Home » England
యాషెస్ సిరీస్లో భాగంగా మెల్బోర్న్ వేదికగా ఇంగ్లండ్-ఆస్ట్రేలియా నాలుగో టెస్టులో తలపడ్డాయి. దాదాపు 15 ఏళ్ల తర్వాత ఇంగ్లండ్.. ఆసీస్ గడ్డపై ఘన విజయం సాధించింది. ఈ ఆట రెండు రోజుల్లోనే ముగియడం గమనార్హం.
నాలుగో టెస్టులో మ్యాచ్ ప్రారంభంలో ఇంగ్లాండ్ పేసర్లు గస్ అట్కిన్సన్, జోష్ టంగ్ ఆస్ట్రేలియా బ్యాటర్లకు చుక్కలు చూపించారు. ఇంగ్లాండ్ బౌలర్ జోష్ టంగ్ చెలరేగడంతో ఆసీస్ జట్టు 152 పరుగుల స్వల్ప స్కోరుకే ఆలౌటైంది.
అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ మూడో టెస్ట్ ఆడుతున్నాయి. నాలుగో రోజు ఆట ముగిసే సరికి ఇంగ్లండ్ ఆరు వికెట్లు నష్టపోయి 207 పరుగులు చేసింది. ఇంగ్లండ్ గెలుపుకి ఇంకా 228 పరుగులు కావాలి.
యాషెస్ సిరీస్లో భాగంగా అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ మూడో టెస్టులో తలపడుతున్నాయి. ఓవర్నైట్ 213/8 స్కోరుతో మూడో రోజు ఆట ప్రారంభించిన ఇంగ్లండ్ 286 పరుగులకు ఆలౌటైంది. రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్ భారీ ఆధిక్యం దిశగా దూసుకెళ్తుంది.
యాషెస్ సిరీస్లో భాగంగా ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న మూడో టెస్టు తొలి రోజు ఆటలో డిసిషన్ రివ్యూ సిస్టమ్ (డీఆర్ఎస్) వివాదం చోటుచేసుకుంది. దీనిపై ఐసీసీ స్పందించింది. అడిలైడ్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా వికెట్కీపర్ అలెక్స్ క్యారీకి సంబంధించిన డీఆర్ఎస్ విషయంలో సాంకేతిక లోపం జరిగిందని ఐసీసీ అంగీకరించింది.
ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరంలో ప్రముఖ పర్యాటక ప్రదేశమైన బోండీ బీచ్లోరెండు రోజుల క్రితం యూదుల హనుక్కా వేడుక లక్ష్యంగా ఇద్దరు దుండగలు కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 15 మంది ప్రాణాలు కోల్పోయారు. అనేక మంది గాయపడి.. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనలో మృతి చెందిన వారికి సంతాపం తెలుపుతూ ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ ఆటగాళ్లు చేతికి నల్ల బ్యాండ్లు ధరించారు.
ఐపీఎల్ 2026 మినీ వేలంలో ఆస్ట్రేలియా ఆల్రౌండర్ కామెరూన్ గ్రీన్ భారీ ధర పలికి వార్తల్లో నిలిచాడు. అతన్ని రూ.25.20 కోట్లకు కోల్కతా నైట్ రైడర్స్ సొంతం చేసుకుంది. అయితే ఇది జరిగిన కొన్ని గంటల వ్యవధిలోనే యాషెస్ సిరీస్లో భాగంగా అడిలైడ్ వేదికగా జరుగుతున్న మూడో టెస్ట్ అతడు డకౌట్ అయ్యాడు.
యాషేస్ 2025-26 సిరీస్ లో భాగంగా ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ మధ్య డిసెంబర్ 17న మూడో టెస్టు ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్ తమ తుది జట్టును ప్రకటించింది. కీలక ఆటగాడిపై వేటు వేసింది.
సొంతగడ్డపై జరుగుతున్న యాషెస్ 2025-26 సిరీస్లో ఆస్ట్రేలియా అదరగొడుతోంది. బ్యాటింగ్, బౌలింగ్తో సత్తాచాటి వరుసగా రెండో విజయం సాధించింది. బ్రిస్బేన్ వేదికగా జరిగిన రెండో టెస్టులో కంగారూలు 8 వికెట్ల తేడాతో ఇంగ్లిష్ జట్టును మట్టికరిపించారు.
యాషెస్ సిరీస్2025-26లో భాగంగా ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ల మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ బ్రిస్బేన్ వేదికగా ఇవాళ(గురువారం) ప్రారంభం కానుంది. టాస్ గెలిచిన ఇంగ్లాండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి టెస్టులో ఆస్ట్రేలియా 8 వికెట్ల తేడాతో గెలిచిన సంగతి తెలిసిందే.