Modi on terrorism: ఉగ్రవాదాన్ని సహించేది లేదు
ABN, Publish Date - May 08 , 2025 | 05:18 AM
ఉగ్రవాదాన్ని ఎలాంటి రూపంలోనూ సహించమని ప్రధాని మోదీ మంత్రివర్గ సమావేశంలో స్పష్టం చేశారు. ఆపరేషన్ సిందూర్ విజయవంతంగా పూర్తి చేసిన భద్రతా దళాలను ప్రశంసించారు.
క్యాబినెట్ భేటీలో మోదీ ఉద్ఘాటన
న్యూఢిల్లీ, మే 7: ఉగ్రవాదాన్ని సహించేది లేదని ప్రధాని మోదీ మరోసారి నొక్కి చెప్పారు. ఉగ్రవాదం ఏరూపంలో ఉన్నా ఉపేక్షించకూడదని వ్యాఖ్యానించారు. బుధవారం జరిగిన కేంద్ర మంత్రి వర్గ సమావేశంలో మాట్లాడుతూ.. ‘ఆపరేషన్ సిందూర్’ను విజయవంతం చేసిన భద్రతా దళాలపై మోదీ ప్రశంసలు గుప్పించారు. భేటీలో తొలుత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ‘ఆపరేషన్ సిందూర్’ జరిగిన తీరును మంత్రులకు వివరించారు. మంత్రులు బల్లపై చరుస్తూ తమ అభినందనలు తెలిపారు. ఇక ఆపరేషన్ సిందూర్ అనంతర పరిణామాల జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డొభాల్తో మోదీ ప్రత్యేకంగా సమావేశమై చర్చించారు. మరోవైపు ‘ఆపరేషన్ సిందూర్’ నేపథ్యంలో ప్రధాని మోదీ యూరప్ పర్యటన రద్దయింది. ఈనెల మధ్యలో క్రొయేషియా, నార్వే, నెదర్లాండ్స్ దేశాల్లో మోదీ పర్యటించాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి:
Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ దాడికి ముందు..దాడి తర్వాత ఎలా ఉందంటే..
Operation Sindoor: ఆపరేషన్ సిందూర్పై..సచిన్, సెహ్వాగ్ సహా పలువురి క్రీడా ప్రముఖుల స్పందన
Bank of Baroda Recruitment: టెన్త్ అర్హతతో బ్యాంకులో ఉద్యోగాలు..నెలకు రూ.37 వేల జీతం
Read More Business News and Latest Telugu News
Updated Date - May 08 , 2025 | 05:18 AM