Raghurama: గుంటూరులో రతన్ టాటా విగ్రహాన్ని ఆవిష్కరించిన రఘురామ
ABN, Publish Date - Apr 19 , 2025 | 06:58 AM
గుంటూరు జిల్లాలో ఏపీ శాసనసభ డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణ రాజు పర్యటించారు. ఈ సందర్భంగా పలు కార్యక్రమాల్లో రఘురామ పాల్గొన్నారు. టీడీపీ నేతలు, కార్యకర్తలు రఘురామకు ఘన స్వాగతం పలికారు.
గుంటూరు లాం సమీపంలోని లోటస్ ఇన్ఫ్రాలో పద్మ విభూషణ్ రతన టాటా విగ్రహాన్ని ఏపీ శాసనసభ డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణ రాజు రఘురామకృష్ణరాజు ఆవిష్కరించారు.
రతన్ టాటా గొప్ప మానవతావాది అని.. భారతీయుల హృదయాల్లో టాటా ఎప్పటికీ రత్నమేనని రఘురామకృష్ణరాజు స్మరించుకున్నారు.
విద్య, వైద్య రంగాల్లో రతన్ టాటా సేవలు నిరుపమానమని రఘురామరాజు ప్రశంసించారు.
రతన్ టాటాకు భారతరత్న ఇవ్వాలనేది అందరి కోరిక.. నాలుగేళ్ల క్రితమే ఈ విషయంపై ప్రధానికి లేఖ రాశానని రఘురామరాజు గుర్తుచేశారు.
గుంటూరు జిల్లాలో రఘురామకృష్ణ రాజు పర్యటించారు. ఈ సందర్భంగా పలు కార్యక్రమాల్లో రఘురామ పాల్గొన్నారు. టీడీపీ నేతలు, కార్యకర్తలు రఘురామకు ఘన స్వాగతం పలికారు.
అలాగే.. సత్తెనపల్లి నియోజకవర్గం, రాజుపాలెం మండలం, బలిజేపల్లి గ్రామంలో మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే కన్నాలక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో జరిగిన గ్రామ సచివాలయం ప్రారంభోత్సవం, స్వర్గీయ నందమూరి తారక రామారావు, డాక్టర్ కోడెల శివప్రసాదరావు విగ్రహావిష్కరణ కార్యక్రమాల్లో ముఖ్య అతిథిగా రఘురామరాజు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత, నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ కోడెల శివరాం, స్థానిక నాయకులు పాల్గొన్నారు.
ఎన్టీఆర్కు పూలమాల వేసి రఘురామరాజు నివాళి అర్పించారు.
Updated Date - Apr 19 , 2025 | 07:28 AM