Sri Sathya Sai: ఘనంగా శ్రీసత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్ 44వ స్నాతకోత్సవం వేడుకలు
ABN, Publish Date - Nov 22 , 2025 | 08:41 PM
సత్యసాయి ఆశీస్సులతో 2047 నాటికి భారత్ అగ్రస్థానానికి చేరుతుందని ఆశిస్తున్నట్టు ఉప రాష్ట్రపతి రాధాకృష్ణన్ తెలిపారు. పుట్టపర్తిలోని శ్రీసత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్ 44వ స్నాతకోత్సవంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
పుట్టపర్తిలోని శ్రీసత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్ 44వ స్నాతకోత్సవంలో ఉప రాష్ట్రపతి రాధాకృష్ణన్ ముఖ్యఅతిథి గా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ.. సత్యసాయి ఆశీస్సులతో 2047 నాటికి భారత్ అగ్రస్థానానికి చేరుతుందని ఆశిస్తున్నట్టు తెలిపారు.
ఈ విద్యాసంస్థ ద్వారా క్రమశిక్షణ, వ్యక్తిత్వ వికాసం నేర్పుతున్నారని విద్యార్థులకు నైతిక విలువలు నేర్పే కేంద్రంగా సత్యసాయి విద్యాసంస్థ విలసిల్లుతోందని ఉప రాష్ట్రపతి అన్నారు.
వ్యక్తిత్వ కేంద్రంగా సత్యసాయి వర్సిటీ నిలుస్తోందని సీఎం చంద్రబాబు అన్నారు. అందరినీ ప్రేమించాలి.. సేవ చేయాలి అనేది భగవాన్ సాయి సిద్ధాంతమని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు.
సత్యసాయి విద్యాసంస్థ నైతికత, విలువలతో కూడి ఉంటుందని, విద్యార్థులకు ఆధ్యాత్మికత, సేవాభావాన్ని విద్యాసంస్థ నేర్పిస్తుందని సీఎం చంద్రబాబు తెలిపారు.
శ్రీసత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్ 44వ స్నాతకోత్సవంలో మంత్రి నారా లోకేష్, శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్టు మేనేజింగ్ ట్రస్టీ రత్నాకర్ తదితరులు పాల్గొన్నారు.
శ్రీ సత్యసాయి ఇనిస్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్ 44వ స్నాతకోత్సవ కార్యక్రమానికి వివిధ మంత్రులు, ప్రజా ప్రతినిధులు కూడా పాల్గొన్నారు.
Updated Date - Nov 22 , 2025 | 08:41 PM