విశాఖ పార్టీ కార్యాలయంలో 77వ రోజు ప్రజాదర్బార్
ABN, Publish Date - Dec 12 , 2025 | 10:20 AM
పలు ఐటీ సంస్థలకు శంకుస్థాపన చేసేందుకు విశాఖ చేరుకున్న విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ నేడు ఉదయం విశాఖ పార్టీ కార్యాలయంలో 77వ రోజు ప్రజాదర్బార్ నిర్వహించారు.
పలు ఐటీ సంస్థలకు శంకుస్థాపన చేసేందుకు విశాఖ చేరుకున్న విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ నేడు ఉదయం విశాఖ పార్టీ కార్యాలయంలో 77వ రోజు ప్రజాదర్బార్ నిర్వహించారు.
ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరించిన మంత్రి లోకేష్.. వివిధ సమస్యలపై వారి నుంచి అర్జీలు స్వీకరించారు.
స్టీల్ ప్లాంట్ టౌన్ షిప్ లో గత 40 ఏళ్లుగా నిర్వహిస్తున్న విశాఖ విమల విద్యాలయాన్ని(స్టీల్ ప్లాంట్) ఏకపక్షంగా మూసివేయడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, తమ సమస్యలను పరిష్కరించి న్యాయం చేయడంతో పాటు పెండింగ్ జీతాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని విద్యాలయ స్కూల్ సిబ్బంది మంత్రి నారా లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు.
ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించే మెడికల్ ఇన్ వాలిడేషన్ స్కీమ్ ను ఆర్టీసీ ఉద్యోగులకు కూడా వర్తింపజేసి, పెండింగ్ దరఖాస్తులను పరిష్కరించాలని సిబ్బంది మంత్రి నారా లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు.
రెగ్యులర్ స్టాఫ్కు విశాఖ స్టీల్ ప్లాంట్ లో ఉద్యోగ అవకాశం కల్పించాలని కోరారు.
ఆయా వినతులను పరిశీలించి పరిష్కారానికి కృషిచేస్తామని మంత్రి నారా లోకేష్ హామీ ఇచ్చారు.
Updated Date - Dec 12 , 2025 | 10:20 AM