Home » Kamareddy
తెలంగాణలో బీఆర్ఎస్కు వరుస షాక్లు తగులుతున్నాయి. ఓ వైపు సీనియర్లు పార్టీని వీడుతుంటే.. మరోవైపు స్థానిక సంస్థల్లో ఆ పార్టీ మరింత బలహీనపడుతుంది. తాజాగా కామారెడ్డి బీఆర్ఎస్ మున్సిపల్ ఛైర్పర్సన్ నిట్టు జాహ్నవిపై పెట్టిన అవిశ్వాసం నెగ్గింది. దీంతో ఆమె ఛైర్ పర్సన్ పదవి కోల్పోయారు. కామారెడ్డి కొత్త మున్సిపల్ ఛైర్ పర్సన్గా కాంగ్రెస్ కౌన్సిలర్ గడ్డం ఇందుప్రియ ఎన్నికయ్యారు.
కామారెడ్డి జిల్లా: రామారెడ్డి మండలం, అక్కాపూర్ గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. మండల కేంద్రంలో సహజీవనం చేస్తున్న నరేష్, స్రవంతిలపై మొదటి భార్య, బంధువులు దాడి చేశారు. సభ్య సమాజం సిగ్గుపడేలా నరేష్, స్రవంతిలను వివస్త్రాలు చేసి కారం చల్లుతూ దాడి చేశారు.
Katepally Ramana Reddy: తెలంగాణలో రాజకీయ పరిణామాలు (TS Politics) రోజురోజుకూ మారిపోతున్నాయ్.! వరుసగా రెండుసార్లు అధికారం దక్కించుకున్న బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఎలా తయారయ్యిందో ప్రత్యక్షంగా మనం చూస్తూనే ఉన్నాం. అతిపెద్ద పార్టీగా ఉన్న బీఆర్ఎస్.. ఇప్పుడు అభ్యర్థులను వెతుక్కోవాల్సిన పరిస్థితి.! ఎంపీలు అందరూ కమలం పార్టీలో చేరుతుండగా.. ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గూటికి చేరిపోతున్నారు..
కామారెడ్డి నియోజకవర్గ బీఆర్ఎస్ (BRS) కార్యకర్తల సమావేశంలో వర్గ విభేదాలు మరోసారి బయట పడ్డాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిండెట్, మాజీ మంత్రి కేటీఆర్ (KTR) ఎదురుగానే కార్యకర్తలు బాహాబాహీకి దిగారు. సీనియర్ నాయకుడు కొమ్ముల తిర్మల్ రెడ్డి ప్రసంగంలో మాజీ ఎమ్మెల్యే గంప గోవర్దన్ పేరు ప్రస్తావించకపోవడంతో కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Telangana: కామారెడ్డి ఏరియా ఆసుపత్రిలో అదనపు గదుల ప్రారంభోత్సవంలో ప్రోటోకాల్ వివాదం చెలరేగింది. ప్రారంభోత్సవానికి విశిష్ట అతిథిగా మహమ్మద్ అలీ షబ్బీర్ అని ఆహ్వానించడం పట్ల కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ విషయంపై ప్రభుత్వ ఆసుపత్రి అధికారులపై బీజేపీ ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు.
కామారెడ్డి జిల్లా: ఏరియా ఆసుపత్రిలో ఎలుకల ఘటనపై అధికారుల చర్యలు చేపట్టారు. పేషెంట్ను ఎలుకలు కొరికిన ఘటనలో ఇద్దరు వైద్యులు, నర్సుపై అధికారులు సస్పెన్షన్ వేటు వేశారు. వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్కుమార్ పరిశీలనకు రాగ జిల్లా కలెక్టర్ను ప్రభుత్వం వివరణ కోరింది.
సహజీవనం చేస్తోందన్న కారణంతో ఓ మహిళపై దాడి జరిగిన ఘటన కామారెడ్డి జిల్లా మాచారం మండలంలో జరిగింది. అంతటితో ఆగకుండా మహిళను వివస్త్రగా చేసి కళ్లల్లో కారం కొట్టారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి అభ్యర్థులు కేసీఆర్, రేవంత్ రెడ్డిని ఓడించి సంచలనంగా మారిన బీజేపీ ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి ప్రజా సేవలోనూ తన మార్కు చూపిస్తున్నారు. తన గొప్ప మనసు చాటుకున్నారు.
కామారెడ్డి జిల్లా: నుసురాబాద్ మండలం, నాచుపల్లిలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. న్యూ ఇయర్ వేడుకల్లో బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ నాయకుడిపై దాడి చేశారు. ఈ ఘటనలో కాంగ్రెస్ నేత సాదుల రాములు మృతి చెందాడు.
Telangana: జిల్లాలోని నసురుల్లాబాద్ మండలం నాచుపల్లి గ్రామంలో న్యూ ఇయర్ వేడుకల్లో ఘర్షణ చోటు చేసుకుంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకుల మధ్య గొడవ జరిగింది.