ఘనంగా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి సిల్వర్ జూబ్లీ వేడుకలు
ABN, Publish Date - Jun 22 , 2025 | 02:44 PM
హైదరాబాద్లో బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి 25 ఏళ్ల సిల్వర్ జూబ్లీ వార్షికోత్సవ వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ఆసుపత్రి చైర్మన్ నందమూరి బాలకృష్ణ, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, ప్రముఖ అంకాలజిస్టు డాకర్ట్ నోరి దత్తాత్రేయుడు తదితరులు హాజరయ్యారు.
హైదరాబాద్లో బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి సిల్వర్ జూబ్లీ వార్షికోత్సవ వేడుకలకు హాజరైన తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, ఆసుపత్రి చైర్మన్ నందమూరి బాలకృష్ణ, తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహా, ప్రముఖ అంకాలజిస్ట్ డాక్టర్ నోరి దత్తాత్రేయుడు, నారా బ్రాహ్మణి, విశాఖ ఎంపీ ఎం. భరత్ తదితరులు హాజరయ్యారు.
ఆసుపత్రి ప్రాంగణంలో నిర్మించిన తల్లిదండ్రుల స్మారక స్తూపానికి నమస్కరిస్తున్న బాలయ్య బాబు
సిల్వర్ జూబ్లీ వేడుకలను జ్యోతి ప్రజ్వలనం చేసి ప్రారంభిస్తున్న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ.
గవర్నర్తో మాట్లాడుతున్న ఆసుపత్రి చైర్మన్ నందమూరి బాలకృష్ణ
ఆసుపత్రిలో విభాగాలను గవర్నర్కు వివరిస్తున్న బాలకృష్ణ కుమార్తె నారా బ్రహ్మణి.
ఈ వేడుకల్లో ప్రసంగిస్తున్న ఆసుపత్రి చైర్మన్ నందమూరి బాలకృష్ణ.
గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు జ్ఞాపిక అందచేస్తున్న ఆసుపత్రి ఉన్నతాధికారులు
వేదిక మీద నందమూరి బాలకృష్ణ, నారా బ్రహ్మణి, విశాఖ ఎంపీ ఎం భరత్
ఆసుపత్రిలో ప్రత్యేక విభాగాన్ని ప్రారంభిస్తున్న గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ.
Updated Date - Jun 22 , 2025 | 02:55 PM