Home » Guntur
నియోజకవర్గాల్లో జరిగే గ్రీవెన్సు్ల్లో సమస్యలు ఎంతవరకు పరిష్కారం అవుతున్నాయో తెలుసుకోవాలని టీడీపీ రీజినల్ కోఆర్డినేటర్లను మంత్రి నారా లోకేశ్ ఆదేశించారు. కోఆర్డినేటర్లు దీనికి సంబంధించిన నివేదికలు తయారు చేయాలని హుకుం జారీ చేశారు. గ్రామ స్థాయి నుంచి పార్టీ అనుబంధ సంఘాల బలోపేతానికి కృషి చేయాలని మార్గనిర్దేశం చేశారు.
గుంటూరు రైల్వే డివిజన్లో అభివృద్ధి పనులు వేగవంతమవుతున్నాయని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు. తెనాలిలో వందే భారత్ రైళ్లు ఆపాలన్న కోరిక సాకారం..
గుంటూరు జిల్లా కాకుమాను పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ పాఠశాల హెడ్ మాస్టర్ను బురిడీ కొట్టించారు సైబర్ నేరస్తులు. తాము సీఐడీ అధికారులమని ప్రధానోపాధ్యాయుడికి ఫోన్ చేసిన కేటుగాళ్లు.. హ్యూమన్ ట్రాఫికింగ్ కేసులో మీ పేరు ఉందంటూ ఆయనపై బెదిరింపులకు దిగారు. డిజిటల్ అరెస్టు చేయబోతున్నట్లు భయబ్రాంతులకు గురి చేశారు. అయోమయంలోకి నెట్టేసి ఆపై డబ్బులు డిమాండ్ చేశారు.
వైసీపీ నేత అంబటి రాంబాబుపై కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలు డమ్మీలు అనటం అంబటికి మంచి పద్ధతి కాదని హితవు పలికారు.
జంట హత్యల కేసులో నిందితులుగా ఉన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, పిన్నెల్లి వెంకటరామిరెడ్డి మాచర్ల కోర్టులో లొంగిపోయారు. సుప్రీం ఆదేశాల మేరకు పిన్నెల్లి బ్రదర్స్ కోర్టులో సరెండర్ అయ్యారు.
పల్నాడు జిల్లా చిలకలూరిపేట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంపై పోలీసులు విచారణ జరిపి అసలు వాస్తవాలను వెలుగులోకి తీసుకొచ్చారు. ట్రాక్టర్ల లోడుతో వెళ్తున్న కంటైనర్కు కారును అడ్డుపెట్టి ఆపడం వల్ల మరో కారు వచ్చి ఢీకొట్టినట్లు విచారణలో తేలింది.
సాధారణంగా పరీక్షల్లో వందకు 35 మార్కులు వస్తే పిల్లలను టీచర్లు పాస్ చేస్తారు. అలానే రైతులు తీసుకొచ్చిన పత్తి బండి సీసీఐ కొనుగోలు కేంద్రంలోనికి వెళ్లాలంటే.. క్వింటాల్ కు రూ.20లు చెల్లిస్తేనే పాస్ చేస్తున్నారు. లేదంటే లోనికి పంపేది లేదని మంకుపట్టు పడుతున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలోని అన్ని సీసీఐ కేంద్రాల్లో ఇదే పరిస్థితి నెలకొని ఉంది.
అమరావతి అభివృద్ధి, విస్తరణ కోసం భూములు ఇచ్చేందుకు రైతులు మరోసారి ముందుకు వచ్చారు. రెండో విడత ల్యాండ్ పూలింగ్కు సర్కార్ ఉత్తర్వులు జారీ చేయగా.. భూముల సేకరణ ప్రక్రియ మొదలైంది.
విశాఖపట్నం-లింగంపల్లి జన్మభూమి ఎక్స్ప్రెస్ సహా ప్రధాన రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైల్వేశాఖ వాల్తేరు సీనియర్ డీసీఎం కె.పవన్కుమార్ తెలిపారు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో గోదావరి-రాజమండ్రి, రాజమండ్రి-కడియం సెక్షన్లలో ఆధునికీకరణ నిర్మాణ పనులు చేపట్టనున్న నేపథ్యంలో జనవరిలో పలు రైళ్లను తాత్కాలికంగా రద్దు చేస్తున్నామని
సికింద్రాబాద్-అనకాపల్లి మధ్య ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణమధ్యరైల్వే అధికారులు తెలిపారు. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఈ రైళ్లను నడుపుతున్నట్లు తెలిపారు. డిసెంబరు 4నుంచి వచ్చే ఏడాది మార్చి 26 వరకు ఈ ప్రత్యేక రైళ్లు నడుపుతాయని తెలిపారు.