Home » Floods
అస్సాంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు జనజీవనం స్తంభించింది. భారీ వానల కారణంగా ఇప్పటివరకు 10 మంది మృతిచెందగా, లక్షల మంది నిరాశ్రయులయ్యారు.
జమ్మూకశ్మీర్లోని పూంచ్, రాజౌరీ జిల్లాల్లో శనివారం రాత్రి కురిసిన భారీ వర్షాలు, ఆకస్మిక వరదలు బీభత్సం సృష్టించాయి.
జమ్మూకశ్మీర్ను ఆకస్మిక వరదలు అతలాకుతలం చేశాయి. ఈ వరదల ధాటికి కనీసం 11 మంది ప్రాణాలు కోల్పోయారని అధికారులు తెలిపారు.
భారీ వర్షాల కారణంగా అస్సాం రాష్ట్రం అతలాకుతలం అవుతోంది. వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. మంగళవారం నాటికి వరదల కారణంగా నలుగురు ప్రాణాలు కోల్పోయారు.
చైనాలో టైఫూన్ బావి బీభత్సం సృష్టిస్తోంది. ఈ తుఫాను ప్రభావంతో లియావోనింగ్ ప్రావిన్స్లో భారీ వర్షాలు, వరదలు ముంచెత్తాయి. దీంతో 2,60,000 మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలను తరలించినట్లు అధికారులు వెల్లడించారు.
మహారాష్ట్రలో కొన్ని రోజులుగా కురుస్తున్న రికార్డు స్థాయి భారీ వర్షాలకు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర నష్టం వాటిల్లింది.
గోదావరి వరదల వల్ల ప్రజానష్టం, పంట నష్టం లేకుండా సంబంధిత అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. గోదావరి పరివాహక ప్రాంతం భద్రాచలం, పినపాక నియోజకవర్గాల్లో వరదల పట్ల జిల్లా యంత్రాంగాన్ని సన్నద్ధం చేశామని తెలిపారు.
ఏపీలోని మున్నేరు పరివాహక ప్రాంతాల్లో వర్షాలకు విజయవాడ ప్రకాశం బ్యారేజీకి వరద నీరు చేరుతోంది. దీంతో జలవనరులశాఖ అధికారులు ఇవాళ ఉదయం ప్రకాశం బ్యారేజీ నుంచి నాలుగు గేట్లను అడుగు మేర ఎత్తి 2,900 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. బందరు, రైవస్ కాలువలకు 2,11 క్యూసెక్కులు వదులుతున్నారు.
నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం కారణంగా ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ వాయుగుండం ఇవాళ (శనివారం), రేపు (ఆదివారం) ఉత్తర శ్రీలంక తీరాన్ని దాటే అవకాశముంది. ఏపీపై ప్రభావం పరిమితంగా ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. అయినప్పటికీ ప్రజలు, రైతులు, మత్స్యకారులు అధికారుల సూచనలను పాటిస్తూ అప్రమత్తంగా ఉండటం అవసరం..
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. రాబోయే 24 గంటల్లో ఈ వాయుగుండం తీవ్రంగా మారే అవకాశం ఉండటంతో గాలుల వేగం పెరగడం, సముద్ర పరిస్థితులు మారడం వంటి ప్రభావాలు కనిపించవచ్చని భారత వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు.