Home » Kamareddy
కామారెడ్డి ఆర్బీ నగర్లో దారుణం జరిగింది. అదృశ్యమైన ముగ్గురు చిన్నారులు మృతిచెందారు. చెరువులో ముగ్గురు చిన్నారుల మృతదేహాలు లభ్యమయ్యాయి.
కామారెడ్డిలో అదృశ్యమైన ముగ్గురు పిల్లలను తండ్రి హత్య చేసినట్టు పోలీసులు వెల్లడించారు. పోలీసులు దర్యాప్తు చేపట్టగా అసలు విషయం బయటపడింది.
కామారెడ్డి ఎమ్మెల్యే కె.వి.రమణారెడ్డి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో వైద్యులు ఆయన ఇంటికి వెళ్లి ప్రాథమిక వైద్య పరీక్షలు చేశారు.
కామారెడ్డి, బాన్సువాడకు వెళ్లేందుకు సిద్దమైన టీ బీజేపీ చీఫ్ రాంచందర్ రావును పోలీసులు అడ్డుకున్నారు. తార్నాకలోని నివాసంలో ఆయన్ని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో రాంచందర్ రావు మాట్లాడారు.
కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీపై కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణా రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను అవినీతిలో కింగ్ అన్నారని.. తనపై ఏ ఒక్క అవినీతి బయటపడినా స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా చేస్తానని స్పష్టం చేశారు.
బీజేపీ, కాంగ్రెస్ నేతల బహిరంగ చర్చ నేపథ్యంలో కామారెడ్డిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్రభుత్వ డిగ్రీ కళాశాల భూముల కబ్జా వ్యవహారంపై రెండు పార్టీల నేతలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నారు. ఈ వివాదంపై నిజానిజాలు తేల్చేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి సవాల్ విసిరారు.
సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారానికి కామారెడ్డి బీఆర్ఎస్ కౌన్సిలర్లు చెక్ పెట్టారు. తమపై వస్తున్న వదంతులపై క్లారిటీ ఇచ్చారు. ఈ మేరకు ఓ వీడియో విడుదల చేశారు..
పోలీస్ ఎన్కౌంటర్లో మృతి చెందిన మావో నేత లోకోటి చందర్ మృతదేహం ఇవాళ కామారెడ్డి మండలం ఇస్రోజీవాడికి చేరుకుంది. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇది భూటకపు ఎన్కౌంటర్ అంటూ పౌరహక్కుల సంఘాల నేతలు వాపోయారు.
కామారెడ్డి జిల్లాలో పాడి గేదెల పేరుతో భారీ సైబర్ మోసం జరిగింది. దోమకొండ మండలం సంగమేశ్వర్ గ్రామానికి చెందిన చాకలి రమేశ్ అనే రైతుని సైబర్ కేటుగాళ్లు మోసం చేశారు..
వైద్యం వికటించి రోగి మృతిచెందిన వార్తలు మనం చూస్తునే ఉంటాం. కానీ ఒకే పేరున్న మరో రోగికి ఇచ్చే మందులను పొరపాటున ఆ రోగికి మందుల చీటీలో రాసివ్వడం వల్ల ఒక వృద్ధుడు మృత్యువాత పడ్డారు. అసలేం జరిగిందంటే...