Home » Team India
ఐపీఎల్ 2024 ప్రారంభానికి ముందు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఒక ఆసక్తికర విషయం వెల్లడించాడు. తన చిన్న తనంలో సర్ఫరాజ్ ఖాన్ తండ్రితో కలిసి క్రికెట్ ఆడినట్టు చెప్పాడు. ఇటీవల ఇంగ్లండ్తో జరిగిన టెస్ట్ సిరీస్ ద్వారా సర్ఫరాజ్ ఖాన్ అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే.
ఐపీఎల్ 2024 వరకు రంగం సిద్ధమైంది. ఈ శుక్రవారం నుంచే మెగా లీగ్ ప్రారంభంకానుంది. పార్లమెంట్ ఎన్నికల కారణంగా ఈ సారి ఐపీఎల్ను రెండు విడతలుగా నిర్వహిస్తున్నారు. మార్చి 22 నుంచి ఏప్రిల్ 7 వరకు మొదటి విడత పోటీలు జరగనున్నాయి.
టీమిండియా స్టార్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఐపీఎల్ 2024 కోసం సిద్ధమవుతున్నాడు. రోడ్డు ప్రమాదం కారణంగా అయిన గాయాల నుంచి పూర్తిగా కోలుకున్న పంత్ మళ్లీ బ్యాటు పట్టుకుని మైదానంలోకి దిగాడు. ఐపీఎల్లో ఆడడానికి పంత్కు బీసీసీఐ నుంచి కూడా ఫిట్నెస్ క్లియరెన్స్ సర్టిఫికెట్ వచ్చింది.
ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ మార్పు వివాదం ఇప్పట్లో సద్దుమణిగేలా లేదు. రానున్న ఐపీఎల్ సీజన్కు ముందు ముంబై ఇండియన్స్కు కెప్టెన్గా రోహిత్ శర్మ స్థానంలో హార్దిక్ పాండ్యాను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఐపీఎల్లో అత్యంత విజయవంతమైన కెప్టెన్గా ఉన్న రోహిత్ శర్మను తప్పించడంపై పెద్ద దుమారమే రేగుతోంది.
ఐపీఎల్ ఆరంభానికి ముందు ఢిల్లీ జట్టుకు గట్టి షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ఆటగాడు, యువ బ్యాటర్ హ్యారీ బ్రూక్ వ్యక్తిగత కారణాల రీత్యా లీగ్ నుంచి తప్పుకొంటున్నట్టు ప్రకటించాడు. గతేడాది వేలంలో ఏకంగా రూ. 13.23 కోట్లు వెచ్చించి బ్రూక్ను సన్రైజర్స్ కొనుక్కుంది.
ఇంగ్లండ్తో ధర్మశాల మ్యాచ్లో తొమ్మిది వికెట్లు పడగొట్టి తన వందో టెస్టును చిరస్మరణీయం చేసుకున్న టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ర్యాంకింగ్స్లో టాప్ లేపాడు. ఐసీసీ బుధవారం ప్రకటించిన టెస్టు ర్యాంకింగ్స్ బౌలర్ల జాబితాలో సహచరుడు బుమ్రాను వెనక్కినెట్టి నెంబర్వన్ స్థానాన్ని కైవసం చేసుకున్నాడు.
చివరిదైన ఐదో టెస్ట్లో ఇంగ్లండ్పై టీమిండియా ఘనవిజయం సాధించింది. రెండున్నర రోజుల్లోనే ముగిసిన ధర్మశాల టెస్టు మ్యాచ్లో భారత జట్టు ఇన్నింగ్స్ 64 పరుగుల తేడాతో జయకేతనం ఎగురవేసింది.
ఇంగ్లండ్తో జరుగుతున్న ఐదో టెస్ట్ మొదటి ఇన్నింగ్స్లో టీమిండియా ఆలౌట్ అయింది. తొలి ఇన్నింగ్స్లో 477 పరుగుల భారీ స్కోర్ వద్ద రోహిత్ సేన ఆలౌట్ అయింది. దీంతో తొలి ఇన్నింగ్స్లో ఇంగ్లండ్పై టీమిండియాకు 259 పరుగుల భారీ ఆధిక్యం లభించింది.
ఇంగ్లండ్తో జరుగుతున్న చివరిదైన ఐదో టెస్టుపై భారత్ పట్టుబిగించింది. రెండో రోజు తొలి ఇన్నింగ్స్లో భారత బ్యాటర్లు కలిసికట్టుగా రాణించడంతో టీమిండియాకు భారీ ఆధిక్యం లభించింది. టాప్ 5 బ్యాటర్లు 50+ స్కోర్లతో దుమ్ములేపారు.
ఇంగ్లండ్తో జరుగుతున్న ఐదో టెస్టు తొలి రోజు ఆటలో భారత స్పిన్నర్లు అరుదైన రికార్డును నెలకొల్పారు. ఐదో టెస్టు తొలి రోజు ఆటలోనే ఇంగ్లండ్ను మొదటి ఇన్నింగ్స్లో ఆలౌట్ చేశారు. భారత స్పిన్నర్ల ధాటికి తొలి ఇన్నింగ్స్లో ఇంగ్లండ్ 218 పరుగులకే ఆలౌట్ అయింది.