Karthika Masam: కార్తీక మాసం మొదటి సోమవారం.. శైవక్షేత్రాల్లో భక్తుల కిటకిట
ABN, Publish Date - Oct 27 , 2025 | 11:32 AM
కార్తీక మాసం తొలి సోమవారం సందర్భంగా హైదరాబాద్లోని శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజామునే భక్తులు ఆలయాలకు చేరుకుని శివయ్యకు అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. నీలకంఠుడిని దర్శించుకుని ఆలయాల్లో కార్తీక దీపాలను వెలిగిస్తున్నారు. శివనామస్మరణతో శైవక్షేత్రాలు మార్మోగుతున్నాయి.
కార్తీక మాసం మొదటి సోమవారం సందర్భంగా శివాలయాలకు పోటెత్తిన భక్తులు
శివాలయాల్లో లింగానికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహిస్తున్న భక్తులు.
ఆలయ ప్రాంగాణాల్లో కార్తీక దీపాలను వెలిగిస్తున్న మహిళా భక్తులు
భారీగా తరలివస్తున్న భక్తులతో శివాలయాల్లో కార్తీక శోభ సంతరించుకుంది.
కార్తీక మాసం శివకేశవులకు అత్యంత ప్రీతికరమైనది.
కార్తీకమాసం సందర్బంగా కార్తీక దీపాలు వెలిగించి, రుద్రాభిషేకాలు చేయించిన భక్తులు
శివయ్యను దర్శించుకుంటున్న విద్యార్థులు
హరహర మహాదేవ అంటూ శివనామస్మరణతో స్వామిని దర్శించుకుంటున్న భక్తులు.
Updated Date - Oct 27 , 2025 | 11:36 AM