APSET 2025: తెలంగాణ ఎప్సెట్-2025 పరీక్షలు ప్రారంభం
ABN, Publish Date - May 02 , 2025 | 01:15 PM
తెలంగాణ ఎప్సెట్-2025 ఇంజనీరింగ్ విభాగం పరీక్షలు శుక్రవారం నుంచి ప్రారంభం అయ్యాయి. ఆదివారం వరకు రోజూ రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. మొదటి సెషన్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, రెండో సెషన్లో మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. ప్రతి సెషన్కు 90 నిమిషాల ముందుగానే అభ్యర్థులను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతిస్తామని, పరీక్ష ప్రారంభమైన తర్వాత నిమిషం ఆలస్యమైనా లోనికి అనుమతించబోమని అధికారులు స్పష్టం చేశారు. ఈ పరీక్షల కోసం 124 కేంద్రాలను ఏర్పాటు చేయగా, 2,20,371 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. మే 15వ తేదీలోగా ఎప్సెట్ ఇంజనీరింగ్ ఫలితాలను విడుదల చేయాలని అధికారులు భావిస్తున్నారు.
తెలంగాణ ఎప్సెట్-2025 ఇంజనీరింగ్ విభాగం పరీక్షలు శుక్రవారం (మే2) నుంచి ప్రారంభం అయ్యాయి.
ఆదివారం వరకు రోజూ రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.
మొదటి సెషన్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, రెండో సెషన్లో మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పరీక్షలు జరుగనున్నాయి.
ప్రతి సెషన్కు 90 నిమిషాల ముందుగానే అభ్యర్థులను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతిస్తామని, పరీక్ష ప్రారంభమైన తర్వాత నిమిషం ఆలస్యమైనా లోనికి అనుమతించబోమని అధికారులు స్పష్టం చేశారు.
ఈ పరీక్షల కోసం 124 కేంద్రాలను ఏర్పాటు చేయగా, 2,20,371 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు.
మే 15వ తేదీలోగా ఎప్సెట్ ఇంజనీరింగ్ ఫలితాలను విడుదల చేయాలని అధికారులు భావిస్తున్నారు.
పరీక్షకు సమయం అవుతుండటంతో కేంద్రంలోకి పరిగెడుతున్న విద్యార్థిని
ఎల్బీనగర్ అయాన్ డిజిటల్లో ఏపీఈసెట్ పరీక్షలు రాసేందుకు వస్తున్న విద్యార్థులు
Updated Date - May 02 , 2025 | 01:19 PM