Priyanka Gandhi: సమగ్ర దర్యాప్తు జరగాలి: ప్రియాంక గాంధీ
ABN, Publish Date - Jul 10 , 2025 | 05:04 PM
గుజరాత్లో గంభీర బ్రిడ్జి కూలిపోవడంపై ప్రియాంక గాంధీ స్పందించారు. ఇలాంటి ఘటనల పట్ల ఏమాత్రం అలసత్వం కూడదని, సమగ్ర దర్యాప్తు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. అహ్మదాబాద్ విమాన ప్రమాదం వంటి విషాదాలు నాయకత్వ లేమి, అవినీతి, అసమర్థత..
న్యూఢిల్లీ, జూలై 10: గుజరాత్లోని వడోదరలో నిన్న (బుధవారం) గంభీర బ్రిడ్జి కూలిపోయిన ఘటనపై కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా తీవ్రంగా స్పందించారు. ఈ దుర్ఘటనలో 15 మంది ప్రాణాలు కోల్పోయారన్న ప్రియాంక గాంధీ.. భారీ బ్రిడ్జి కూలడంపై సమగ్ర దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. ప్రమాద ప్రాంతంలో రెండవ రోజు కూడా సహాయక చర్యలు కొనసాగుతున్నప్పటికీ, అదే సమయంలో దర్యాప్తు కూడా జరగాలని ప్రియాంక గాంధీ అన్నారు.
వడోదర కలెక్టర్ అనిల్ ధమేలియా విలేకరులతో మాట్లాడుతూ, 'ఇవాళ మరో మూడు మృతదేహాలను వెలికితీయడంతో మృతుల సంఖ్య 15కి చేరుకుంది. నలుగురు గల్లంతయ్యారు. జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (NDRF), రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం (SDRF) 4 కి.మీ. మేర గాలింపు, రక్షణ చర్యలు నిర్వహిస్తున్నాయి' అని చెప్పారు. నదిలోకి పడిపోయిన రెండు వాహనాల గురించి ప్రజల నుండి వివరాలను కోరుతున్నామన్నారు.
ఇవి కూడా చదవండి
స్కూళ్లలో నో పాలిటిక్స్.. అంతా బయటే: మంత్రి లోకేష్
మెగా పీటీఎం.. స్టూడెంట్స్కు పాఠం చెప్పిన సీఎం
Read Latest AP News And Telugu News
Updated Date - Jul 10 , 2025 | 05:43 PM