ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ABN Andhra Jyothy: అక్షరం అండగా - పరిష్కారమే అజెండాగా.. కార్యక్రమంలో వేమూరి ఆదిత్య

ABN, Publish Date - May 22 , 2025 | 02:47 PM

ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఆధ్వర్యంలో తిరుపతిలో అక్షరం అండగా - పరిష్కారమే అజెండాగా కార్యక్రమం నిర్వహించారు. ఆంధ్రజ్యోతి ఈడీ వేమూరి ఆదిత్య ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

1/7

ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఆధ్వర్యంలో తిరుపతిలో అక్షరం అండగా - పరిష్కారమే అజెండాగా కార్యక్రమం నిర్వహించారు. ఆంధ్రజ్యోతి ఈడీ వేమూరి ఆదిత్య ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

2/7

ఆంధ్రజ్యోతి ఈడీ వేమూరి ఆదిత్య మాట్లాడుతూ.. సమస్యలు ప్రచురించడమే కాకుండా.. వాటిని పరిష్కరించే దిశగా కూడా చర్యలు చేపట్టామని తెలిపారు. అక్షరం అండగా - పరిష్కారమే అజెండాగా కార్యక్రమం ద్వారా ఇప్పటి వరకు రూ.60 లక్షల పనులు పూర్తి చేశామని, ఇంకా రూ.87.30 లక్షల పనులకు అనుమతులు వచ్చాయని పేర్కొన్నారు.

3/7

ప్రజా సమస్యల పరిష్కారంలో ఆంధ్రజ్యోతి, ఏబీఎన్ ఆంధ్రజ్యోతికి సహకరించిన అధికారులతో పాటు ప్రజాప్రతినిధులకు ఆంధ్రజ్యోతి ఈడీ వేమూరి ఆదిత్య ధన్యవాదాలు తెలియజేశారు.

4/7

తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి నిర్వహించిన కార్యక్రమంలో ఆర్వో ప్లాంట్ ఏర్పాటు చేయాలని గతంలో ప్రజలు కోరారన్నారు. దీంతో తమ సొంత నిధులతో ఈ ప్లాంట్ ఏర్పాటు చేశామని చెప్పారు. వంద రోజులు క్రితం నిర్వహించిన సభలో ప్రజలు అడిగిన అన్ని సమస్యల పరిష్కారానికి తాము చర్యలు తీసుకున్నామని చెప్పారు.

5/7

తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ మౌర్య మాట్లాడుతూ.. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఈ కార్యక్రమం చేపట్టిన అనంతరం జీవకోనపై తాము ప్రత్యేక దృష్టి పెట్టామని తెలిపారు. నీటి, వీధి దీపాలు, వీధి కుక్కలు, స్మశాన పనులు ఇలా ప్రతి చిన్నా పెద్దా సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టామని చెప్పారు. ఈ కార్యక్రమం సందర్భంగా ఆర్వో ప్లాంట్‌ను ఆంధ్రజ్యోతి ఈడీ వేమూరి ఆదిత్య ప్రారంభించారు.

6/7

రహదారులు, కాలువలు సమస్యలపై ఎన్నో ఏళ్లుగా ఎంతో మంది దృష్టికి తీసుకు వెళ్లామని.. కానీ వారి వల్ల సాధ్యం కాని పనులు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ద్వారా పరిష్కారమయ్యాయని తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ మౌర్య తెలిపారు. ఈ సందర్భంగా ఏబీఎన్ ఆంధ్రజ్యోతితోపాటు అధికారులు, ప్రజాప్రతినిధులకు జీవకోన ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.

7/7

అభివృద్ధి పనులను ప్రారంభిస్తున్న ఆంధ్రజ్యోతి ఈడీ వేమూరి ఆదిత్య

Updated Date - May 22 , 2025 | 02:47 PM