ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Operation Sindoor: మళ్లీ పౌరులపైనే గురి

ABN, Publish Date - May 08 , 2025 | 03:40 AM

ఆపరేషన్‌ సిందూర్‌ అనంతరం పాక్‌ జరిపిన విచక్షణారహిత దాడిలో 13 మంది పౌరులు మరణించారు, 57 మంది గాయపడ్డారు. పూంచ్‌, రాజౌరీ, కుప్వారాల్లో పౌర నివాసాలు, బస్టాండ్లు, గురుద్వారాలు లక్ష్యంగా పాక్‌ కాల్పులు జరపడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు లోనయ్యారు.

భారత్‌ దాడితో విచక్షణ కోల్పోయిన పాక్‌

కశ్మీర్‌ జనావాసాలపై యథేచ్ఛగా కాల్పులు

పిల్లలు సహా 13 మంది మృతి.. 57 మందికి గాయాలు.. ఇళ్లు అగ్నికి ఆహుతి

సురక్షిత ప్రాంతాలకు వేలమంది తరలింపు

పూంచ్‌, మే 7: ఆపరేషన్‌ సిందూర్‌తో విచక్షణ కోల్పోయిన దాయాదిదేశం సాధారణ భారత ప్రజలపై తన ‘ప్రతాపం’ చూపింది. జమ్ముకశ్మీర్‌లోని సరిహద్దు జిల్లాలైన పూంచ్‌, రాజౌరీ, కుప్వారాల్లో వందలాది నివాసాలపై ఫిరంగి గుళ్ల వర్షం కురిపించింది. ఈ దారుణమైన దాడిలో కనీసం 13 మంది పౌరులు మరణించగా.. 57 మంది గాయపడ్డారు. అనేక ఇళ్లు, భవనాలు నేలమట్టమయ్యాయి. ఓ గురుద్వారా కూడా ధ్వంసమైంది. మృతుల్లో నలుగురు పిల్లలు, ఒక జవాను కూడా ఉన్నారు. పాక్‌ దాడి నేపథ్యంలో, వేలాదిమందిని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. బుధవారం వేకువజామున భారత్‌ దాడి జరిగిన కొద్ది వ్యవధిలోనే పాక్‌.. సరిహద్దు ప్రాంతాల పౌర నివాసాలపై విచక్షణారహిత దాడి ప్రారంభించింది. పూంచ్‌ బస్టాండు లక్ష్యంగానూ పాక్‌ కాల్పులు జరిపింది. పలు బస్సులు ధ్వంసమయ్యాయి. పూంచ్‌ పట్టణంలో ఐక్యరాజ్యసమితికి చెందిన ఓ కార్యాలయం, ఫారెస్ట్‌ డిపార్ట్‌మెంట్‌ భవనాలు కూడా పాక్షికంగా ధ్వంసమయ్యాయి. బుధవారం మధ్యాహ్నం వరకూ కాల్పులు కొనసాగాయి. అనుకోకుండా జరిగిన ఈ పరిణామానికి జనం భీతిల్లిపోయారు. ప్రాణాలు దక్కించుకోవటానికి పరుగులు తీశారు. గాయపడిన వారిని చికిత్స కోసం స్థానికులు.. కాల్పుల మధ్యనే ఆస్పత్రులకు తరలించారు. కాగా, పాక్‌ జరిపిన దాడిలో పౌర నివాసాలకు జరిగిన నష్టం, విధ్వంసం తాలూకు ఫొటోలు, వీడియోలు వైరల్‌ అయ్యాయి. కాగా భారత్‌ క్షిపణులు, డ్రోన్లు, యుద్ధవిమానాలతో ఉగ్ర శిబిరాల మీద దాడి చేస్తే పాక్‌ మాత్రం శతఘ్నులు, ఫిరంగులతో భారత పౌరుల మీద దాడి చేయటం ఆ దేశం స్థాయిని తెలుపుతోందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.


ఇవి కూడా చదవండి:

Operation Sindoor: ఆపరేషన్ సింధూర్ అప్రమత్తమైన తెలంగాణ.. అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం ఆదేశాలు

Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ దాడికి ముందు..దాడి తర్వాత ఎలా ఉందంటే..

Operation Sindoor: ఆపరేషన్ సిందూర్‎పై..సచిన్, సెహ్వాగ్ సహా పలువురి క్రీడా ప్రముఖుల స్పందన

Bank of Baroda Recruitment: టెన్త్ అర్హతతో బ్యాంకులో ఉద్యోగాలు..నెలకు రూ.37 వేల జీతం

Read More Business News and Latest Telugu News

Updated Date - May 08 , 2025 | 03:40 AM