ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

MUDA Case: ముడా కేసులో సీఎం దంపతులకు హైకోర్టు నోటీసు

ABN, Publish Date - Apr 16 , 2025 | 06:34 PM

ముడాకు చెందిన 14 స్థలాలను అక్రమంగా తన భార్యకు కేటాయించారనే ఆరోపణలను సిద్ధరామయ్య ఎదుర్కొంటున్నారు. లోకాయుక్త పోలీసులు చేస్తున్న విచారణను సీబీఐకి అప్పగించాలంటూ గతంలో స్నేహమయి కృష్ణ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు తోసిపుచ్చింది. దీనిపై పిటిషనర్ మరోసారి కోర్టును ఆశ్రయించారు.

బెంగళూరు: మైసూర్ అర్బన్ డవలప్‌మెంట్ అథారిటీ (MUDA) భూముల కేటాయింపు కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసు విచారణను సీబీఐకి అప్పగించాలంటూ ఆర్టీఐ కార్యకర్త స్నేహమయి కృష్ణ దాఖలు చేసిన పిటిషన్‌పై కర్ణాటక హైకోర్టు విచారణ జరిపింది. దీనిపై సమాధానం ఇవ్వాల్సిందిగా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (Siddaramaiah), ఆయన భార్య పార్వతి, ఇతరులకు నోటీసులు జారీచేసింది.

Robert Vadra: దేశం వీడి వెళ్లే అవకాశంపై వాద్రా ఏమన్నారంటే..?


ముడాకు చెందిన 14 స్థలాలను అక్రమంగా తన భార్యకు కేటాయించారనే ఆరోపణలను సిద్ధరామయ్య ఎదుర్కొంటున్నారు. లోకాయుక్త పోలీసులు చేస్తున్న విచారణను సీబీఐకి అప్పగించాలంటూ గతంలో స్నేహమయి కృష్ణ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు తోసిపుచ్చింది. దీనిపై పిటిషన్లు మరోసారి కోర్టును ఆశ్రయించారు.


ఈ పిటిషన్‌ను చీఫ్ జస్టిస్ ఎన్‌వి అంజారియా, జస్టిస్ కెవి అరవింద్‌తో కూడిన డివిజన్ బెంచ్ తాజాగా విచారణ జరిపి సీఎం, ఆయన భార్య పార్వతికి నోటీసులు పంపింది. ఈనెల 28వ తేదీలోగా నోటీసులకు జవాబివ్వాలని ధర్మాసనం ఆదేశిస్తూ అదే తేదీకి తదుపరి విచారణను వాయిదా వేసింది.


ఇవి కూడా చదవండి...

Rahul Gandhi: రెండు రకాల గుర్రాలు.. గుజరాత్‌లో కాంగ్రెస్ వ్యూహంపై రాహుల్

BR Gavai: తదుపరి సీజేఐగా జస్టిస్ బీఆర్ గవాయ్

Ranya Rao Gold Smuggling Case: బళ్లారి నగల వ్యాపారి బెయిలు తిరస్కరణ

Ramdev: రామ్‌దేవ్ 'షర్‌బత్ జిహాద్' వ్యాఖ్యలపై దిగ్విజయ్ కేసు

Updated Date - Apr 18 , 2025 | 01:42 PM