలు చేశారు. మంగళ్హాట్లో అన్ని ప్రభుత్వ విభాగాల కో ఆర్డినేషన్ మీటింగ్ జరిగింది. ఈ కార్యక్రమానికి సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డితో పాటు పోలీసు అధికారులు, జీహెచ్ఎంసీ, విద్యుత్ వాటర్ వర్క్స్, అగ్నిమాపక శాఖ అధికారులు హాజరయ్యారు.
రెరా మాజీ కార్యదర్శి శివ బాలకష్ణకు నాంపల్లి ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో ఈ ఏడాది జనవరి 25న శివ బాలకృష్ణ అరెస్టయ్యారు. 60 రోజుల్లో ఛార్జిషీట్ వేయక పోవడంతో శివబాలకృష్ణకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
బీఆర్ఎస్కి చెందిన కీలక నేతలు కొందరు ఇవాళ కాంగ్రెస్లో చేరబోతున్నారు. ఆపరేషన్ ఆకర్ష్తో బీఆర్ఎస్ నేతలు భారీగా కాంగ్రెస్లో చేరుతున్నారు. ఈ రోజు ఎంపీ కేకే, ఆయన కూతురు జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి చేరనున్నారు. అలాగే స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఆయన కూతురు కడియం కావ్య, ఉమ్మడి అదిలాబాద్ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ నేత పురాణం సతీష్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోనున్నారు.
చెరువుల్లో నిర్మాణ రంగ వ్యర్థాలు డంప్ చేస్తోన్న వారిపై పోలీసులకు ఫిర్యాదు చేసి ఎఫ్ఐఆర్ నమోదయ్యేలా చర్యలు తీసుకోవాలని జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్రోస్(GHMC Commissioner Ronaldros) లేక్స్ విభాగం అధికారులను ఆదేశించారు.