Home » Guntur
సాగునీరు పారాల్సిన కాల్వలు.. తూటికాడ, జమ్ము, రబ్బరు మొక్కలతో నిండిపోయాయి. రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చివరి భూములకు సాగునీరు అందించాల్సిన కాల్వలు పూడికతో నిండిపోయాయి. సాగునీటి కాల్వల కట్టలు కోతకు గురై ఉన్నాయి. సాగునీరు సక్రమంగా అందక పంటలు ఎండిపోతున్నా పాలకులకు పట్టలేదు. ఐదేళ్లు అటు వర్షాభావం.. ఇటు అరకొర ఉన్న సాగునీరు కాల్వల ద్వారా సక్రమంగా అందక రైతులు అల్లాడిపోయారు. అయినా పాలకులు కాల్వల మరమ్మతుల గురించి పట్టించుకోలేదు.. రైతుల గోడు ఆలకించలేదు. ఈ పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వంలో అయినా సాగునీటి కాల్వల బాగుపై దృష్టి సారిస్తారని రైతులు ఆశిస్తున్నారు. ఖరీఫ్కు సాగునీటి ఇబ్బందులు లేకుండా కనీసం తాత్కాలిక మరమ్మతులు తక్షణం చేయాలని రైతులు కోరుతున్నారు.
కారంపూడి-వినుకొండ రహదారిలో నూతనంగా నిర్మిస్తున్న పెట్రోల్ బంకు పక్కన దశాబ్దాల కాలంగా ఎర్రకుంట భూమి ఉంది.
ఈ నెల 31వ తేదీ నుంచి పొన్నూరు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు కళాశాల నిర్వాహకులు శుక్రవారం తెలిపారు.
కృష్ణా-గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు ప్రక్రియ ప్రారంభమైంది. జాతీయ ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు వచ్చే ఏడాది మార్చిలో జరగబోయే ఈ ఎన్నిక కోసం తాజా ఓటర్ జాబితాలను సిద్ధం చేయాల్సి ఉంది.
ర్యాగింగ్ భూతం ఎంతోమంది యువకుల ప్రాణాలను బలి తీసుకుంటోంది. విద్యాలయ ప్రాంగణాల్లో అంతా సమానమనే ఆలోచన చేయకుండా.. సీనియర్, జూనియర్ అంటూ వేధింపులకు పాల్పడటం కొన్నేళ్లుగా చూస్తున్నాం.
వైసీపీ(YSRCP)కి మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గుంటూరు పశ్చిమ మాజీ ఎమ్మెల్యే మద్దాలి గిరి ఇటీవల వైసీపీకి రాజీనామా చేసి నాలుగు రోజులు కాకముందే పొన్నూరు మాజీ ఎమ్మెల్యే కిలారి రోశయ్య(Kilari Venkata Rosaiah) సైతం రాజీనామా ప్రకటించడం సంచలనంగా మారింది. రాజీనామా సమయంలో ఆయన పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
అమరావతి అభివృద్ధి ఆగదని మంత్రి నారాయణ తెలిపారు. రాజధాని గ్రామాలైన వెంకటపాలెం, మందడంలో సిటీస్ ఛాలెంజ్ ప్రాజెక్టు కింద అభివృద్ధి చేస్తున్న పనులను ఆయన మంగళవారం పరిశీలించారు.
మిర్చియార్డుకు రైతులు తెచ్చి న మిరపకాయలను విక్రయించిన 24 గంటల్లో నగదు చెల్లించాలి.
సెంట్రల్ ప్రొక్యూర్మెంట్ పేరుతో జగన్ చేసిన నాడు-నేడు పనుల్లో భారీ అవినీతిపై సమగ్ర విచారణ చేయాలని మంగళవారం శాసనసభలో ఎమ్మెల్యే ధూళిపాళ్ళ నరేంద్రకుమార్ డిమాండ్ చేశారు.
మోదీ 3.0 బడ్జెట్ అమరావతి బాట పట్టింది. గత ఐదేళ్లు వైసీపీ పాలనలో ఊసే లేకుండా పోయిన నవ్యాంధ్ర రాజధాని అమరావతి బాధ్యత మాదంటూ కేంద్రం బడ్జెట్లో భరోసా ఇచ్చింది. నిర్మలాసీతారామన్ తన బడ్జెట్లో అమరావతికి ప్రత్యేకంగా నిధులు కేటాయించడంపై అటు రాష్ట్రప్రజలతో పాటు అమరావతివాసులు ఆనందోత్సాహాల్లో మునిగిపోయారు. అటు తరతరాల నుంచి ఉన్న భూములను అమరావతి కోసం ఇచ్చి జగన్ నిర్లక్ష్యంతో రోడ్డెక్కిన రాజధాని రైతులకు భరోసా ఇస్తూ కూటమి ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు కేటాయించింది. ఉమ్మడి గుంటూరు జిల్లావాసుల ఆకాంక్షలకు అనుగుణంగా కేంద్ర బడ్జెట్ అమరావతికి ప్రాధాన్యం ఇవ్వడంపై అన్ని వర్గాల ప్రజల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ప్రత్యేకంగా నిధులతో పాటు రాజధాని కార్యకలాపాలకు అండగా ఉంటామన్న కేంద్రం ప్రకటనతో ఇక అమరావతి అభివృద్ధికి ఢోకా ఉండదని తెలుస్తోంది. కాగా అమరావతికి ప్రత్యేక కేటాయింపులతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వరంగ సంస్థలు, ప్రైవేటు సంస్థలు అమరావతికి క్యూ కట్టనున్నాయి. దీంతో అమరావతి దశ తిరిగిపోయినట్లే.