Kavitha : కుట్రలు చేస్తున్నారు..కారణం హరీష్రావు, సంతోష్రావే..
ABN, Publish Date - Sep 03 , 2025 | 01:49 PM
పార్టీని అస్తగతం చేసుకోవాలని కుట్రలు చేస్తున్నారని కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్పై సీబీఐ విచారణ వచ్చిందంటే అందుకు కారణం హరీష్రావు, సంతోష్రావేనని కవిత సెన్సేషనల్ కామెంట్స్ చేశారు.
బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు కల్వకుంట్ల కవిత ప్రకటించారు. పార్టీ అధినేత కేసీఆర్ తనపై సస్పెన్షన్ వేటు వేయడంతో.. తన నిజాయితీని నిరూపించుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె వివరించారు.
పార్టీని అస్తగతం చేసుకోవాలని కుట్రలు చేస్తున్నారని కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్పై సీబీఐ విచారణ వచ్చిందంటే అందుకు కారణం హరీష్రావు, సంతోష్రావేనని కవిత సెన్సేషనల్ కామెంట్స్ చేశారు.
హరీష్, సంతోష్ మూఠాలు.. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలతో కుమ్మక్కయ్యాయన్నారు. హరీష్ రావును పక్కన పెట్టుకుని.. నిజాలు మాట్లాడిన తనను బయటకు పంపాంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
కవిత వేరే పార్టీలో చేరుతుందంటూ జరుగుతుందన్న ప్రచారంపై కూడా ఆమె క్లారిటీ ఇచ్చారు. తాను ఏ పార్టీలో చేరనని, తనకు ఏ పార్టీతో పనిలేదని స్పష్టం చేశారు.
తన 20 ఏళ్ల జీవితాన్ని బీఆర్ఎస్, తెలంగాణ కోసం పనిచేయడానికి వెచ్చించానని, సస్పెన్షన్పై మరోసారి ఆలోచించాలని కవిత కోరారు.
హరీష్రావు ,సంతోష్ బీఆర్ఎస్ను జలగల్లాగా పట్టిపీడిస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్, బీజేపీతో ఇద్దరూ అంటకాగుతున్నారన్నారు.
Updated Date - Sep 03 , 2025 | 01:53 PM