Home » Guntur
ఆంధ్రప్రదేశ్లో బీసీల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ.. మున్సిపాలిటీల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్ కల్పిస్తున్నామని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సమావేశాలు మంగళవారం ఉదయం 10 గంటలకు ప్రశ్నోత్తరాలతో ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా సోమవారం జరిగిన బిజినెస్ అడ్వైజరీ కమిటీ నిర్ణయాల నివేదికను సభ ముందు సీఎం చంద్రబాబు ఉంచనున్నారు.
డీఎస్సీ అంశంపై వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మంత్రి నారా లోకేశ్ సవాల్ చేసిన సంగతి తెలిసిందే. డీఎస్సీపై చర్చించేందుకు అసెంబ్లీకి రావాలని సవాల్ చేసిన లోకేశ్.. జగన్ సమాధానం కోసం రెండో రోజూ ఎదురుచూస్తున్నానంటూ సోషల్ మీడియా మాధ్యమం ‘ఎక్స్’ వేదికగా పోస్టు చేశారు.
ప్రభుత్వ హాస్టళ్ల డెవలప్మెంట్కు దాతలు ముందుకు రావాలని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పిలుపునిచ్చారు.
స్వాతంత్ర్య దినోత్సవం వేళ రాజధాని అమరావతి ప్రాంతం పండుగ వాతావరణాన్ని తలపిస్తోంది. విద్యుత్ దీపాలతో ఆ ప్రాంతమంతా వెలిగిపోతోంది. ముఖ్యంగా అసెంబ్లీ, సచివాలయ భవనాలను ఎలక్ట్రిక్ లైట్లతో సర్వాంగ సుందరంగా అలంకరించారు.
పల్నాడు జిల్లాలోని నరసరావుపేటలో వింత ఘటన జరిగింది. చేతబడి చేస్తారన్న భయంతో చోరీ చేసిన సొమ్మును దొంగలు.. తిరిగి యజమానికే అప్పగించడం సంచలనం రేపుతోంది.
దక్షిణ మధ్య రైల్వే పరిధిలో నడుస్తున్న కొన్ని సూపర్ఫాస్ట్ రైళ్లు నత్తనడకన నడుస్తున్నాయని ప్రయాణికులు వాపోతున్నారు.
ఓనం ఉత్సవాలకు చర్లపల్లి-కొట్టాయం మధ్య ఆరు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.
ప్రముఖ థియేటర్ ఆర్టిస్ట్ గుమ్మడి గోపాలకృష్ణకు ప్రతిష్ఠాత్మక సంగీత నాటక అకాడమీ అవార్డు లభించడంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. 2024 సంవత్సరానికి థియేటర్ నటనా విభాగంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఆయన అవార్డు అందుకోవడంపై హర్షం వ్యక్తం చేశారు.
మనవడి ఆరోగ్యం బాగుపడాలన్న ఆకాంక్షతో కలియుగ దైవాన్ని ప్రార్థిస్తూ గుంటూరు నుంచి ఓ అమ్మమ్మ కాలినడకన తిరుమలకు చేరుకున్నారు. 70 ఏళ్ల వయస్సు... మోకాళ్ల నొప్పులు... భారీ కాయం... ఇతర అనారోగ్య సమస్యలు సరేసరి. ఇవేవీ మనవడిపై ఆమె ప్రేమకు అడ్డం కాలేదు.