Cyclone Montha: కుండపోత వర్షాలు.. అతలాకుతలమైన ఉమ్మడి వరంగల్
ABN, Publish Date - Oct 29 , 2025 | 09:22 PM
మొంథా తుపాను ప్రభావంతో తెలంగాణలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లాపై తుఫాన్ తీవ్ర ప్రభావం చూపిస్తోంది.
భారీ వర్షాల దాటికి హనుమకొండ, వరంగల్, ములుగు, మహబూబాబాద్ జిల్లాలు తడిసి ముద్దయ్యాయి.
ఒక పక్క భారీ వర్షాలు.. తీవ్రమైన చలితో ప్రజలు వణికిపోతున్నారు. భారీ వరదకు లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో బిక్కుబిక్కుమంటున్నారు.
తాజాగా వరంగల్ జిల్లా కల్లెడలో అత్యధికంగా 38 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయింది.
వరంగల్ లోని రెడ్లవాడలో 31.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవగా.. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లిలో 29 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డ్ అయింది.
వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో 28 సెంటీమీటట్లు, పర్వతగిరిలో 27, నెక్కొండ 27, సంగెం 27 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయినట్లు అధికారులు తెలిపారు.
రేపు హనుమకొండ, వరంగల్ జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. దీంతో విద్యా సంస్థలకు అధికారులు సెలవు ప్రకటించారు. జీడబ్ల్యూఎంసీ (GWMC) అధికారులు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. రాత్రి ఎలా గడుస్తుందోనని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Updated Date - Oct 29 , 2025 | 09:22 PM