ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Punjab Kings: ధర్మశాలలో పంజాబ్ కింగ్స్ సరికొత్త రికార్డ్..పట్టికలో కూడా..

ABN, Publish Date - May 05 , 2025 | 06:48 AM

ఐపీఎల్ 2025లో రోజురోజుకు కొత్త కొత్త రికార్డులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలోనే నిన్న ధర్మశాలలో జరిగిన పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్‌ మ్యాచులో ఓ అరుదైన రికార్డ్ నమోదైంది. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.

IPL 2025 Punjab Kings

ఐపీఎల్ 2025లో నిన్న పంజాబ్ కింగ్స్ (Punjab Kings), లక్నో సూపర్ జెయింట్స్ (LSG)ను 54వ మ్యాచ్‌లో రెండోసారి ఓడించింది. ఈ విజయంతో PBKS పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకుంది. అదే సమయంలో మరో అరుదైన ఘనతను కూడా దక్కించుకుంది. ధర్మశాలలో ఆడిన ఈ జట్టు రెండో అత్యధిక స్కోరును నమోదు చేసింది. ఐపీఎల్ 2024లో ఆర్సీబీ 7 వికెట్ల నష్టానికి ఇదే ప్రాంతంలో అత్యధికంగా 241 పరుగులు చేసింది. ఈ స్కోర్ తర్వాత తాజాగా పంజాబ్ జట్టు 5 వికెట్ల నష్టానికి 236 రన్స్ చేసి రెండో అత్యధిక స్కోరుగా రికార్డుకెక్కింది. ధర్మశాలలో ఈ జట్టు 2011 తర్వాత మొదటిసారి 200 పరుగుల మార్కును తాకింది. అంతకుముందు పంజాబ్ RCBపై రెండు వికెట్ల నష్టానికి 232 పరుగులు చేసింది.


అదరగొట్టిన అర్ష్‌దీప్

54వ మ్యాచ్‌లో టాస్ ఓడిపోయి ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్, ప్రభ్‌సిమ్రాన్ సింగ్ 91 పరుగులు, కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ 45 పరుగులతో రాణించడంతో 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 236 పరుగులు చేసింది. ఈ క్రమంలో ప్రభ్‌సిమ్రాన్ సింగ్ తన ఐపీఎల్ కెరీర్‌లో రెండో సెంచరీని తొమ్మిది పరుగుల తేడాతో సాధించలేకపోయాడు. దీనికి సమాధానంగా, లక్నో జట్టు నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 199 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో 37 పరుగుల తేడాతో లక్నో మ్యాచ్‌ను కోల్పోయింది. పంజాబ్ తరఫున అర్ష్‌దీప్ మూడు వికెట్లు, ఉమర్జాయ్ రెండు వికెట్లు పడగొట్టగా, మార్కో జాన్సెన్, యుజ్వేంద్ర చాహల్ ఒక్కో వికెట్ తీశారు.


పాయింట్ల పట్టికలో..

దీంతో 11 మ్యాచ్‌ల్లో ఏడు విజయాలు సాధించిన పంజాబ్ 15 పాయింట్లతో పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకుంది. ఈ జట్టు నికర రన్ రేట్ +0.376 కు పెరిగింది. ఇదే సమయంలో లక్నో జట్టు ఈ సీజన్‌లో ఆరో ఓటమితో ఏడో స్థానానికి పడిపోయింది. ఈ జట్టు ఖాతాలో 10 పాయింట్లు ఉన్నాయి. నికర రన్ రేట్ -0.469గా ఉంది. ప్రస్తుతం ఆర్సీబీ 16 పాయింట్లతో పట్టికలో అగ్రస్థానంలో ఉండగా, ముంబై, గుజరాత్ 14-14 పాయింట్లతో వరుసగా మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నాయి. ఇక పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో చెన్నై జట్టు ఉంది. ఈ టీం 11 మ్యాచులు ఆడి కేవలం రెండు మాత్రమే గెలిచి 4 పాయింట్లు సాధించింది. ఇక దీని తర్వాత హైదరాబాద్ జట్టు ప్రస్తుతం 10 మ్యాచులు ఆడి మూడు మాత్రమే గెలిచి ఆరు పాయింట్లతో చివరి నుంచి రెండో స్థానంలో ఉంది.


ఇవి కూడా చదవండి:

Virat Kohli: ఆరెంజ్ క్యాప్‌ తిరిగి లాగేసుకున్న విరాట్ కోహ్లీ..ఇలాగే ఉంటుందా..


RCB IPL 2025: ఐపీఎల్ 2025లో అగ్రస్థానంలో ఆర్సీబీ.. ప్లేఆఫ్స్‌ కోసం ఇంకా ఎన్ని గెలవాలి


Jio Offer: రోజు రూ.80కే రీఛార్జ్ ప్లాన్..డేటాతోపాటు అన్ లిమిటెడ్ కాలింగ్


Read More Business News and Latest Telugu News

Updated Date - May 05 , 2025 | 06:54 AM