Home » Guntur
నటుడు ప్రకాష్రాజ్ చేసిన ట్వీట్పై మంత్రి కందుల దుర్గేష్ తీవ్ర స్థాయిలో స్పందించారు. ప్రకాష్రాజ్, జోసెఫ్ రావణ్లపై తీవ్ర విమర్శలు చేశారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఘటనలపై ప్రకాష్రాజ్ ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు.
ఆంధ్రప్రదేశ్లో న్యాయవాదుల భద్రతకు ప్రత్యేక చట్టం తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ అమలుకు సంబంధించి ఎన్నికల సమయంలో ఇచ్చిన 'యువగళం' హామీని నెరవేర్చే దిశగా మంత్రి నారా లోకేశ్ కసరత్తు ప్రారంభించారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల పని వేళల్లో తాత్కాలిక మార్పులు చేసింది. బీఎల్ఓ విధులు ఉన్న కేంద్రాలు జూన్ 29 నుంచి జులై 28 వరకు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు మాత్రమే పనిచేయనున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
విశాఖపట్నంలో నవంబర్ 12, 13 తేదీల్లో జరగనున్న 31వ సీఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ ఏర్పాట్లపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ప్రపంచ స్థాయి పెట్టుబడులు, సాంకేతికత, ప్రజా విధానాలు, నాలెడ్జ్ షేరింగ్కు వేదికగా ఈ సదస్సును నిర్వహించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లాలోని ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఏరువాక పౌర్ణమి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. వైసీపీ హయాంలో వ్యవసాయానికి కనీస సహకారం లేదని మండిపడ్డారు.
పల్నాడు జిల్లా మాచర్ల సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నగరవనం వద్ద లారీ, తుఫాను వాహనం ఢీకొని నలుగురు మృతిచెందగా.. పలువురికి తీవ్రగాయాలు అయ్యాయి.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగాల స్థానిక కేడర్ల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియకు ప్రభుత్వం మరింత గడువు కల్పించింది. పోస్టుల ఫ్రీజింగ్, కేడర్ మార్పులపై అమలులో ఉన్న పరిమితులను జూలై 5, 2026 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో దర్యాప్తు సంస్థ కీలక ఆధారాలు సేకరించింది. ఈ కేసులో టాస్క్ఫోర్స్ పోలీసుల పాత్రపై విచారణాధికారి ఏసీపీ దైవ ప్రసాద్ బృందం దృష్టి సారించింది.
మాజీ మంత్రి కొడాలి నానిపై నమోదైన కేసు విచారణకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. 2021 పంచాయతీ ఎన్నికల సమయంలో సీఎం చంద్రబాబు నాయుడు, నిమ్మగడ్డ రమేష్ కుమార్పై కొడాలి నాని చేసిన వ్యాఖ్యలపై నమోదైన కేసులో విచారణ ముందుకు సాగనుంది.
హోంమంత్రి వంగలపూడి అనితపై మాజీ మంత్రి, వైసీపీ నేత అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. మహిళా సంఘాలు, తెలుగు మహిళ నేతలు అమర్నాథ్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నారు.