Home » Guntur
ప్రధానమంత్రి నరేంద్రమోదీకి సీఎం జగన్ రెడ్డి దత్త పుత్రుడని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల (YS Sharmila) ప్రశ్నించారు. జగన్ రెడ్డికి అసలు సంస్కారం ఉందా అని ప్రశ్నించారు. ఆయన బీజేపీ దగ్గర మోకరిల్లారని ఆరోపించారు. రాష్ట్ర ప్రయోజనాలు మీద ఒక్కరోజు కూడా ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు.
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై తెలుగుదేశం సీనియర్ నేత పట్టాభిరామ్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా గురువారం అమరాతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా ప్రజల ఆస్తులు కొట్టేయడానికి జగన్ పన్నాగం పన్నారని, ఆయన పాదయాత్ర పేరుతో ‘నాడు మార్నింగ్, ఈవినింగ్ వాక్’ చేశారని, ఆ సమయంలో ఎక్కడెక్కడ ఆస్తులు, స్థలాలు ఉన్నాయో వాటిపైనే జగన్ చూపు ఉండేదని ఆరోపించారు.
నీతి, నిజాయితీతో కూడిన రాజకీయం చేయడానికే పాలిటిక్స్లోకి వచ్చానని తెలుగుదేశం పార్టీ గుంటూరు ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. కొత్త తరం రాజకీయం ఏమిటో చూపిస్తానన్నారు. తాను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఎటువంటి అభ్యంతరకర వ్యాఖ్యలు చేయలేదని, అసభ్య పదజాలాన్ని ఉపయోగించలేదన్నారు. గతంలో వైసీపీ ఎంపీ అభ్యర్థి కిలారి రోశయ్య అసభ్యకర పదజాలాన్ని ఉపయోగించేవారని, తాను మాట్లాడటం మొదలుపెట్టిన తర్వాత.. ఆయన బూతులు మాట్లాడకుండా మార్చగలిగానని చెప్పారు.
ఏపీలో వైసీపీ అరాచక పాలన, తాజా రాజకీయ పరిణామాలు చూసిన తర్వాత ప్రజలకు సేవ చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చానని గుంటూరు తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. ఏబీఎన్ బిగ్ డిబేట్లో మాట్లాడుతూ.. ఈ భూమిపై ఉన్న ప్రేమతోనే అమెరికా సిటిజన్ షిప్ తీసుకోలేదన్నారు. తాను టూరిస్ట్ వీసాలపై రాలేదన్నారు. తనకు ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి వ్యాపారాలు లేవన్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డిని కష్టపడే వారితో పోల్చలేమని గుంటూరు లోక్సభ టీడీపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ అభిప్రాయపడ్డారు.ఆ విధంగా పోల్చడం అవమానకరమన్నారు. ఇది ఒక రకమైన బూతు అని ఆయన అభివర్ణించారు.
Pemmasani Chandrasekhar: సార్వత్రిక ఎన్నికల వేళ దేశంలో నామినేషన్ల ప్రక్రియ నడుస్తోంది. ముఖ్యంగా నాలుగో విడతలో ఎన్నికలు జరగనున్న ఆంధ్రప్రదేశ్లో ఈనెల25తోనామినేషన్ల ప్రక్రియ ముగుస్తుంది. ఇప్పటికే ప్రధాన పార్టీల అభ్యర్థులు నామినేషన్లు సమర్పించారు. అందరి దృష్టి అభ్యర్థుల అఫిడవిట్లపైనే పడింది. రాష్ట్రం నుంచి పోటీచేస్తున్న అభ్యర్థుల్లో అత్యంతధనవంతులు ఎవరనే చర్చ కొద్ది రోజులుగా నడుస్తోంది. ఈ క్రమంలో అందరి దృష్టిని ఆకరిస్తున్నారు గుంటూరు నుంచి ఎన్టీయే కూటమి తరపున పోటీచేస్తున్న టీడీపీ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్. దీనికి కారణం ఆయన అఫిడవిట్లో ప్రకటించిన ఆస్తులే.
Andhrapradesh: రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్ అవినీతి అరాచక పాలనకు నిరసనగా ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద గుంటూరుకు చెందిన కోవూరు లక్ష్మీ బొటన వేలు కోసుకున్న విషయం తెలసిందే. అయితే రాష్ట్రంలో మహిళలకు జరుగుతున్న అన్యాయంతో పోల్చితే బొటన వేలు కోసుకున్న బాధ పెద్దది కాదని లక్ష్మీ అన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. గుంటూరు స్వర్ణభారతి నగర్లో వైసీపీ నేతలు మైనర్ పిల్లలను గంజాయికి అలవాటు చేసి వారిని..
గుంటూరు లోక్సభ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ బరిలో దిగారు. తాజాగా ఆయన నామినేషన్ దాఖలు చేశారు. ఆ సందర్భంగా ఆయన.. తన ఆస్తులకు సంబంధించిన అఫిడవిట్ను సైతం అందులో పొందు పరిచారు. అయితే ఆయన ఆస్తులపై ఆశ్చర్యకరమైన చర్చ నడుస్తుంది. తనకు రూ. 5,700 కోట్ల ఆస్తులు ఉన్నట్లు వెల్లడించారు.
అమరావతి: ఏపీ లో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడంతో టీడీపీ తరఫున అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేసేందుకు సిద్ధమయ్యారు. టీడీపీ అధినేత నారా లోకేష్ మంగళగిరిలో గురువారం నామినేషన్ దాఖలు చేయనున్నారు.
సోమవారం అర్ధరాత్రి పోలీసులు(AP Police) బాపట్ల జిల్లా(Bapatla) మేదరమెట్ల గ్రామంలో ప్రజలను భయభ్రాంతులను చేశారు. ఒక డీఎస్పీ, ముగ్గురు సీఐలు, 10 మంది ఎస్ఐలు, 50 మందికిపై పోలీస్ సిబ్బంది, ఫ్లైయింగ్ స్క్వాడ్తో గ్రామంలోని ఓ టీడీపీ(TDP) కార్యకర్త ఇంటిని చట్టుముట్టారు. గోడలు దూకి, తలుపులు బాదుతూ హంగామా సృష్టించారు.