TG GOVT: తెలంగాణకు మరో దిగ్గజ సంస్థ..
ABN, Publish Date - Apr 18 , 2025 | 07:24 AM
తెలంగాణలో పెట్టుబడులే లక్ష్యంగా జపాన్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ బృందం పర్యటిస్తుంది. గురువారం నాడు మారుబెనీ కంపెనీతో కీలకమైన పెట్టుబడుల ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు.
తెలంగాణలో పెట్టుబడులే లక్ష్యంగా జపాన్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ బృందం పర్యటిస్తుంది. హైదరాబాద్లో కొత్తగా అభివృద్ధి చేస్తున్న ఫ్యూచర్ సిటీకి మారుబేని కంపెనీకి సీఎం రేవంత్రెడ్డి స్వాగతం పలికారు.
సీఎం రేవంత్రెడ్డి ప్రతిపాదనలతో జపాన్కు చెందిన దిగ్గజ కంపెనీ మారుబెనీ తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చింది.
రూ.1000 కోట్ల ప్రారంభ పెట్టుబడితో ఫ్యూచర్ సిటీలో ‘నెక్ట్స్ జనరేషన్ ఇండస్ట్రీయల్ పార్కు’ను ఏర్పాటు చేయడానికి మారుబెనీ కంపెనీ ప్రతినిధులు సంసిద్ధత వ్యక్తం చేశారు.
జపాన్ పర్యటనలో బిజీగా ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ బృందం తొలిరోజైన గురువారం కీలకమైన పెట్టుబడుల ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు.
తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు జపాన్కు చెందిన వ్యాపార దిగ్గజం మారుబెనీ కంపెనీ అంగీకరించింది.
అలాగే.. జపాన్లో సోనీ ప్రధాన కార్యాలయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం సందర్శించింది.
సోనీ ప్రధాన కార్యాలయంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డితో ఫొటో దిగుతున్న ఆ కంపెనీ ప్రతినిధులు
సోనీ కంపెనీకి చెందిన యానిమేషన్ అనుబంధ సంస్థ బృందంతో రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు.
సోనీ కార్పొరేషన్ తయారు చేస్తున్న కొత్త ఉత్పత్తులు, చేపడుతున్న కొత్త కార్యక్రమాలను ఆ కంపెనీ ప్రతినిధులు ప్రదర్శించారు.
ఉత్పత్తులతో పాటు వారి పని తీరును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సోనీ కంపెనీ బృందం వివరించింది.
ఈ సందర్భంగా సోనీ కంపెనీ యానిమేషన్ అనుబంధ సంస్థతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివరణాత్మక చర్చలు జరిపారు. యానిమేషన్, వీఎఫ్ఐ, గేమింగ్ రంగాల్లో హైదరాబాద్లో ఉన్న అవకాశాలు, అనుకూలతలను వివరించారు.
అలాగే టోక్యో మెట్రోను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం సందర్శించింది.
టోక్యో మెట్రో కార్యాచరణ, సామర్థ్యాన్ని రేవంత్ రెడ్డి నేతృత్వంలోని బృందం సమీక్షించింది
Updated Date - Apr 18 , 2025 | 07:53 AM