Home » Siddaramaiah
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత డీకే శివకుమార్ రేపు(బుధవారం) కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. బెంగళూరులోని లోక్ భవన్లో జరగనున్న ప్రమాణస్వీకార కార్యక్రమం కోసం ఏర్పాట్లు శరావేగంగా సాగుతున్నాయి.
కర్ణాటక ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టనున్న డీకే శివకుమార్ తన క్యాబినెట్లో నలుగురు ఉప ముఖ్యమంత్రుల ప్రతిపాదనతో విభేదించినట్టు తెలుస్తోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం తన నిర్ణయాన్ని ఆయన కేంద్ర అధిష్ఠానానికి తెలియజేశారు.
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య రాజీనామాతో డీకే శివకుమార్ ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టనుండటం ఖాయమైంది. నాయకత్వ మార్పు నేపథ్యంలో తన కుమారుడు, ఎమ్మెల్యే యతీంద్ర సిద్ధరామయ్యకు ఉపముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని సిద్ధరామయ్య కోరినట్టు పార్టీ విశ్వసనీయ వర్గాల సమాచారం.
కర్ణాటక ముఖ్యమంత్రి పదవికి సిద్దరామయ్య రాజీనామా నిజానికి అంత నిశ్శబ్దంగా సాగ లేదు. తాను కుర్చీ ఖాళీ చేస్తూ.. తన తదుపరి వారసుడు డీకే శివకుమార్కు, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి ఒక పవర్ ఫుల్ 'పొలిటికల్ టైమ్ బాంబ్'ను బహుమతిగా ఇచ్చి వెళ్లారు.
కర్ణాటక ఎన్నికల చరిత్రలో గత 40 ఏళ్లుగా ఏ అధికార పార్టీ కూడా వరుసగా రెండోసారి అధికారంలోకి రాలేకపోయింది. కర్ణాటక కొత్త సీఎంగా పదవీ పగ్గాలు చేపట్టబోతోన్న డీకే శివకుమార్ చేతిలో కేవలం రెండేళ్ల సమయం మాత్రమే ఉంది.
కర్ణాటక రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి పదవికి సిద్ధరామయ్య రాజీనామా చేశారు. గురువారం మధ్యాహ్నం ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్తో కలిసి ఆయన లోక్భవన్కు వెళ్లి.. తన రాజీనామా పత్రాన్ని సమర్పించారు.
గురువారం ఉదయం మంత్రులకు తన నివాసంలో సిద్దరామయ్య అల్పాహార విందు ఇచ్చారు. ఈ విందులో ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్తో పాటు మంత్రులు పాల్గొన్నారు.
కర్ణాటక ముఖ్యమంత్రి మార్పుపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య రాజీనామా చేసే అవకాశాలపై ప్రచారం జోరుగా సాగుతున్న నేపథ్యంలో, కర్ణాటక గవర్నర్ థావర్ చంద్ గహ్లోత్ సూపర్ ట్విస్ట్ ఇచ్చారు.
కర్ణాటకలో నాయకత్వ మార్పిడి సజావుగా పూర్తి చేసేందుకు కేంద్ర నాయకత్వం గట్టి కసరత్తే చేస్తోంది. ఇందులో భాగంగా సీఎం సిద్ధరామయ్య సేవలను కేంద్ర స్థాయిలో ఉపయోగించునేందుకు వీలుగా ఆయనను రాజ్యసభకు పంపాలని పట్టుదలగా ఉంది.
కర్ణాటకలో నాయకత్వ మార్పుపై కాంగ్రెస్ అధిష్ఠానం చురుగ్గా పావులు కదుపుతోంది. మే 30వ తేదీ శనివారంనాడు కొత్త ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం చేసే అవకాశాలున్నాయని పార్టీ వర్గాల తాజా సమాచారం. కొత్త మంత్రివర్గంలో ముగ్గురు ఉపముఖ్యమంత్రులకు చోటు కల్పిస్తారని తెలుస్తోంది.