ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Pahalgam Terror Attack: నేడు బంద్.. పహల్గాంలో కాల్పుల వెనుక ఉంది అతడే..

ABN, Publish Date - Apr 23 , 2025 | 08:56 AM

Pahalgam Terror Attack: పహల్గాంలోని బైసరన్ ప్రాంతంలో ఉగ్రవాదుల కాల్పులకు తెగబడిన ఘటన వెనుక కర్త, కర్మ, క్రియ అన్ని సైఫుల్లా కసౌరి అలియాస్ ఖలీద్ ఉన్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. అతడు హఫీజ్ సయ్యద్ అనుచరుడని వెల్లడించాయి.

Saifullah Kasuri alias Khalid

శ్రీనగర్, ఏప్రిల్ 23: జమ్మూ కశ్మీర్‌ పహల్గాంలోని బైసరన్ మైదాన ప్రాంతంలో మంగళవారం ఉగ్రవాదులు కాల్పులకు తెగబడిన ఘటన వెనుక కీలక సూత్రదారి లష్కరే తోయిబా టాప్ కమాండర్ సైఫుల్లా కసౌరి అలియాస్ ఖలీద్‌తోపాటు రావల్ కోట్‌కు చెందిన మరో ఇద్దరు వ్యక్తులు ఉన్నట్లు నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. ఈ ఉగ్రవాద సంస్థకు చెందిన హఫీజ్ సయ్యద్ అనుచరుడు ఖలీద్‌ అని భావిస్తున్నారు. ఇక పర్యాటకులపై మొత్తం ఐదు లేదా ఆరుగురు ఉగ్రవాదులు కాల్పులు జరిపినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

మరోవైపు ఉగ్రవాదుల కాల్పులను ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీతోపాటు వివిధ రాజకీయ పార్టీలు ఖండించాయి. ఈ నేపథ్యంలో బుధవారం బంద్‌కు పిలుపు నిచ్చాయి. దీంతో జమ్మూ అంతటా భద్రతను పెంచారు. అలాగే జమ్మూ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, జమ్మూ బార్ అసోసియేషన్,విశ్వహిందూ పరిషత్,రాష్ట్రీయ భజరంగ్ దళ్ రాష్ట్ర యూనిట్ ఒక రోజు జమ్మూ బంద్‌కు పిలుపునిచ్చాయి. మరోవైపు ఈ బంద్‌కు ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యం సైతం బంద్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటించింది.


ఇంకోవైపు ఈ కాల్పుల ఘటనతో దుబాయ్ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ..తన పర్యటనను అర్థాంతరంగా రద్దు చేసుకొని భారత్‌కు తిరిగి వచ్చారు. భద్రతపై అత్యవసరంగా కేబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీతో ఆయన ఈ రోజు చర్చించనున్నారు. ఇక ఈ ఘటనతో జమ్మూ కశ్మీర్‌లోని సైన్యం అప్రమ్మత్తమైంది. అందులోభాగంగా ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. ఆ క్రమంలో అటవీ, మైదాన ప్రాంతంలో జల్లెడ పడుతోన్నారు.

ఈ వార్తలు కూడా చదవండి..

Pahalgam Terror Attack: జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాదుల కాల్పులు.. వైరల్‌గా మారిన వీడియోలు

PM Modi: ప్రధాని మోదీ సౌదీ టూర్ రద్దు..ఇండియాకు వచ్చేసిన పీఎం


TRAI: సిగ్నల్, నెట్ లేకపోతే సైలెంట్ కాదు..ఫిర్యాదు చేయడం మరింత ఈజీ తెలుసా..

Google CCI: గూగుల్ కీలక నిర్ణయం..ఆ కేసు పరిష్కారం కోసం రూ.20.24 కోట్లు చెల్లింపు

Scam Payments: మార్కెట్లోకి నకిలీ ఫోన్ పే, గూగుల్ పే యాప్స్.. జర జాగ్రత్త..

For National News And Telugu News

Updated Date - Apr 23 , 2025 | 10:05 AM