Kamareddy Rains: కామారెడ్డిలో జలవిలయం..
ABN, Publish Date - Aug 28 , 2025 | 04:44 PM
కామారెడ్డిలో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు జలవిలయం సృష్టించాయి. భారీ వరదలు పోటెత్తడంలో.. ఇళ్లన్నీ నీట మునిగాయి. పెద్ద పెద్ద వాహనాలు సైతం వరదలో కొట్టుకుపోయాయి. రోడ్లన్నీ ధ్వంసం అయ్యాయి. వరద బీభత్సానికి సంబంధించిన ఫోటోలు.
కామారెడ్డి జిల్లాలో గత రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి.
వర్షాలతో కామారెడ్డి జిల్లా అతలాకుతలం అవుతోంది. వరదలు పోటెత్తడంతో ఇళ్లన్నీ నీట మునిగిపోయాయి.
కామారెడ్డి జిల్లాలో వర్షాలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన విడుదల చేసింది.
ఆగస్టు 26, 27 తేదీల్లో కామారెడ్డిలోని రాజంపేట మండలం వద్ద ఉన్న అర్గొండ స్టేషన్లో 42 సెంటీమీటర్ వర్షపాతం నమోదైంది.
ఆగస్టు 26, 27 తేదీల్లో కామారెడ్డిలోని రాజంపేట మండలం వద్ద ఉన్న అర్గొండ స్టేషన్లో 42 సెంటీమీటర్ వర్షపాతం నమోదైంది.
నిర్మల్, రాజన్న సిరిసిల్ల, నిజామాబాద్, సిద్దిపేట జిల్లాల్లో వర్ష ప్రభావం తీవ్రంగా ఉంది.
కామారెడ్డి జిల్లాలో ముంపు ప్రాంతాల నుంచి మొత్తం 500 మందిని రక్షించారు. సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
ఎస్డిఆర్ఎఫ్ బృందం బొగ్గు గుడిసె వద్ద 10మంది కార్మికులను, గుంకల్ గ్రామంలో మరో 5 మందిని రక్షించింది.
కామారెడ్డి జిల్లాలోని రెండు ప్రదేశాలలో హైదరాబాద్ నుండి ఆదిలాబాద్కు వెళ్లే జాతీయ రహదారిపై వరద నీరు పొంగిపొర్లుతోంది.
SDRFతో కలిసి జిల్లా పోలీసులు జాతీయ రహదారిపై వీలైనంత త్వరగా ట్రాఫిక్ను క్లియర్ చేసి రాకపోకలు సాగించడానికి కృషి చేస్తున్నారు.
Updated Date - Aug 28 , 2025 | 05:06 PM