Stree Sakthi: స్త్రీ శక్తి సూపర్ హిట్.. బస్సుల్లో కిక్కిరిసిన మహిళలు
ABN, Publish Date - Aug 16 , 2025 | 10:08 PM
స్త్రీ శక్తి పథకాన్ని మహిళలు వినియోగించుకొంటున్నారు. అందులోభాగంగా రాయలసీమలోని కర్నూలు, అనంతపురం బస్టాండ్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి.
అసెంబ్లీ ఎన్నికల్లో కూటమికి ఆంధ్రప్రదేశ్ ఓటరు పట్టం కట్టాడు. దీంతో చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం కొలువు తీరింది. ఆ క్రమంలో ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ప్రభుత్వం వరుసగా అమలు చేస్తోంది.
అందులోభాగంగా ఆగస్టు 15వ తేదీ.. శుక్రవారం స్త్రీ శక్తి పేరిట ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ పథకాన్ని సీఎం చంద్రబాబు నాయుడు విజయవాడలో ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఐటీ, విద్య శాఖల మంత్రి నారా లోకేష్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ పాల్గొన్నారు.
అలాగే రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాలు, నియోజకవర్గాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రారంభించారు.
దీంతో రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా.. మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే అవకాశం ఈ పథకం ప్రారంభించడం ద్వారా కలిగింది.
ఈ పథకం కారణంగా.. శనివారం ఉదయం రాష్ట్రంలోని పలు బస్టాండ్లు మహిళా ప్రయాణికులతో నిండిపోయాయి.
రాయలసీమలోని కర్నూలు, అనంతపురం బస్టాండ్లు.. మహిళా ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి.
మహిళా ప్రయాణికుల దృష్ట్యా మరిన్ని బస్ సర్వీసులను ఆర్టీసీ అధికారులు నడుపుతున్నారు. అటు శ్రీకాకుళం జిల్లా నుంచి ఇటు అనంతపురం జిల్లా వరకు అదనపు బస్సులు నడుపుతున్నారు.
గుర్తింపు కార్డులు.. సెల్ ఫోన్లోని చూపిస్తుండడంతో.. మహిళలకు కండక్టర్లు అవగాహాన కల్పిస్తున్నారు.
అంతేకాకుండా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం వర్తించాలంటే.. గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి ఉండాలంటూ మహిళలకు ఆర్టీసీ సిబ్బంది వివరిస్తున్నారు.
Updated Date - Aug 16 , 2025 | 10:10 PM