నలుగురిపై నక్క దాడి
ABN, Publish Date - Aug 19 , 2025 | 01:11 PM
నగరంలోని శ్రీరామ నగర్ పరిసరాల్లో సోమవారం బాలిక అక్కనాగమ్మతోపాటు మరో నలుగురు వ్యక్తులు రంగణ్ణ, మంజునాథ్, పూజాల పై నక్క ఆకస్మికంగా దాడి చేసింది. ఆహారం కోసం వెతుకుతూ నగరంలోకి ప్రదవేశించి ఉంటుందని స్థానికులు అంచనా వేస్తున్నారు. పరిసరాల్లో ఆడుకుంటున్న బాలికపై నక్క దాడి చేస్తు పక్కనే ఉన్న వ్యక్తుల పై కూడా దాడికి దిగింది.
రాయచూరు(బెంగళూరు): నగరంలోని శ్రీరామ నగర్ పరిసరాల్లో సోమవారం బాలిక అక్కనాగమ్మతోపాటు మరో నలుగురు వ్యక్తులు రంగణ్ణ, మంజునాథ్, పూజాల పై నక్క ఆకస్మికంగా దాడి చేసింది. ఆహారం కోసం వెతుకుతూ నగరంలోకి ప్రదవేశించి ఉంటుందని స్థానికులు అంచనా వేస్తున్నారు. పరిసరాల్లో ఆడుకుంటున్న బాలికపై నక్క దాడి చేస్తు పక్కనే ఉన్న వ్యక్తుల పై కూడా దాడికి దిగింది.
ఈ దాడిలో గాయపడిన నలుగురిని స్థానికులు చికిత్స కోసం రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న అటవీ శాఖ అధికారులు వెంటనే రంగంలోకి దిగి నక్కను నిర్భంధించారు. కొంత మంది నక్కకు పిచ్చి పట్టి ఉంటుందని అనుమానం వ్యక్తం చేస్తుండగా అటవి శాఖ అధికారులు నాల్గు రోజుల పాటు పశువైద్య శాఖ ఆధ్వర్యంలో ఉంచుకుని తరలిస్తామని తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
గుడ్న్యూస్.. స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు
విద్యుత్ షాక్తో తండ్రీకొడుకుల మృతి
Read Latest Telangana News and National News
Updated Date - Aug 19 , 2025 | 01:11 PM