Home » Bengaluru News
నేను మళ్లీ బీజేపీలో చేరుతా, ఎవరూ అడ్డుకోలేరని శివమొగ్గ నుంచి ఇండిపెండెంట్గా పోటీ చేసిన బీజేపీ సీనియర్ నేత, మాజీమంత్రి ఈశ్వరప్ప(Former Minister Eshwarappa) సవాల్ విసిరారు. పార్టీ నుంచి సస్పెన్షన్ వేటు వేయడంపై ఈశ్వరప్ప స్పందించారు.
గరంలోని దేవరజీవనహళ్ళి (డీజే హళ్ళి) పరిధిలో ఓ గుర్రానికి ప్రాణాంతకమైన గ్లాండర్స్(Glanders) జబ్బు నిర్ధారణ అయ్యింది. ఇదో ప్రాణాంతకమైన వైరస్ అని పశుసంవర్ధకశాఖ గుర్తించింది. డీజే హళ్ళి(DJ Halli)లోని ఖలీద్ షరీఫ్ అనే వ్యక్తికి చెందిన గుర్రానికి గ్లాండర్స్ జబ్బు ఉన్నట్లు వైద్యులు నిర్ధారించామన్నారు.
రాష్ట్రంలో ఎన్నికల ప్రచారానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ(Prime Minister Narendra Modi) మరోసారి రానున్నారు. ఈనెల 20న శనివారం చిక్కబళ్ళాపుర, బెంగళూరు(Chikkaballapura, Bangalore)లలో అభ్యర్థుల తరపున ప్రచారం చేయనున్నారు.
బిడది సమీపంలో రోడ్డు పక్కన ఉండే ఆస్తిని రాయించుకునేందుకు 9ఏళ్ల బాలికను కిడ్నాప్ చేసిన వారికి ఓటేస్తారా.. అంటూ డీసీఎం డీకే శివకుమార్పై పరోక్షంగా మాజీ ప్రధాని దేవెగౌడ(Former Prime Minister Deve Gowda) ఆరోపించారు.
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న గ్యారెంటీలతో గ్రామీణ మహిళలు దారి తప్పుతున్నారని మాజీ ముఖ్యమంత్రి, మండ్య లోక్సభ అభ్యర్థి కుమారస్వామి(Kumaraswamy) చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి.
‘మిస్టర్ కుమారస్వామి నువ్వు మండ్యలో గెలవలేవు... అసెంబ్లీలో చర్చిద్దాం రా.. నాపై చేసిన ఆరోపణలకు అక్కడే సమాధానం చెబుతా’ అని ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్(Deputy Chief Minister DK Shivakumar సవాల్ విసిరారు.
సీఎం సిద్దరామయ్య ప్రాతినిథ్యం వహిస్తున్న మైసూరు జిల్లాలో ఎన్నికల వేళ కాంగ్రెస్కు షాక్లు తగులుతున్నాయి. సీఎంకు అత్యంత ఆప్తుడిగా పేరొందిన గురుపాదప్ప పార్టీకి గుడ్బై చెప్పారు. సీఎం సొంత నియోజకవర్గం వరుణలో లింగాయత్ సమాజానికి చెందిన గురుపాదప్ప ప్రతిభావంతమైన వ్యక్తి. చాముండేశ్వరితో పాటు మైసూరు, చామరాజనగర్(Mysore, Chamarajanagar) జిల్లాలోను ఆయన ప్రభావం ఉంది.
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల ప్రచారానికి ప్రముఖ తెలుగు నటుడు, జనసేన పార్టీ వ్యవస్థాపకుడు పవన్ కల్యాణ్(Pawan Kalyan) హాజరు కానున్నారు. లోక్సభ ఎన్నికలు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు విజయేంద్ర ఒక పరీక్షగా మారాయి.
తొలివిడత ప్రచారం మలివిడత నామినేషన్ల హోరు రాష్ట్రంలో ఎన్నికల వేడి పెంచుతోంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ(Prime Minister Narendra Modi) రాష్ట్రంపై ప్రత్యేక దృష్టి సారించారు. నామినేషన్లకు ముందే ఒక విడత ప్రచారం ముగించిన ప్రధాని మరో పది రోజుల్లో రెండుసార్లు రాష్ట్ర పర్యటనకు వస్తున్నట్టు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది.
వారిద్దరూ బీజేపీ ఎమ్మెల్యేలు... గత ప్రభుత్వంలో మంత్రులుగాను వ్యవహరించారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల తరపున బహిరంగంగానే ప్రచారం చేస్తున్నారు. బెంగళూరు యశ్వంతపుర బీజేపీ ఎమ్మెల్యే ఎస్టీ సోమశేఖర్(Bengaluru Yeswantapura BJP MLA ST Somasekhar),