ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Cigachi Explosion: చివరి చూపైనా దక్కుతుందనే ఆశతో.. సిగాచీ ముందు పడిగాపులు..!

ABN, Publish Date - Jul 05 , 2025 | 07:25 PM

సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని సిగాచీ పరిశ్రమ పేలుడు ఘటనలో గల్లంతైన వారి కోసం వెతుకులాట ఇంకా కొనసాగుతూనే ఉంది. శిథిలాల ఏరివేత దాాదాపు పూర్తికావొచ్చినా 9 మంది జాడ ఇంకా తెలియడంలేదు. అయినా, బాధిత కుటుంబీకుల చివరి చూపైనా దక్కుతుందనే ఆశతో ఫ్యాక్టరీ ముందు పడిగాపులు కాస్తూనే ఉన్నారు.

1/6

సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని సిగాచీ ఇండస్ట్రీస్ ఫార్మా కర్మాగారం తీవ్ర విషాదం నింపిన సంగతి తెలిసిందే.

2/6

జూన్ 30న జరిగిన ఈ పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 40కి చేరింది. ఇప్పటికీ 9 మంది కార్మికుల ఆచూకీ తెలియడంలేదు.

3/6

శిథిలాల కుప్పల్లో కలిసిపోయిన కార్మికుల ఎముకలు, మాంసపు ముద్దల ఆధారంగా ఫోరెన్సిక్ నిపుణులు మృతులను గుర్తించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు.

4/6

ప్రమాదం గడిచి ఆరు రోజులు పూర్తవుతున్నా ఇప్పటికీ 9 మంది ఆచూకీ తెలియడంలేదు. గల్లంతైన కార్మికుల మృతదేహాలను కనుగొనేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నామని అధికారులు తెలిపారు.

5/6

తమవారీ ఆచూకీ ఇంకా దొరక్కపోవడంతో మృతుల కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. వారి బాధ వర్ణనాతీతంగా మారింది.

6/6

చివరిచూపైనా దక్కుతుందనే ఆశతో బాధితుల కుటుంబీకులు పగలనక రాత్రనక సిగాచీ పరిశ్రమ ముందే వేచి చూడటం అందరినీ కంటతడి పెట్టిస్తోంది.

Updated Date - Jul 05 , 2025 | 07:54 PM