Cyclone Montha: మొంథా తుపాన్.. రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు..
ABN, Publish Date - Oct 28 , 2025 | 06:18 PM
మొంథా తుపాన్ కారణంగా.. రాష్ట్రవ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
మొంథా తుపాన్ కారణంగా కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తిరుమలలో సైతం ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తుంది. దీనికి తోడు ఈదురు గాలులు సైతం వీచాయి.
దీంతో స్వామి వారి దర్శనానికి వచ్చిన భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
ముందస్తు చర్యల్లో భాగంగా భక్తులు గొడుగులతో తిరుమలకు చేరుకున్నారు.
మరికొందరు భక్తుల వద్ద గొడుగులు లేకపోవడంతో వారు తడిసి ముద్దయ్యారు.
పిల్లపాపలతో తిరుమలకు వచ్చిన భక్తులు తడిసిపోయారు.
అలాగే వర్షంలోనే భక్తులు.. స్వామి వారికి కొబ్బరికాయ కొట్టి.. కర్పూరం వెలిగించి తమ మొక్కులు చెల్లించుకున్నారు.
మొంథా తుపాన్ నేపథ్యంలో తిరుపతి నగరాన్ని ముసురు కమ్మెసింది.
చిత్తూరు సమీపంలోని ఎన్టీఆర్ జలాశయానికి వర్షం నీరు పోటెత్తింది. దీంతో జలాశయంలో చేపలు పట్టేందుకు స్థానికులు సిద్ధమయ్యారు.
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా రావులపాలెం జొన్నాడ సమీపంలో జాతీయ రహదారిపై చెట్లు కూలాయి. వాటిని తొలగిస్తున్న సిబ్బంది.
రావులపాలెం గోదావరి బ్రిడ్జిపై తుపాను ప్రభావంతో వాతావరణ పరిస్థితి.
మొంథా తుపాన్.. విజయనగరంలోని రైల్వే స్టేషన్లో బయలుదేరడానికి సిద్ధంగా ఉన్న రైలు.. భారీ వర్షం కారణంగా నిర్మానుష్యంగా మారిన స్టేషన్
విజయనగరం సమీపంలో వాగు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి.
విజయనగరంలోని కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసిన ప్రభుత్వం. ప్రజలకు సూచనలు చేస్తున్న సిబ్బంది
Updated Date - Oct 28 , 2025 | 06:20 PM