President Draupadi Murmu: తిరుచానూరులో పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ABN, Publish Date - Nov 20 , 2025 | 09:49 PM
తిరుపతి పర్యటనలో భాగంగా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గురువారం (20-11-2025) రేణిగుంట ఎయిర్ పోర్ట్కు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఎయిర్ పోర్ట్లో రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత, తిరుపతి జిల్లా ఉన్నతాధికారులు, పలువురు ప్రజాప్రతినిధులు ఆమెకు ఘన స్వాగతం పలికారు. అనంతరం రోడ్డు మార్గంలో తిరుచానూరుకు రాష్ట్రపతి చేరుకున్నారు. దేవాలయం వద్ద టీటీడీ చైర్మన్ బీఆర్ నాయడు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్, జేఈవో వెంకయ్య చౌదరి రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు స్వాగతం పలికారు.
అనంతరం రోడ్డు మార్గంలో తిరుచానూరుకు రాష్ట్రపతి చేరుకున్నారు. దేవాలయం వద్ద టీటీడీ చైర్మన్ బీఆర్ నాయడు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్, జేఈవో వెంకయ్య చౌదరి రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా ఎయిర్ పోర్ట్లో రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత, తిరుపతి జిల్లా ఉన్నతాధికారులు, పలువురు ప్రజాప్రతినిధులు ఆమెకు ఘన స్వాగతం పలికారు.
అనంతరం రోడ్డు మార్గంలో తిరుచానూరుకు రాష్ట్రపతి చేరుకున్నారు. దేవాలయం వద్ద టీటీడీ చైర్మన్ బీఆర్ నాయడు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్, జేఈవో వెంకయ్య చౌదరి రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు స్వాగతం పలికారు.
తిరుచానూరులో శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకుని.. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత అమ్మవారి తీర్థ ప్రసాదాలను రాష్ట్రపతికి వేద పండితులు అందజేశారు.
రాష్ట్రపతి పర్యటన సందర్భంగా తిరుచానూరులో పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.
తిరుచానూరు పర్యటన ముగించుకుని.. సాయంత్రం రోడ్డు మార్గం ద్వారా రాష్ట్రపతి తిరుమల చేరుకున్నారు. రాత్రికి పద్మావతి అతిథి గృహంలో ఆమె బస చేస్తారు.
శుక్రవారం ఉదయం శ్రీవెంకటేశ్వర స్వామి వారిని రాష్ట్రపతి దర్శించుకోనున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన నేపథ్యంలో తిరుమలలో సైతం పటిష్టమైన భద్రతాను ఏర్పాటు చేశారు. తిరుపతి పర్యటన ముగిసిన అనంతరం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్కు బయలుదేరి వెళ్లనున్నారు.
Updated Date - Nov 20 , 2025 | 09:56 PM