ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Pakistan Ceasefire: కశ్మీర్‌లో మళ్లీ కాల్పులు..తొమ్మిదోసారి ఒప్పందాన్ని ఉల్లంఘించిన పాకిస్తాన్

ABN, Publish Date - May 03 , 2025 | 08:13 AM

భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు క్రమంగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో పాకిస్తాన్ తన ప్రవర్తనను ఇంకా అలాగే కొనసాగిస్తోంది. వరుసగా తొమ్మిదోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ, మే 3న జమ్మూ కశ్మీర్‌లోని ఎల్‌ఓసీ వెంబడి మరోసారి మిలిటరీ ఆగ్రహాన్ని చూపించింది.

Pakistan Violates Ceasefire 9th time

పాకిస్తాన్ ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. వరుసగా తొమ్మిదోసారి శనివారం (మే 3న) కూడా జమ్మూ కశ్మీర్‌లోని లైన్ ఆఫ్ కంట్రోల్ (LOC) వెంబడి కాల్పులకు పాల్పడింది. ఈ ఘటనలో పాకిస్తాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని (Pakistan Ceasefire) ఉల్లంఘించిందని భారత సైన్యం వెల్లడించింది. కుప్వారా, ఉరి, అఖ్నూర్ ప్రాంతాల్లో పాకిస్తాన్ సైన్యం దాడులకు పాల్పడింది. వెంటనే స్పందించిన భారత సైన్యం పరిస్థితిని నియంత్రణలోకి తెచ్చింది.

అసలు ఏం జరిగింది

మే 02-03న రాత్రి పాకిస్తాన్ సైన్యం ఎల్‌ఓసీకి ఎదురుగా ఉన్న కుప్వారా, ఉరి, అఖ్నూర్ ప్రాంతాల్లో భారత సైనిక స్థావరాలపై కాల్పులు జరిపింది. ఈ కాల్పుల నేపథ్యంలో భారత సైన్యం తక్షణమే స్పందించి తిప్పికొట్టింది. ఈ క్రమంలో ఆయా సరిహద్దు ప్రాంతాల్లో నివసించే ప్రజలు భయాందోళన చెందుతున్నారు. పరిస్థితి మరింత ఉద్రిక్తమైతే షెల్లింగ్ జరిగే అవకాశం ఉందనే భయంతో వారు వ్యక్తిగత బంకర్లను సిద్ధం చేసుకుంటున్నారు. ఆర్.ఎస్.పురా, అర్నియా సెక్టార్లలో పంట కోత పూర్తయినప్పటికీ, కఠువా, సాంబా, రజౌరీ, పూంచ్ జిల్లాల్లో ఇంకా కొనసాగుతోంది.


వివిధ ప్రాంతాల్లో

ఏప్రిల్ 22న జరిగిన పహల్గాం దాడి తర్వాత ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఆ దాడిలో 26 మంది సామాన్య పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలోనే ఏప్రిల్ 24 రాత్రి నుంచి భారత్ ఇండస్ వాటర్స్ ఒప్పందాన్ని సస్పెండ్ చేసిన కొన్ని గంటల తర్వాత, పాకిస్తాన్ సైన్యం ఎల్‌ఓసీ వెంబడి వివిధ ప్రాంతాల్లో దాడులకు పాల్పడుతోంది. మంగళవారం, ఈ దాడులు జమ్మూ జిల్లాలోని పర్గ్వాల్ సెక్టార్‌లోని అంతర్జాతీయ సరిహద్దు వరకు విస్తరించాయి. అదే రోజు, ఇరు దేశాల సైనిక కార్యకలాపాల డైరెక్టర్ జనరల్స్ (డీజీఎంఓలు) హాట్‌లైన్ సంభాషణ జరిపారు. ఈ చర్చల్లో భారత్, పాకిస్తాన్ సైన్యాన్ని దాడులను కొనసాగించవద్దని హెచ్చరించినట్లు సమాచారం. కానీ వారు మాత్రం పదే పదే కాల్పుల ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూనే ఉన్నారు.


ఇరు దేశాల మధ్య చర్యలు

పహల్గాం దాడి తర్వాత భారత్ పాకిస్తాన్ విషయంలో కీలక చర్యలు తీసుకుంది. వీటిలో ఇండస్ వాటర్స్ ఒప్పందాన్ని సస్పెండ్ చేయడం, అటారీ ల్యాండ్ బోర్డర్ క్రాసింగ్‌ను మూసివేయడం, దౌత్య సంబంధాలను డౌన్‌గ్రేడ్ చేయడం వంటివి ఉన్నాయి. దీనికి ప్రతీకారంగా పాకిస్తాన్ భారత విమానాలకు తన గగనతలాన్ని మూసివేసింది. అలాగే భారత్‌తో అన్ని రకాల వాణిజ్యాన్ని నిలిపివేసింది. ఇండస్ వాటర్స్ ఒప్పందం సస్పెన్షన్‌ను పాకిస్తాన్ తిరస్కరించింది. నీటి ప్రవాహాన్ని అడ్డుకునే ఏ చర్యనైనా “యుద్ధ చర్య”గా పరిగణిస్తామని హెచ్చరించింది.


ఇవి కూడా చదవండి:

Hyderabad vs Gujarat: ఈ తప్పులు చేయకుంటే హైదరాబాద్ జట్టు గెలిచేది..కానీ చివరకు


PM Modi: ఇక్కడ శశి థరూర్..ఇది కొంత మందికి నిద్ర కూడా పట్టదన్న ప్రధాని మోదీ


Bank Holidays: మే 2025లో 12 రోజులు బ్యాంకులు బంద్.. పూర్తి లిస్ట్ ఇదే

Read More Business News and Latest Telugu News

Updated Date - May 03 , 2025 | 08:18 AM