Home » Priyanka Gandhi
ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్తో పాటు ఇద్దరు ఈసీలు ఎస్ఎస్ సంధు, వివేక్ జోషి పేర్లను కూడా గుర్తుపెట్టుకోవాలని ప్రియాంక ఓ సభలో ప్రజలను కోరారు. ఈ సందర్భంగా 'చోర్ చోర్' అంటూ ప్రియాంక మద్దతుదారులు నినాదాలు చేయడం కనిపించింది.
రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపించేది ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కాదని ప్రియాంక విమర్శించారు. ప్రధాని, ఇతర కేంద్ర నాయకులు న్యూఢిల్లీ నుంచి రిమోట్ కంట్రోల్తో ప్రభుత్వాన్ని నడుపుతున్నారని అన్నారు.
దేశాభివృద్ధిలో బిహార్ పాత్ర ఎంతో ఉందని, కానీ బిహార్లో మాత్రం ఆశించిన అభివృద్ధి జరగలేదని ప్రియాంక గాంధీ అన్నారు. బిహార్ పాలకుల బూటకపు వాగ్దానాలు నమ్మి మోసపోవద్దని సూచించారు.
విద్యార్థులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏమయ్యాయని బండి సంజయ్ ప్రశ్నించారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు రూ.10,000 కోట్లు దాటాయని తెలిపారు. దసరాకు ముందు ప్రైవేట్ కాలేజీలకు హామీ ఇచ్చిన రూ.600 కోట్లు ఇంకా విడుదల కాలేదని పేర్కొన్నారు.
కాంగ్రెస్ పార్టీ ఓ కొత్త ఉద్యమాన్ని మొదలుపెట్టింది. ఓటు హక్కు రక్షణ, ఓటు చోరీపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ప్రజల ఓటు విలువను కాపాడడమే లక్ష్యంగా కొనసాగనున్న ఈ కార్యక్రమంలో ప్రజలు భాగస్వామ్యం కావాలని ఎంపీ ప్రియాంకా గాంధీ పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ, సీనియర్ నేత జైరామ్ రమేష్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడ వీల్చైర్పై పార్లమెంటుకు వచ్చి ఓటు వేశారు.
ఓట్ల చోరీపై త్వరలో మరో పెద్ద బాంబు పేలుస్తామని రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. బాంబును ఎదుర్కొనేందుకు బీజేపీ సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. ఆ బాంబుతో ప్రధాని మోదీ ఇక దేశానికి తన ముఖాన్ని చూపించలేరని విమర్శించారు.
ఓటర్ అధికార్ యాత్ర’లో పాల్గొనేందుకు వెళ్లిన తెలంగాణ సీఎం రేవంత్రెడ్డికి.. ఏఐసీసీ అగ్రనేతలు రాహుల్గాంధీ, ప్రియాంకగాంధీ అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు.
రాహుల్ యాత్రలో ప్రియాంక పాల్గొనడం ద్వారా ఓట్ల చోరీకి వ్యతిరేకంగా జరుగుతున్న యాత్రలో మహిళల మద్దతు కూడా కూడగడతారని కాంగ్రెస్ సీనియర్ నేత ఒకరు తెలిపారు. కాగా, రాహుల్ గాంధీ ఆదివారంనాడు పూర్ణియా జిల్లాలో యాత్ర సాగించారు.
కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ మరోసారి స్వంత పార్టీకి ఝలక్ ఇచ్చారు. కాంగ్రెస్ అగ్రనేతలు వ్యతిరేకిస్తున్నా శశిథరూర్ మాత్రం బీజేపీ సర్కారు కొత్తగా తెచ్చిన బిల్లును స్వాగతిస్తున్నారు.