Pakistan reaction: చేతులెత్తేసిన పాక్..
ABN, Publish Date - May 08 , 2025 | 04:11 AM
ఆపరేషన్ సిందూర్ దాడుల నేపథ్యంలో పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ స్పందిస్తూ, భారత్ తన ఆపరేషన్లను ఆపితే తాము ప్రతిస్పందన ఇవ్వమని చెప్పారు. భారత్ క్షిపణి దాడుల్లో 26 మంది మృతిచెందగా, 46 మంది గాయపడినట్లు పాక్ ఆర్మీ ప్రకటించింది.
భారత్ తగ్గితే ఉద్రిక్తతల ముగింపునకు సిద్ధం:పాక్ రక్షణ మంత్రి
ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో పాకిస్థాన్లో వణుకుపుడుతోంది. ఆ దేశంలోని ఉగ్రస్థావరాలపై భారత్ దాడులు జరిపిన గంటల తర్వాత పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ బుధవారం స్పందించారు. సరిహద్దుల్లో భారత్ తన ఆపరేషన్లను నిలిపివేస్తే తదుపరి చర్యకు దూరంగా ఉండటానికి తాము సిద్ధంగా ఉన్నామని చెప్పుకొచ్చారు. తమపై దాడి జరిగితే పాకిస్థాన్ స్పందిస్తుందని బ్లూమ్బర్గ్ టెలివిజన్తో అన్నారు. భారత్ పట్ల తాము ఎలాంటి ప్రతికూల చర్యను తీసుకోమని గత పక్షం రోజులుగా చెబుతున్నామని, కానీ తమపై దాడి జరిగితే స్పందిస్తామని చెప్పారు. ఒకవేళ భారత్ వెనక్కి తగ్గితే తాము ఈ ఉద్రిక్తతను కచ్చితంగా ముగిస్తామన్నారు. పాక్ ఆర్మీ అధికార ప్రతినిధి అహ్మద్ షరీఫ్ మాట్లాడుతూ.. భారత్ జరిపిన క్షిపణి దాడులతో 26 మంది మృతి చెందగా.. 46 మంది గాయాల పాలైనట్లు చెప్పారు.
ఇవి కూడా చదవండి:
Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ దాడికి ముందు..దాడి తర్వాత ఎలా ఉందంటే..
Operation Sindoor: ఆపరేషన్ సిందూర్పై..సచిన్, సెహ్వాగ్ సహా పలువురి క్రీడా ప్రముఖుల స్పందన
Bank of Baroda Recruitment: టెన్త్ అర్హతతో బ్యాంకులో ఉద్యోగాలు..నెలకు రూ.37 వేల జీతం
Read More Business News and Latest Telugu News
Updated Date - May 08 , 2025 | 04:11 AM