Home » Team India
టీమిండియా యువ బ్యాటర్ సాయి సుదర్శన్ తీవ్రంగా గాయపడ్డాడు. విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా మధ్యప్రదేశ్తో జరుగుతున్న మ్యాచులో రన్ తీస్తూ కింద పడ్డాడు. దీంతో అతడి పక్కటెముక విరిగినట్టు తెలుస్తోంది.
ఆస్ట్రేలియాతో జరిగిన వన్డేలో తీవ్రంగా గాయపడ్డ టీమిండియా స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ రీఎంట్రీ మరింత ఆలస్యం కానున్నట్లు తెలుస్తుంది. న్యూజిలాండ్తో జరిగే మూడు వన్డేల సిరీస్కు దూరమయ్యే అవకాశమే ఎక్కువగా కనిపిస్తోంది. జనవరి 11 నుంచి ప్రారంభమయ్యే ఈ సిరీస్కు సంబంధించి బీసీసీఐ నుంచి ఇప్పటివరకు అతడికి ఫిట్నెస్ క్లియరెన్స్ లభించలేదు.
టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ.. గత కొంత కాలంగా జట్టుకు దూరమైన విషయం తెలిసిందే. అయితే టీ20 ప్రపంచ కప్ 2026కు ముందు భారత్.. న్యూజిలాండ్తో మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. ఇందులో షమీని ఎంపిక చేయనున్నట్లు సమాచారం.
ఆస్ట్రేలియా క్రికెట్ లెజెండ్ డాన్ బ్రాడ్మన్ ధరించిన ప్రఖ్యాత ‘బ్యాగీ గ్రీన్’ క్యాప్ అభిమానుల కోసం వేలానికి అందుబాటులోకి వచ్చింది. బ్రాడ్మన్ తన కెరీర్లో చివరిసారిగా స్వదేశంలో టెస్టు సిరీస్లో పాల్గొన్న సమయంలో ధరించిన ఈ క్యాప్ వచ్చే ఏడాది జనవరి 26 వరకు వేలంలో ఉండనుంది.
తిరువనంతపురం వేదికగా శ్రీలంక-భారత్ ఐదో టీ20లో తలపడతున్నాయి. నిర్ణీత 20 ఓవర్లకు 7 వికెట్లు నష్టపోయిన టీమిండియా 175 పరుగులు చేసింది. లంక బ్యాటర్లకు 176 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.
టీమిండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్య టెస్టు క్రికెట్లో రీఎంట్రీపై మాజీ ఆటగాడు రాబిన్ ఉతప్ప కీలక వ్యాఖ్యలు చేశాడు. టెస్టు క్రికెట్లో ఆడతానంటే బీసీసీఐ హార్దిక్ పాండ్యకు అడ్డు చెప్పదని వెల్లడించాడు. తుది నిర్ణయం అతడిపైనే ఆధారపడి ఉంటుందని తెలిపాడు.
ప్రస్తుతం టీమిండియా శ్రీలంకతో ఐదు టీ20ల సిరీస్లో తలపడుతుంది. తిరువనంతపురం వేదికగా ఆదివారం.. శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో టీమిండియా 30 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో రిచా ఘోష్ కేవలం 16 బంతుల్లోనే 40 పరుగులు సాధించింది. మ్యాచ్ అనంతరం ఆమె వరల్డ్ కప్ విజయం గురించి మాట్లాడింది.
తిరువనంతపురం వేదికగా శ్రీలంక-భారత మహిళా క్రికెట్ జట్ల మధ్య నాలుగో టీ20 జరగనుంది. టాస్ ఓడిన భారత్.. తొలుత బ్యాటింగ్ చేయనుంది. అనారోగ్యం కారణంగా జెమీమా ఆటకు దూరమైంది.
అండర్ 19 ప్రపంచ కప్ 2026కి సంబంధించి టీమిండియా జట్టును ప్రకటించారు. ఈ టోర్నీ జనవరి 15 నుంచి ఫిబ్రవరి 6 వరకు జరగనున్న ఈ మెగా టోర్నీకి జింబాబ్వే, నమీబియా ఆతిథ్యమిస్తున్నాయి. కాగా ఈ ప్రపంచ కప్నకు ముందు టీమిండియా అండర్ 19 జట్టు సౌతాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్ ఆడనుంది.
టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్పై గత కొంత కాలంగా తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అతడికి సంబంధించిన ఓ కొత్త విషయం బయటికి వచ్చింది.