ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Signature Forgery: నార్సింగ్‌ మునిసిపల్‌ కమిషనర్‌ సంతకం ఫోర్జరీ

ABN, Publish Date - Jun 18 , 2025 | 05:34 AM

తన పేరు, సంతకం ఫోర్జరీ అయ్యాయని, విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని హైదరాబాద్‌ శివారు నార్సింగ్‌ మునిసిపల్‌ కమిషనర్‌ కృష్ణమోహన్‌రెడ్డి స్థానిక పోలీసులను ఆశ్రయించారు.

  • ఫోర్జరీ పత్రాలతో మార్ట్‌గేజ్‌ ప్లాట్‌ల విడుదలకు ప్రయత్నం

నార్సింగ్‌, జూన్‌ 17 (ఆంధ్రజ్యోతి): తన పేరు, సంతకం ఫోర్జరీ అయ్యాయని, విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని హైదరాబాద్‌ శివారు నార్సింగ్‌ మునిసిపల్‌ కమిషనర్‌ కృష్ణమోహన్‌రెడ్డి స్థానిక పోలీసులను ఆశ్రయించారు. వివరాల్లోకి వెళితే.. మార్వా టౌన్‌షి్‌పలో ఓ అపార్ట్‌మెంట్‌ నిర్మించిన కొంతమంది అందులోని మార్ట్‌గేజ్‌ ప్లాట్‌లను విడుదలచేస్తూ ఫోర్జరీ డాక్యుమెంట్లు తయారు చేశారు. వాటిపై కమిషనర్‌ కృష్ణమోహన్‌రెడ్డి సంతకాన్ని ఫోర్జరీ చేశారు.

సీహెచ్‌ శివనాగేశ్వరరావు అనే ఓ వ్యక్తి మునిసిపల్‌ సీనియర్‌ అసిస్టెంట్‌ని అంటూ ఒక ఫేక్‌ ఐడీ కార్డు తయారు చేసుకున్నాడు. దాని ఆధారంగా ఈ ఫోర్జరీకి పాల్పడ్డాడు. ప్లాట్‌లను అమ్మేందుకు రిజిస్ట్రేషన్‌ కార్యాలయానికి వెళ్లగా, గండిపేట సబ్‌రిజిస్ట్రార్‌కు మునిసిపల్‌ కమిషనర్‌ సంతకంపై అనుమానం కలిగింది. ఈ విషయాన్ని ఆయన కమిషనర్‌ దృష్టికి తీసుకెళ్లారు. అయితే అది తన సంతకం కాదని ఫోర్జరీ జరిగిందని గ్రహించిన ఆయన నార్సింగ్‌ పీఎ్‌సలో ఫిర్యాదు చేశారు.

Updated Date - Jun 18 , 2025 | 05:34 AM