ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Michael Clarke: భారత్ రెండో టెస్టుకు కుల్దీప్‌ యాదవ్.. మైఖేల్ క్లార్క్ సంచలన వ్యాఖ్యలు

ABN, Publish Date - Jun 27 , 2025 | 10:20 AM

ఇంగ్లాండ్‌తో జరిగిన మొదటి టెస్ట్‌లో టీమిండియా ఓడిన నేపథ్యంలో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైఖేల్ క్లార్క్(Michael Clarke) కీలక సూచనలు చేశారు. ఈ క్రమంలో కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌కు ఒక మెసేజ్ అందించారు.

Michael Clarke

ఇటీవల ఇంగ్లాండ్‌తో జరిగిన హెడ్డింగ్లీ టెస్ట్‌లో భారత జట్టు ఓటమి పాలైంది. ఈ క్రమంలో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైఖేల్ క్లార్క్(Michael Clarke).. గౌతమ్ గంభీర్, శుభ్‌మన్ గిల్‌కు కీలక సూచనలు చేశారు. కుల్దీప్ యాదవ్‌(Kuldeep Yadav)ను మిగతా మ్యాచ్‌ల కోసం ఎంపిక చేయాలని ఆయన అన్నారు. హెడ్డింగ్లీ టెస్ట్‌కు భారత జట్టు ఒక స్పిన్నర్, రవీంద్ర జడేజాను మాత్రమే వినియోగించింది. అయితే స్పిన్నర్ కేవలం ఓ వికెట్ మాత్రమే తీసి, తన ప్రతిభను ప్రదర్శించలేకపోయాడు. ఎడమ చేతి బ్యాట్స్‌మెన్ ముందు ఉన్న రఫ్‌ను ఉపయోగించడంలో జడేజా విఫలమయ్యాడు. దీంతో బెన్ డకెట్ రివర్స్ స్వీప్ చేశాడు. కానీ, చివరి సెషన్‌లో జడేజా తన ప్రతిభను చూపించాడు.

వికెట్లు తీయడంపై..

కానీ అప్పటికే ఇంగ్లాండ్ జట్టు విజయానికి చేరువైంది. జో రూట్, జేమీ స్మిత్ అజేయంగా నిలిచారు. దీంతో శుభ్‌మన్ గిల్ జట్టు 371 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లాండ్ విజయవంతంగా ఛేదించి 1-0 ఆధిక్యం సాధించింది. ఈ క్రమంలో కుల్దీప్‌ను ఆడించడం అత్యవసరమని క్లార్క్ భావించాడు. 2015 ప్రపంచ కప్ విజేతగా నిలిచిన జట్టులో కుల్దీప్ వికెట్ టేకర్‎గా నిలిచినట్లు గుర్తు చేశారు. ఈ టెస్ట్‌లో జట్టు చేసిన దాని కంటే ఎక్కువగా ఆడగలడని క్లార్క్ ఓ పోడ్ కాస్ట్ ద్వారా అభిప్రాయంవ్యక్తం చేశారు. ఈ క్రమంలో భారత జట్టు అదనపు బ్యాటింగ్ గురించి చాలా ఆందోళనతో ఉన్నట్లు తెలిపారు. ఇంగ్లాండ్‌లో గెలవాలంటే ప్రధానంగా వికెట్లు తీయడంపై ఫోకస్ చేయాలన్నారు.

మరింత మెరుగుదల అవసరం

ఇదే సమయంలో క్లార్క్.. మోహమ్మద్ సిరాజ్, ప్రసిధ్ కృష్ణను కూడా ప్రోత్సహించారు. ఎందుకంటే జస్ప్రీత్ బుమ్రా ప్రతి సారి ప్రధాన బాధ్యతను తీసుకోలేరని ప్రస్తావించారు. బుమ్రా మొదటి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీసుకున్నాడు. కానీ రెండో ఇన్నింగ్స్‌లో విఫలమయ్యారు. ఆ క్రమంలో సిరాజ్, ప్రసిధ్ ఒత్తిడిని ఎదుర్కొన్నట్లు చెప్పారు. మిగతా ముగ్గురు పేసర్లు బాగా బౌలింగ్ చేశారు, కానీ వారు వికెట్లు తీసేందుకు మరింత మెరుగుదలతో ఆడాలని సూచించారు.

రెండో టెస్ట్ ఎప్పుడంటే..

ఇక ఇంగ్లాండ్, భారత జట్ల మధ్య రెండో టెస్ట్ జులై 2న ఎడ్బాస్టన్‌లో మొదలవుతుంది. ఈ మ్యాచ్‌లో భారత జట్టు తమ ప్రదర్శనను మెరుగుపరచాలని, కుల్దీప్ యాదవ్‌ను ఎంపిక చేయడం ద్వారా విజయాన్ని సాధించాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ అభిమానులు ఈ మ్యాచ్‌ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇవీ చదవండి:

భారత్, ఇంగ్లాడ్ టెస్ట్‌ల మధ్య జస్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతి..

జూన్ 30లోపు ముగియాల్సిన ఆర్థిక కార్యకలాపాలు ఇవే..

మరిన్ని ఏపీ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 27 , 2025 | 11:07 AM