Pakistan airspace: పాక్ గగనతలం ఖాళీ
ABN, Publish Date - May 08 , 2025 | 05:12 AM
భారత్ దాడుల తర్వాత పాకిస్థాన్ గగనతలంలో విమానాలు కనుమరుగయ్యాయి. గల్ఫ్ దేశాల విమానాలు సహా అనేక అంతర్జాతీయ విమానాలు పాక్ను దాటి వెళ్లకుండా అరేబియా సముద్రం మీదుగా మళ్లించబడుతున్నాయి.
(ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి)
పాక్పై భారత్ దాడులతో ఆ దేశ గగనతలం ఖాళీ అయిపోయింది. గల్ఫ్ విమానయాన సంస్థలన్నీ పాకిస్థాన్కు తమ విమానాలను రద్దు చేశాయి. అమెరికా, యూరప్ దేశాల నుంచి భారత్కు, ఇతర దేశాలకు వెళ్లే విమానాలన్నింటినీ కూడా పాక్ గగనతలానికి దూరంగా అరేబియా సముద్రం మీదుగా మళ్లిస్తున్నారు. భారత్ తప్ప మిగతా అన్ని దేశాల విమానాలకు పాక్ అనుమతి ఇచ్చినా కూడా ఈ మళ్లింపు కొనసాగుతుండటం గమనార్హం. అదే సమయంలో పాక్ సరిహద్దులకు సమీప ప్రాంతాలు మినహా భారత గగనతలం అంతటా విమానాల ప్రయాణాలు కొనసాగాయి. ప్రపంచవ్యాప్తంగా విమాన రాకపోకల సమాచారాన్ని ప్రచురించే ఫ్లైట్ రాడార్24 సంస్థ దీనికి సంబంధించిన చిత్రాన్ని విడుదల చేసింది. బుధవారం పాక్ గగనతలంలో నాలుగే పౌర విమానాలు ప్రయాణించగా.. భారత్లో వందల విమానాలు ప్రయాణించడం గమనార్హం.
ఇవి కూడా చదవండి:
Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ దాడికి ముందు..దాడి తర్వాత ఎలా ఉందంటే..
Operation Sindoor: ఆపరేషన్ సిందూర్పై..సచిన్, సెహ్వాగ్ సహా పలువురి క్రీడా ప్రముఖుల స్పందన
Bank of Baroda Recruitment: టెన్త్ అర్హతతో బ్యాంకులో ఉద్యోగాలు..నెలకు రూ.37 వేల జీతం
Read More Business News and Latest Telugu News
Updated Date - May 08 , 2025 | 05:12 AM