Home » Sports news
ఆర్సీబీ ప్లేయర్ విరాట్ కోహ్లి దురుసు ప్రవర్తన నేపథ్యంలో మ్యాచ్ ఫీజులతో కోత విధించారు. నిన్న కోల్ కతాతో జరిగిన మ్యాచ్లో ఔటయిన తర్వాత కోహ్లి అంపైర్లతో వాదనకు దిగిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత థర్డ్ ఎంపైర్ కూడా ఔట్ ఇవ్వడంతో ఆగ్రహంతో పెవిలియన్ చేరాడు.
భారత్కు చెందిన 17 ఏళ్ల గ్రాండ్మాస్టర్ గుకేశ్(Gukesh) దొమరాజు ప్రతిష్టాత్మకమైన క్యాండిడేట్స్ టోర్నమెంట్ను(FIDE Candidates 2024 title) గెలుచుకున్న అతి పిన్న వయస్కుడిగా చరిత్ర సృష్టించాడు. కెనడాలోని టొరంటోలో జరిగిన ఉత్కంఠభరితమైన 14 రౌండ్ల అభ్యర్థుల చెస్(chess) టోర్నమెంట్ ముగింపులో ఈ యువకుడు 14లో 9 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు.
అంపైర్లపై విరాట్ కోహ్లి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కోల్ కతా నైట్ రైడర్స్తో ఈడెన్ గార్డెన్స్లో జరిగిన మ్యాచ్లో కోహ్లి తీవ్ర ఆవేశానికి గురయ్యాడు. 18 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద హర్షిత్ బౌలింగ్లో రిటర్న్ క్యాచ్ ఇచ్చాడు. అంపైర్ ఔట్ ఇవ్వడంతో ఆర్సీబీ తరఫున కోహ్లి రివ్యూ తీసుకున్నాడు. అయినప్పటికీ కోహ్లి ఔట్ అయినట్టు అంపైర్ ప్రకటించాడు.
ఐపీఎల్లో పరుగుల వరద పారుతోంది. ఏ జట్టు అయినా సరే కనీసం 200 పరుగులు చేస్తోంది. ఈడెన్ గార్డెన్ వేదికగా కోల్ కతా నైట్ రైడర్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ జట్ల మధ్య 36వ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన ఆర్సీబీ జట్టు ఫీల్డింగ్ తీసుకుంది.
MS Dhoni Records in IPL: ఇప్పుడంతా ఐపీఎల్(IPL) మేనియా నడుస్తోంది. బ్యాటర్ల వీరవిహారంతో క్రికెట్(Cricket) ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తున్నారు. ఐపీఎల్ 16 సీజన్ల వరకు ఒక ఎత్తు.. 17వ సీజన్ ఒక ఎత్తు అన్నట్లుగా ఉంది మ్యాచ్లు జరుగుతున్న తీరు. అవును.. ప్రతి జట్టులోని ప్లేయర్స్ ఎక్కడా తగ్గడం లేదు.
ఐపీఎల్ సీజన్లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఆకాశమే హద్దుగా రెచ్చిపోతుంది. ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్ ధాటికి ప్రత్యర్థి జట్టు బౌలర్లు విలవిలలాడుతున్నారు. వరసగా మూడో సారి 250 పైచిలుకు పరుగులు చేశారు. తమ రికార్డును తామే చెరిపేసుకుంటున్నారు.
ఈమధ్య కాలంలో భారత ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాకు ఏదీ కలిసి రావడం లేదు. ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ విషయంలో వస్తున్న విమర్శలను పక్కన పెట్టేస్తే.. అతని ప్రదర్శన కూడా ఏమంత గొప్పగా లేదు. ముఖ్యంగా.. ఈ ఐపీఎల్ సీజన్లో ఇప్పటివరకూ అతని పెర్ఫార్మెన్స్ చాలా చెత్తగా ఉంది.
ఐపీఎల్ సీజన్లో పరుగుల వరద పారుతోంది. ఏ జట్టు అయినా సరే కనీసం 200 రన్స్ చేస్తోంది. సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ఆకాశమే హద్దుగా చెలరేగిపోతుంది. భారీ స్కోరు నమోదు చేస్తోంది. సీజన్లో భారీ స్కోరు కావడంతో కోల్ కతా నైట్ రైడర్స్ మెంటర్ గౌతమ్ గంభీర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఐపీఎల్ యజమాన్యానికి కీలక సూచన చేశారు.
ఐపీఎల్-2024 సీజన్ జోరుగా సాగుతున్న తరుణంలో.. ఈసారి ఏ జట్టు ఛాంపియన్గా నిలుస్తుందనే చర్చలు క్రీడా వర్గాల్లో సాగుతున్నాయి. ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్తో పాటు ఇతర జట్లు కూడా దూకుడుగా రాణిస్తున్నాయి కాబట్టి.. ఏ జట్టు టైటిల్ సొంతం చేసుకుంటుందనేది సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ఐపీఎల్ సీజన్ నుంచి తాత్కాలిక విరామం తీసుకుంటానని మ్యాక్స్వెల్ ప్రకటించారు. ఈ సీజన్లో మ్యాక్స్ వెల్ నుంచి గొప్ప ఇన్నింగ్స్ రాలేదు. నిన్నటి తుది జట్టులో చోటు లభించలేదు. మ్యాక్స్ వెల్ స్థానంలో విల్ జాక్స్ను తీసుకున్నారు. తన స్థానంలో మరొకరిని తీసుకోవాలని కెప్టెన్ డుప్లెసిస్కు మ్యాక్స్వెల్ స్పష్టం చేశారు.