At Home in AP Raj Bhavan: రాజ్భవన్లో ఎట్ హోమ్.. హాజరైన సీఎం, డిప్యూటీ సీఎం దంపతులు
ABN, Publish Date - Aug 15 , 2025 | 09:18 PM
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా విజయవాడలోని రాజ్ భవన్లో గురువారం నాడు ఎట్ హోమ్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, భువనేశ్వరి దంపతులు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్తోపాటు ఆయన భార్య అన్నా లేజినోవా దంపతులు హాజరయ్యారు.
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా విజయవాడలోని రాజ్ భవన్లో గురువారం నాడు ఎట్ హోమ్ కార్యక్రమం జరిగింది.
ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, భువనేశ్వరి దంపతులు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్తోపాటు ఆయన భార్య అన్నా లేజినోవా హాజరయ్యారు.
అలాగే ఐటీ, విద్య శాఖల మంత్రి నారా లోకేష్తోపాటు పలువురు మంత్రులు పాల్గొన్నారు.
పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతోపాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్.. అతిథుల వద్దకు స్వయంగా వెళ్లి వారిని ఆత్మీయంగా పలకరించారు.
ఎట్ హోమ్ కార్యక్రమం సందర్భంగా రాజ్ భవన్ పరిసర ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు.
రాజ్భవన్ ప్రాంతంలో ట్రాఫిక్ను సైతం మళ్లించారు.
ఎట్ హోమ్ కార్యక్రమానికి ఏపీ హైకోర్టులోని పలువురు న్యాయమూర్తులు సైతం హాజరయ్యారు.
ఈ ఎట్ హోమ్ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ భార్య అన్నా లేజినోవా ముచ్చటించుకోవడం ప్రధాన ఆకర్షణగా నిలిచింది.
Updated Date - Aug 15 , 2025 | 09:18 PM