Home » Nara Chandrababu Naidu
ఈ రోజు సాయంత్రం 5:30 గంటలకు రామోజీ ఫిలిం సిటీలో ప్రతిష్టాత్మక రామోజీ ఎక్స్లెన్స్ అవార్డ్స్ కార్యక్రమం జరగనుంది. జర్నలిజం, గ్రామీణాభివృద్ధి, సైన్స్ అండ్ టెక్నాలజీ సహా ఏడు రంగాల్లో విశిష్ట సేవలందించిన ప్రముఖులకు రామోజీ ఎక్స్లెన్స్ అవార్డులను ప్రధానం చేయనున్నారు.
ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్ (APTS) ఛైర్మన్ మన్నవ మోహనకృష్ణ విశాఖపట్నంలో నిర్వహించిన రెండు రోజుల ప్రతిష్టాత్మక సీఐఐ భాగస్వామ్య సదస్సులో పాల్గొన్నారు. అనేక దిగ్గజ కంపెనీలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావడంతో ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు మరో దశలోకి అడుగుపెడుతోందని మన్నవ మోహనకృష్ణ సంతోషం వ్యక్తం చేశారు.
ప్రస్తుత ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డిలపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ నాలెడ్జ్ హబ్ గా మారిందంటే ..అందుకు కారణం చంద్రబాబు నాయుడు, వైఎస్సార్ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
మొంథా' తుఫాన్ పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. మొంథా తుఫాన్ ను ఎదుర్కొనేందుకు యంత్రాంగం సిద్ధం కావాలని ఆదేశించారు. విద్యుత్, టెలికాం, తాగునీటి సరఫరాకు అంతరాయం లేకుండా చూడాలని తెలిపారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో తిరుమల తిరుపతి దేవస్థాన(TTD) ఛైర్మన్ బి.ఆర్.నాయుడు భేటీ అయ్యారు. ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా తిరుమలలో చేపట్టబోయే ఏర్పాట్లపై వారిద్దరూ చర్చించినట్టు సమాచారం.
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. విజయవాడలోని పున్నమి ఘాట్ లో ఏర్పాటు చేసిన దీపావళి ఫైర్ క్రాకర్స్ సంబరాల్లో సీఎం చంద్రబాబు దంపతులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ఫైర్ క్రాకర్స్ ఫెస్టివల్ ప్రారంభమైంది.
తాజాగా దీపావళి పండగ వేళ వ్యాపారులకు సీఎం చంద్రబాబు నాయుడు గుడ్ న్యూస్ చెప్పారు. పరిశ్రమలకు మద్దతుగా, వ్యాపారాలకు ఏపీని గమ్య స్థానంగా నిలిపేందుకు ప్రోత్సాహకాలు అందిస్తున్నామని సీఎం తెలిపారు.
ఏపీ ప్రజలకు రెండింతలు ఆనందాన్ని ఇచ్చే రోజు ఇదంటూ సీఎం చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు. రాయలసీమలో సూపర్ జీఎస్టీ... సూపర్ సేవింగ్స్ కార్యక్రమం నిర్వహించడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు.
కోరియా దిగ్గజం ఎల్జీ శ్రీసిటీలో ₹5,800 కోట్ల పెట్టుబడితో భారీ తయారీ పరిశ్రమను ప్రారంభించనుంది. మంత్రి లోకేశ్ భూమిపూజ చేయగా, ఈ ప్రాజెక్టుతో ఏపీ ఎలక్ట్రానిక్స్ హబ్గా ఎదగనుంది
ముఖ్యమంత్రి చంద్రబాబు సోదరుడు, చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే నారా రామ్మూర్తినాయుడు(72) శనివారం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈ నెల 14న హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చేరారు.