Home » Siddaramaiah
కర్ణాటకలో నాయకత్వ మార్పు చోటుచేసుకోనుందంటూ వస్తున్న ఊహాగానాలు తగ్గుముఖం పట్టడం లేదు. కర్ణాటక వార్షిక బడ్జెట్ కీలక సమావేశానికి ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ గైర్హాజరు కావడం, ఢిల్లీకి బయలుదేరి వెళ్లడంతో మరోసారి ఈ ఊహాగానాలు ఊపందుకున్నాయి
మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం స్థానే కేంద్రం తీసుకువచ్చిన 'వీబీ జీ రామ్ జీ' చట్టాన్ని రద్దు చేయాలంటూ కాంగ్రెస్ మంగళవారంనాడు నిరసన కార్యక్రమాలు చేపట్టింది. ఇందులో సిద్ధరామయ్య పాల్గొన్నారు.
శివకుమార్ పోస్ట్ కీలకమైన రాజకీయ సంకేతంగా రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యమంత్రి కావాలనే తన ఆకాంక్షను డీకే శివకుమార్ చాలాకాలం క్రితమే వ్యక్తం చేశారు.
విద్వేష ప్రసంగాల నిరోధక బిల్లుపై గవర్నర్ను బీజేపీ కలవాలని అనుకుంటున్నట్టు వస్తున్న సమాచారంపై సిద్ధరామయ్య మాట్లాడుతూ, ఈ బిల్లును గవర్నర్ తోసిపుచ్చలేదని చెప్పారు.
కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్కు సీఎం పగ్గాలు అప్పగించనున్నారంటూ ఇటీవల ఊహాగానాలు ఊపందుకోవడంతో పార్టీ అధిష్ఠానం జోక్యం చేసుకుంది. ఒకరినొకరు విందు సమావేశాలకు ఆహ్వానించుకుని కూర్చుని మాట్లాడుకోవాలని సూచించింది.
కర్ణాటక ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ ఐదు ఎన్నికల హామీలను ఇచ్చిందని, 1951 ప్రజాప్రాతినిధ్య చట్టంలోని నిబంధనలకు ఇవి విరుద్ధమని పిటిషనర్ గతంలో కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు.
నాయకత్వ మార్పుపై అందరిలోనూ గందరగోళం నెలకొన్న నేపథ్యంలో సిద్ధరామయ్య ఇటీవల తన నివాసంలో డీకేకు బ్రేక్ఫాస్ట్ ఇచ్చారు. రెండో రౌడ్ బ్రేక్ఫాస్ట్ చర్చలు ఈసారి డీకే నివాసంలో జరిగాయి.
సిద్ధరామయ్య, డీకే మధ్య అధికార పంపణీ విషయంలో విభేదాలు తలెత్తడంతో కాంగ్రెస్ అధిష్ఠానం ఇటీవల ఇద్దరు నేతలకు కొన్ని సూచనలు చేసింది. ముందుగా ఇరువురు నేతలు కలిసి చర్చించుకోవాలని, ఐక్యతా సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించింది.
పార్టీ అధిష్ఠానాన్ని కలుసుకునేందుకు ఢిల్లీ ప్రయాణానికి డీకే సిద్ధమవుతున్నారు. ఆయన సోదరుడు డీకే సురేష్ ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు. అయితే అధికార మార్పిడి అంశంపై సోదరులిద్దరూ పెదవి విప్పడం లేదు.
నాలుగైదు నెలల క్రితమే మంత్రివర్గ విస్తరణపై కాంగ్రెస్ కేంద్ర నాయకత్వం అంగీకరించిందని, అయితే ప్రభుత్వం రెండున్నరేళ్ల పాలన పూర్తి చేసేంత వరకూ ఆగాల్సిందిగా తాను సూచించానని సిద్ధరామయ్య చెప్పారు.