ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

India Airstrikes: హ్యాపీ సిందూర్‌ డే.. జైహింద్‌

ABN, Publish Date - May 08 , 2025 | 05:15 AM

ఆపరేషన్‌ సిందూర్‌పై సోషల్‌ మీడియాలో దేశభక్తి సందేశాలు, ప్రశంసల వర్షం కురిసింది. పీఓకే స్వాధీనం డిమాండ్లు, పాక్‌ వర్గాల్లో విభిన్న స్పందనలు కనిపించగా, శాంతి కోరే వినవింతలే ఎక్కువగా ఉన్నాయి.

హోరెత్తిన సోషల్‌ మీడియా

న్యూఢిల్లీ, మే 7: పాక్‌లోని ఉగ్రస్థావరాలపై భారత్‌ దాడి నేపథ్యంలో సోషల్‌ మీడియా హోరెత్తిపోయింది. ఈ దాడికి పెట్టిన ‘ఆపరేషన్‌ సిందూర్‌‘ హ్యాష్‌ట్యాగ్‌ వైరల్‌గా మారింది. ‘హ్యాపీ సిందూర్‌ డే, జైహింద్‌’ నినాదాలతో, దేశభక్తి సందేశాలతో మారుమోగింది. ఉగ్రస్థావరాలపై దాడులకు ఆపరేషన్‌ సిందూర్‌గా పేరుపెట్టడం నుంచి.. ఊహించని విధంగా, అత్యంత కచ్చితమైన దాడులు చేయడం, ఈ వివరాలను మహిళా అధికారులు వెల్లడించడం దాకా.. ప్రభుత్వం వ్యవహరించిన తీరు అద్భుతమంటూ ప్రశంసల వర్షం కురిసింది. పహల్గాం ఉగ్రదాడికి భారత్‌ సరైన సమాధానం ఇచ్చిందనే అభిప్రాయాలు ఒకవైపు... ఇదే ఊపులో పీఓకేను స్వాధీనం చేసుకుని, పాక్‌కు బుద్ధి చెప్పాలనే డిమాండ్లు మరోవైపు వెల్లువెత్తాయి. భారత్‌ దాడులపై పాకిస్థాన్‌ సోషల్‌ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని వర్గాల ప్రజల నుంచి భారత్‌ పట్ల ఆగ్రహం వ్యక్తమవుతుంటే.. మరికొందరు ఏదేమైనా ఇలాంటి పరిస్థితుల్లో పాక్‌ ఆర్మీ వెంట నిలవాల్సిన అవసరం ఉందంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కానీ అన్నింటికన్నా ఎక్కువగా... యుద్ధం వద్దు, శాంతి కావాలనే విజ్ఞప్తులే కనిపిస్తుండటం గమనార్హం.


ఇవి కూడా చదవండి:

Operation Sindoor: ఆపరేషన్ సింధూర్ అప్రమత్తమైన తెలంగాణ.. అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం ఆదేశాలు

Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ దాడికి ముందు..దాడి తర్వాత ఎలా ఉందంటే..

Operation Sindoor: ఆపరేషన్ సిందూర్‎పై..సచిన్, సెహ్వాగ్ సహా పలువురి క్రీడా ప్రముఖుల స్పందన

Bank of Baroda Recruitment: టెన్త్ అర్హతతో బ్యాంకులో ఉద్యోగాలు..నెలకు రూ.37 వేల జీతం

Read More Business News and Latest Telugu News

Updated Date - May 08 , 2025 | 05:15 AM