Home » Floods
గోదావరి వరదల వల్ల ప్రజానష్టం, పంట నష్టం లేకుండా సంబంధిత అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. గోదావరి పరివాహక ప్రాంతం భద్రాచలం, పినపాక నియోజకవర్గాల్లో వరదల పట్ల జిల్లా యంత్రాంగాన్ని సన్నద్ధం చేశామని తెలిపారు.
ఏపీలోని మున్నేరు పరివాహక ప్రాంతాల్లో వర్షాలకు విజయవాడ ప్రకాశం బ్యారేజీకి వరద నీరు చేరుతోంది. దీంతో జలవనరులశాఖ అధికారులు ఇవాళ ఉదయం ప్రకాశం బ్యారేజీ నుంచి నాలుగు గేట్లను అడుగు మేర ఎత్తి 2,900 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. బందరు, రైవస్ కాలువలకు 2,11 క్యూసెక్కులు వదులుతున్నారు.
నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం కారణంగా ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ వాయుగుండం ఇవాళ (శనివారం), రేపు (ఆదివారం) ఉత్తర శ్రీలంక తీరాన్ని దాటే అవకాశముంది. ఏపీపై ప్రభావం పరిమితంగా ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. అయినప్పటికీ ప్రజలు, రైతులు, మత్స్యకారులు అధికారుల సూచనలను పాటిస్తూ అప్రమత్తంగా ఉండటం అవసరం..
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. రాబోయే 24 గంటల్లో ఈ వాయుగుండం తీవ్రంగా మారే అవకాశం ఉండటంతో గాలుల వేగం పెరగడం, సముద్ర పరిస్థితులు మారడం వంటి ప్రభావాలు కనిపించవచ్చని భారత వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు.
భారీ వర్షాలు, వరదలతో కొట్టుమిట్టాడుతోన్న శ్రీలంకకు భారత్ ఆపన్న హస్తం అందిస్తోంది. ప్రపంచదేశాల్లోనే మొట్టమొదట స్పందించిన దేశంగా భారత్ నిలిచింది. భారతదేశం అందిస్తోన్న సాయానికి 'థ్యాంక్యూ ఇండియా' అంటూ శ్రీలంక ప్రభుత్వం ప్రకటించింది.
దిత్వా తుఫాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వాహణ సంస్థ అధికారులు తెలిపారు. తుఫాను దృష్ట్యా ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
దిత్వా తుఫాను నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతోందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్జైన్ తెలిపారు. తుఫాను గంటకు 12 కిలోమీటర్ల వేగంతో ఉత్తర దిశగా కదులుతోందని వివరించారు.
దిత్వా తుఫాను ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు కురుస్తాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. తుఫాను నేపథ్యంలో ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
శ్రీలంకను భారీ వర్షాలు, వరదలు ఊపిరిసలపనివ్వడంలేదు. జనజీవనం పూర్తిగా స్థంభించిపోయింది. పాఠశాలలు, కార్యాలయాలు మూసివేశారు. వరుస ప్రమాద హెచ్చరికలు జారీ అవుతున్నాయి. ఇప్పటి వరకూ 56 మంది ప్రాణాలు కోల్పోయారు.
నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు ప్రకటించారు. వర్షాల ప్రభావంతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు.